
‘పీఎం జన్మన్’ సద్వినియోగం చేసుకోవాలి
ఉట్నూర్రూరల్: పీఎం జన్మన్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభారి అధికా రి, డిప్యూటి సెక్రెటరీ గణేశ్ నిరంజన్ అన్నారు. ఉట్నూర్ ఐటీడీఏలో దర్థి అబ జనభాగిదారి అభియాన్ అవగాహన శిబిరానికి శుక్రవారం ఆయన హాజరయ్యారు. ముందుగా ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఆయనకు మొక్క అందించి స్వాగతం పలికా రు. అనంతరం మండలంలోని దంతన్పల్లి, కొలాంగూడ కమ్యూనిటి హాళ్లలో దాల్మిల్ శిక్షణ పొందుతున్న వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. జ న్మన్ పథకం ప్రజలకు చేరువయ్యేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వైద్యాధికారులు ఏర్పాటు చేసిన సికిల్సెల్ శిబిరాన్ని పరిశీలించారు. ఎంత మంది బాధితులు ఉన్నారని డీఎంహెచ్వో నరేందర్రాథోడ్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో సబ్కలెక్టర్ యువరాజ్ మార్మట్, డీటీడబ్ల్యూవో తిరుపతి, మాజీ సర్పంచ్ తిరుపతి, ఎఫ్డీవో రేవంత్, జిల్లా సార్మేడీ దుర్గు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
సమాక గ్రామంలో..
ఇంద్రవెల్లి: మండలంలోని సమాక గ్రామ పంచా యతీ పరిధిలోని మారుతిగూడ పీవీటీజీ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మల్టీపర్పస్ సెంటర్ భవనాన్ని గణేశ్ నిరంజన్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. కొలాం గిరిజనులతో మాట్లాడారు. వారి స్థితిగతులు, జీవన విధానం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు.