కొత్త డీఈవో జిల్లాకు వచ్చేనా..?● | - | Sakshi
Sakshi News home page

కొత్త డీఈవో జిల్లాకు వచ్చేనా..?●

Apr 2 2025 1:04 AM | Updated on Apr 2 2025 1:04 AM

కొత్త డీఈవో జిల్లాకు వచ్చేనా..?●

కొత్త డీఈవో జిల్లాకు వచ్చేనా..?●

● విధుల్లో చేరుతారో.. లేదోనని విద్యాశాఖలో ప్రచారం

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాకు కొన్నేళ్లుగా రెగ్యులర్‌ డీఈవో కరువయ్యారు. ఐదేళ్లుగా ఇన్‌చార్జీలతో నే కాలం వెల్లదీస్తున్నారు. దీంతో వి ద్యా వ్యవస్థ గాడి త ప్పింది. గతంలో డైట్‌ కళాశాల ప్రిన్సి పాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించగా, ఆ తర్వాత నిర్మల్‌ జిల్లాలో ఏడీ, డీఈవోగా విధులు నిర్వహిస్తున్న ప్రణీతను ఇక్కడికి బదిలీ చేశారు. మూడున్నరేళ్ల పాటు ఆమె జిల్లాలో ఇన్‌చార్జి డీఈవోగా పనిచేశారు. మార్చి 31న ఉద్యోగ విరమణ పొందిన విష యం తెలిసిందే. ప్రస్తుతం పదో తరగతి పరీ క్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ మోడల్‌ స్కూ ల్‌ డిప్యూటీ డైరెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశా రు. హైదరాబాద్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న దుర్గా ప్రసాద్‌కు ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తించేందుకు అనాసక్తిగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయనను ఆ శాఖ ఉద్యోగులు ఫోన్‌ ద్వారా సంప్రదించగా, అంతగా ఆసక్తి చూపడం లేదన్నట్టుగావారు పేర్కొంటున్నారు. అయి తే ప్రస్తుతం ఆయన పదో తరగతి పరీక్షలకు సంబంధించి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అబ్జర్వర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం పది పరీక్షలు ముగియనున్నాయి. ఆ తర్వా త ఆయన విధుల్లో చేరుతారో లేదో తెలి యాల్సి ఉంది. ప్రస్తుతం ఇన్‌చార్జి బాధ్యతలు ఎవరికీ ఇవ్వలేదు. ఈనెల 7 నుంచి 15 వరకు పదో తరగతి మూల్యాంకనం షురూ కానుంది. అయితే ప్రస్తుతం కేటాయించిన దుర్గాప్రసాద్‌ విధుల్లో చేరుతారా లేకపోతే కొత్తవారికి అదనపు బాధ్యతలు ఇస్తారా, కొత్తవారిని కేటాయించేంత వరకు విద్యా శాఖ ఏడీకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తారా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement