breaking news
Worse condition
-
పేరులో భాగ్యం.. తీరులో దౌర్భాగ్యం
సాక్షి, లక్ష్మీపురం(గుంటూరు): పేరులో భాగ్యం ఉన్నా.. తీరులో మాత్రం దౌర్భగ్యంగా ఉంది. నగరంలోని భాగ్యనగర్ ప్రాంతంలో రోజు రోజుకు పారిశుద్ధ్య సమస్యలతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు ఉన్నతాధికారులు పారి«శుద్ధ్య సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించాలని ఆదేశాలు జారీ చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేరని వాపోతున్నారు. స్థానిక మారుతీనగర్ ప్రాంతంలో నుంచి భాగ్యనగర్ మహాప్రస్థానం మీదుగా స్వర్ణాంధ్రనగర్, తురకపాలెం వైపుగా వెళ్లే దారి మురుగు, చెత్తతో నిండిపోయి ఉంది. ఇటుగా వాహనదారులు ప్రయాణించాలంటే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయేనని ఆందోళన చెందుతున్నారు. తవ్వారు వదిలేశారు భాగ్యనగర్లో నగరపాలక సంస్థ అధికారులు ఇటివల కాలంలో యూజీడి పనులు కోసం గుంతలు తవ్వి పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో స్థానికంగా నివాసం ఉండే వారు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని అంటున్నారు. అయితే పనులు పూర్తి అయిన తరువాత యథావిధిగా ఉంచాల్సిన రోడ్డును వదిలేసి వెళ్లి పోయారు. దీంతో నిత్యం ఈ ప్రదేశంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు రోడ్డు పైకి రావాలంటే ఆందోళన చెందుతున్నారు. నిత్యం చెత్త కుప్పలతో నిండిపోయి తినుబండారాలు సైతం దుర్వాసన వెదజల్లుతున్నాయని వాపోతున్నారు. ఈ ప్రాంతం చెత్తకుప్పలతో నిండిపోవడం, పారిశుద్ధ్య పనులు కూడా సకాలంలో జరుగక పోవడంతో ఈ ప్రాంత వాసులు విషజ్వరాలతో ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిన దుస్తుతి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగాలు వస్తున్నాయి పేరుకు భాగ్యనగర్ తమ ప్రాంతంలో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఊరు మధ్యలో ఉన్న ఊరు చివరలో ఉన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. భాగ్యనగర్ ప్రాంతం నుంచి తురకపాలెం వెళ్లేందుకు నిత్యం భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దీనికి తోడు పేరుకు పోయిన చెత్తతో ఇబ్బందులు పడుతున్నాం. – విజయలక్ష్మి, స్థానికురాలు రోడ్డు బురదమయం మహాప్రస్థానం నుంచి భాగ్యనగర్ ప్రాంతంలో రోడ్డు సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షం పడితే చాలు రోడ్డంతా బురదమయంగా మారుతుంది. దీనికితోడు చెత్త కుప్పలు, భరించలేని దుర్వాసనతో స్థానికంగా విషజ్వరాల పాలవుతున్నాము.నిత్యం చెత్త కుప్పలతో నిండిపోయి తినుబండారాలు సైతం దుర్వాసన వెదజల్లుతున్నాయని వాపోతున్నారు. ఈ ప్రాంతం చెత్తకుప్పలతో నిండిపోవడం, పారిశుద్ధ్య పనులు కూడా సకాలంలో జరుగక పోవడంతో ఈ ప్రాంత వాసులు విషజ్వరాలతో ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిన దుస్తుతి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -జోసఫ్, స్థానికుడు -
హైదరాబాద్లో రోడ్లపై వాహనదారుల కష్టాలు
-
కోళ్ల పరిశ్రమకు రాయితీ కావాలి: ఎన్ఈసీసీ
హైదరాబాద్: కోళ్ల పరిశ్రమ తీవ్ర గడ్డు స్థితిలో ఉందని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (నెక్) ఆవేదన వ్యక్తం చేసింది. బ్యాంకింగ్ రుణాలు, వడ్డీ పునః చెల్లింపులపై ఏడాది పాటు మారటోరియం విధించాలని ప్రభుత్వానికి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. కనీసం 6 శాతం వడ్డీ సబ్వెర్షన్ మూడేళ్ల పాటు అమలు చేయాలని కోరింది. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో అదనపు వర్కింగ్ కేపిటల్ రుణాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఎగుమతులు, స్పెక్యులేషన్, కనీస మద్దతు ధరల పెంపు వంటి పలు కారణాల వల్ల గడచిన నాలుగేళ్లుగా మొక్కజొన్న, సొయా వంటి కోళ్ల దాణా వ్యయం భారీగా పెరిగిందని పేర్కొంది. ఆయా కారణాల వల్ల గత ఏడాది రూ.2.60 ఉన్న గుడ్డురేటు ప్రస్తుతం రూ.3.50 స్థాయికి పెరిగిందని వివరించింది. అయితే సగటున ఫామ్గేట్ రేటు గుడ్డుకు రూ.3.00 నుంచి రూ.3.25 వరకూ పడుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో గుడ్డుకు రైతుకు 50 పైసల నష్టం వస్తోందని తెలిపింది. అలాగే బ్రాయిలర్స్ (లైవ్ వెయిట్) విషయంలోనూ నికరంగా రూ.10 నష్టం వస్తున్నట్లు పేర్కొంది.