ఉన్నతస్థాయికి ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

ఉన్నతస్థాయికి ఎదగాలి

Jun 21 2025 3:27 AM | Updated on Jun 21 2025 3:27 AM

ఉన్నతస్థాయికి ఎదగాలి

ఉన్నతస్థాయికి ఎదగాలి

ఆదిలాబాద్‌టౌన్‌: పోలీసుల పిల్లలు బాగా చది వి అత్యున్నత స్థాయికి ఎదగాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. పోలీసు ముఖ్య కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు క నక పూనరాం కూతురు వైష్ణవికి ఐఐటీ ముంబైలో సీటు లభించింది. ఈమేరకు జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఆమెను శుక్రవా రం శాలువాతో సత్కరించారు. ఇందులో అదనపు ఎస్పీ సురేందర్‌ రావు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు వెంకటి, చంద్రశేఖర్‌, పోలీసు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

బాధిత కుటుంబానికి అండగా ఉంటూ సహా య సహకారాలు అందిస్తామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంతో మృతిచెందిన హెడ్‌కానిస్టేబుల్‌ ఆర్‌.దిగంబర్‌ కుటుంబానికి శుక్రవారం రూ.8లక్షల భద్రత చెక్కును అందజేశారు.

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

ఇంద్రవెల్లి: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బందిని పెండింగ్‌ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీటు దాఖలు చేయాలని సూచించారు. ఆయన వెంట ఉట్నూర్‌ ఏఎస్పీ కాజల్‌సింగ్‌, సీఐ మొగిలి, ఎస్సై సాయన్న, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement