
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య
● వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి
ఆదిలాబాద్టౌన్: సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందని వరంగల్ ఆర్జేడీ సత్యనారా యణ రెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భా గంగా జిల్లా కేంద్రంలోని ఎన్జీవో పాఠశాలతో పా టు పలు పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన సామూహిక అక్షరభ్యాస కార్యక్రమాల్లో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆర్జేడీ ఓనమాలు దిద్దించారు. అనంతరం మాట్లాడుతూ సర్కారు బడుల బలోపేతం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్రూరల్: మండలంలోని తంతోలి ఎంపీయూపీఎస్లో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆర్జేడీ పాల్గొన్నారు. విద్యార్థులతో అక్షరాలు దిద్దించారు.
ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో డీఎడ్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి ఈ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4,085 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాల్సి ఉండగా, 3,155 మంది హాజరైనట్లు తెలిపారు. ఈనెల 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. 20న సీట్ల కేటాయింపు, 21 నుంచి 24 వరకు ఫీజు చెల్లింపు, 26న కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.