
ఆస్తుల లెక్క.. ఇక పక్కా
● ప్రారంభమైన ‘భువన్’ సర్వే ● బల్దియాలో పకడ్బందీగా కొనసాగుతున్న ప్రక్రియ
కై లాస్నగర్: పట్టణంలోని ఆస్తుల (అసెస్మెంట్) లెక్క ఇక పక్కాగా తేలనుంది. భువన్ యాప్ ద్వారా బల్దియా అధికారులు ప్రత్యేక సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈనెల 17నుంచి క్షేత్రస్థాయి కి వెళ్లి వాస్తవ విస్తీర్ణం ఆధారంగా వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. నివాస గృహాలతో పాటు వాణిజ్యపరమైన భవనాలను సైతం పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగానే ఇక పన్ను మదింపు ఉంటుంది.
పక్కాగా పన్ను మదింపు..
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 48,448 అసెస్ మెంట్లు ఉండగా వాటికి గాను ఏడాదికి రూ. 13.96 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉంది. ఇందులో ఏటా సుమారు రూ.8 కోట్ల వరకు వసూలవుతున్నాయి. అయితే పన్ను విధింపులో అనేక అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో బల్దియా సి బ్బంది యజమానులతో కుమ్మకై ్క చేతివాటం ప్రదర్శిస్తూ ఆస్తి విలువను తక్కువగా నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొంతమంది వాణిజ్యపరమైన ఆస్తులను సైతం నివాసగృహంగా చూపించి తక్కువగా పన్ను చెల్లిస్తున్నా రు. ఇలాంటి వాటికి చెక్ పట్టేలానే ఉద్దేశంతోనే ప్రభుత్వం భువన్ యాప్ సర్వేకు ఆదేశించింది. ఇందులో భాగంగా బల్దియా సిబ్బంది ఇంటింటికి వెళ్లి జీపీఎస్ ట్రాకింగ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. దీంతో ఆస్తి పన్ను మదింపు పక్కగా ఉండటంతో పాటు వసూళ్లు సైతం పెరగనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
సర్వే సాగుతుందిలా...
ఈ యాప్ ద్వారా పట్టణంలోని ఆస్తుల లెక్క తేల్చేందుకు 15 మంది బల్దియా బిల్ కలెక్టర్లను ఎంపిక చేశారు. వారికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్వర్డులతో కూడిన లాగిన్లను కేటాయించారు. వీరంతా తమకు కేటాయించిన వార్డులకు వెళ్లి క్షేత్రస్థాయిలో ఆస్తుల వివరాలను సేకరించనున్నారు. నివాస, వాణిజ్యపరమైన భవనాలను వెనుక, ముందు భాగాల్లో రెండు ఫొటోలు తీసుకుంటారు. వాటి విస్తీర్ణం ఎంత అనే కొలతలను లెక్కిస్తారు. భవన యాజమాని ఆధార్ నంబర్ నమోదు చేయగానే వారి వివరాలు కనిపించే అవకాశమున్నందున వీటి వివరాలను భువన్యాప్లో జీపీఎస్ విధానంలో నమోదు చేస్తారు. గతంలో చేపట్టిన సర్వేలో మిగిలిపోయి న 8,478 ఆస్తులతో పాటు ఇటీవల కొత్తగా న మోదైన 10వేల ఆస్తులను సైతం ఇందులో నమోదు చేయనున్నారు. వాటి ఆధారంగా ఆ ఆస్తులకు పన్ను విధిస్తారు. అలాగే ప్రతీ ఆస్తికి 10 అంకెలతో కూడిన ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పిటిన్)ను కేటాయిస్తారు. ఇలా వివరాలు పక్కాగా సేకరించడం ద్వారా బల్ది యాకు పన్నుల రూపంలో మరింత ఆదాయం సమకూరే అవకాశముంది. సర్వే పర్యవేక్షణ కోసం బల్దియాలో ఐదుగురు రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. నాలుగు రోజుల క్రితం సర్వే ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు.
పకడ్బందీగా సర్వే..
పట్టణంలోని ఆస్తులను పక్కాగా తె ల్చేందు కోసమే ప్రభుత్వం భువన్ యాప్ ద్వారా సర్వే కు ఆదేశించింది. అందుకనుగుణంగా ఆస్తుల సర్వే చేపట్టాం. పకడ్బందీగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 628 ఇళ్ల వివరాలను సేకరించి యాప్లో నమోదు చేశాం.
– కళ్యాణ్, బల్దియా రెవెన్యూ అధికారి
పట్టణంలో..
వార్డులు 49
ఓల్డ్ అసెస్మెంట్లు 8,478
న్యూ అసెస్మెంట్లు 10,980
సర్వేకు ఎంపిక చేసిన సిబ్బంది 15