
● మండల, గ్రామీణ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకే విద్యార్థుల
ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపాల్తో పాటు 10 మంది లెక్చరర్లు ఉన్నారు. వీరంతా కళాశాలలు ప్రారంభం కాకముందే మండలంలోని చుట్టుపక్కల గ్రా మాల్లో ప్రచారం చేపట్టారు. తమ కళాశాలలో వసతులు, విద్యాబోధన తీరుపై అవగాహన కల్పించారు. ఈ కళాశాలలో మొత్తం 540 సీట్లు అందుబాటులో ఉండగా ఈ విద్యాసంవత్సరం ఇప్పటి వరకు కేవలం 30 మంది మాత్రమే ప్రవేశాలు పొందడం గమనార్హం.
ప్రైవేట్ ప్రలోభాలకు తలొగ్గొద్దు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన వి ద్యాబోధనతో పాటు అన్ని మౌలిక వసతులు ఉన్నాయి. అర్హత గల లెక్చరర్లతో వి ద్యాబోధన ఉంటుంది. కొన్ని ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను ప్రలోభాలకు గురిచేసి అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. ఆయా కళాశాలల్లో తరగతులు పూర్తిస్థాయిలో జరగడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయి.
– ఎ.శ్రీనివాస్, ప్రిన్సిపాల్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇచ్చోడ
ఆదిలాబాద్టౌన్: విద్యార్థుల ట్రెండ్ మారింది. సబ్జెక్టుపై పట్టు సాధించడం కాకుండా సులువుగా డిగ్రీ పట్టా పొందాలని ఆరాటపడుతున్నారు. గతంలో డిగ్రీ చదవాలంటే పల్లెల నుంచి పట్నానికి రావాల్సి వచ్చేది. సీటు దొరకడం కూడా గగనంగానే ఉండే ది. విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టి మరీ పరీక్షల్లో సత్తా చాటేవారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీతత్వం పెరుగుతుండగా, దాన్ని అందిపుచ్చుకోవాల్సి న విద్యార్థులు అడ్డదారిలో డిగ్రీ సర్టిఫికెట్ పొందేందుకు యత్నిస్తున్నారు. వారి అమాయకత్వాన్ని ప లు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఆసరాగా చేసుకుని సొ మ్ము చేసుకుంటున్నాయి. కళాశాలకు రాకపోయినా, పరీక్ష ఫీజు చెల్లించకపోయినా, ప్రాక్టికల్ పరీక్షలు చూసి రాయిస్తామని వారిని ఆకర్షిస్తున్నాయి. సెల్ఫ్ సెంటర్తో పాస్ గ్యారెంటీ అనే అభయం ఇస్తుండడంతో పేద విద్యార్థులతో పాటు జిల్లా కేంద్రంలోని విద్యార్థులు సైతం ఆయా మండలాలు, గ్రామాల్లోని కళాశాలల్లో చేరి పోతున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైనప్పటికీ విషయ పరిజ్ఞానం లేకపోవడంతో పోటీ పరీక్షల్లో వెనుకడుగు వేయాల్సి వస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలు సైతం విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఎత్తివేసే ఆలోచనల్లో పడ్డాయి.
పాస్ గ్యారంటీ హామీ..
జిల్లాలో 25 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీ టితో పాటు ఆదిలాబాద్లో సైన్స్, ఆర్ట్స్ అండ్ కామ ర్స్ డిగ్రీ కళాశాలలు, ఇచ్చోడ, ఉట్నూర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అలాగే జిల్లా కేంద్రంలో మూడు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులు ఇంటర్ పాసైన వెంటనే వారి ఇళ్లకు వెళ్లి సర్టిఫికెట్లను తీసుకుంటున్నారు. వారే ఆన్లైన్ ద్వారా అప్లై చేసి తమ కళాశాలల్లో చేర్పించుకుంటున్నారు. వి ద్యార్థుల ఫోన్ నంబర్లకు బదులు కళాశాల యాజ మాన్యం ఓటీపీలు ఇచ్చుకోవడంతో విద్యార్థులు ఏమి చేయలేని పరిస్థితి. అయితే ఇదివరకు ఉ ట్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బేల, తాంసి, తలమడు గు, బోథ్ తదితర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాని కి వచ్చి విద్యార్థులు ఇంటర్, డిగ్రీ చదివేవారు. ప్ర స్తుతం సీన్ రివర్స్ అయింది. జిల్లా కేంద్రంలోని కళాశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. తమ కళాశాలలో చేరితే పాస్ గ్యారంటీ.. కాలేజ్కు రానవసరం లేదు.. సెల్ఫ్ సెంటర్ అంటూ ప్రలో భాలకు గురిచేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి మూడేళ్లు చదివితే కళాశాల యాజమాన్యానికి ఫీజు రీయింబర్స్మెంట్ రూ.45వేల నుంచి రూ.50వేల వరకు వస్తున్నాయి. చాలా ప్రైవేట్ కళాశాలల్లో తరగతులు నిర్వహించడం లేదు. ఒకరిద్దరు లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నారు. వారికి సైతం జీతాలు ఇచ్చే అవసరం లేకపోవడంతో విద్యార్థుల ఫీజురీయింబర్స్మెంట్తో లబ్ధి పొందుతున్నారు.
మాస్ కాపీయింగ్పైనే..
చాలా మంది ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులు మాస్ కాపీయింగ్పైనే ఆధారపడి ఉంటున్నారు. ఎలాగైనా పాస్ అవ్వాలనే ఆలోచనలో ఉండడంతో జిల్లాలోని ఆయా మండలాల్లోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బజార్హత్నూర్, నేరడిగొండ, ఉండం, బేల కళాశాలలతో పాటు పలు కళాశాలల్లో చేరుతున్నట్లు సమాచారం. పరీక్షల సమయంలో ఆయా యాజమాన్యాలకు ఒక్కో పరీక్షకు రూ.200 నుంచి రూ.500 వరకు ఇస్తూ హాజరవుతున్నట్లు సమాచారం.