
వార్డు ఆఫీసర్లకు ‘యువ వికాసం’ బాధ్యతలు
● ఐదు వార్డులకో ప్రత్యేకాధికారి
కై లాస్నగర్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనకు గాను మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు. ప ట్టణంలోని 49 వార్డులకు గాను 49 మందిని నియమిస్తూ కమిషనర్ సీవీఎన్. రాజు ఉత్తర్వులు జారీచేశారు. ఆయా వార్డుల్లోని ప్రభుత్వ పాఠశాలలు, క మ్యూనిటీ సెంటర్లు, ఆలయాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల వివరాలను వార్డుల వారీగా ప్రత్యేకాధికారులకు అందజేశారు. ఈ మేరకు వారు బుధవా రం తమ పరిధిలోని వార్డుల్లో పర్యటించి దరఖాస్తుదారు ఆధార్కార్డు, కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రా లు, బ్యాంకు అకౌంట్ వంటి వివరాలను సేకరించారు. అలాగే ఐదు వార్డులకో ప్రత్యేక పర్యవేక్షణా ధికారిని కూడా నియమించారు. 1నుంచి 5 వార్డులకు డీఈ తిరుపతి, 6నుంచి 10 వార్డులకు డీఈ కార్తీక్, 11నుంచి 16వార్డులకు మెప్మా డీఎంసీ శ్రీని వాస్, 17నుంచి 21వార్డులకు మేనేజర్ స్వా మి, 23నుంచి 28 వార్డులకు శానిటరీ ఇన్స్పెక్టర్ బి.శంకర్, 29నుంచి 34వార్డులకు ఏవో రాజ్కుమార్ గౌ డ్, 35నుంచి 40వార్డులకు టీపీఎస్ నవీన్కుమార్, 41నుంచి 45 వార్డులకు సీనియర్అకౌంటెంట్ శ్రీని వాస్, 46నుంచి 49 వార్డులకు శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ను ప్రత్యేకాధికారులుగా నియమించారు.