-
కంటిని కాపాడుకుందాం!
సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషికి ఉన్న అవయవాల్లో అత్యంత సున్నితమైనది.. ప్రధానమైనది నేత్రాలే. వీటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే జీవితం చీకటి మయమే. ఈ అందమైన ప్రపంచాన్ని చూసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా దూరమయ్యే వరకు కళ్లను భద్రంగా చూసుకోవాల్సిందే. వీటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఈ ఏడాది ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ‘మీ కళ్లను ప్రేమించండి‘ నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా నేత్రాల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. శ్రీకాకుళం అర్బన్: కళ్లను ఎవరూ నిర్లక్ష్యం చేయరాదు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకూ వీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. పిల్లల కంటి సంరక్షణలో తల్లి పాత్ర కీలకం. బిడ్డ కళ్లను పరిశుభ్రంగా ఉంచి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. పుట్టిన బిడ్డ కళ్లను తల్లి నిత్యం గమనిస్తూ ఉండాలి. నేత్రాల్లో ఎటువంటి మార్పులు ఉన్న ఆలస్యం చేయకుండా వైద్యుడ్ని సంప్రదించాలి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు బ్లాక్ బోర్డ్పై ఉన్న అక్షరాలు చూడటంలో ఇబ్బంది ఉన్నా, పుస్తకాన్ని, టీవీని దగ్గరుగా చూస్తున్నా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. విద్యార్థి దశలో ప్రతి ఏడాది కంటి పరీక్ష చేయిస్తూ వారి చూపుని పరిరక్షించాలి. దృష్టిలోపం ఉన్నట్లయితే వైద్యుని సలహా మేరకు కళ్లద్దాలు వాడాలి. ఆధునిక జీవనశైలి– కంటిచూపుపై దుష్పరిణామాలు గతంలో పిల్లలకు తల్లి చందమామని చూపిస్తూ ఆహారం తినిపించేది. ఇప్పుడు సెల్ఫోన్ చూపిస్తూ తినిపిస్తోంది. దీనివల్ల పిల్లల కళ్లలో సున్నితమైన రెటీనా భాగాలు పాడై చూపు పోయే ప్రమాదం ఉంది. పిల్లలు ఎక్కువగా సెల్ఫోన్ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం వల్ల మెల్లకన్ను, దృష్టి లోపంతో పాటు వారి మానసిక ప్రవర్తనలో మార్పులు ఏర్పడుతున్నాయి. అందువల్ల వీలైనంత వరకు పిల్లలకు సెల్ ఫోన్ అందుబాటులో ఉంచకూడదు. ఇక సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసేవారు, కళాశాల విద్యార్థులు, కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ఉపయోగించినపుడు కళ్ల పట్ల శ్రద్ధ వహించాలి. స్క్రీన్పై వెలుతురు పడకుండా, కంటిపై నేరుగా గాలి తగలకుండా చూడాలి. కళ్లకు మధ్యలో విశ్రాంతిని ఇస్తూ అవసరమైతే వైద్యులు సూచించిన కంటి చుక్కల మందు ఉపయోగిస్తూ నేత్రాలను పరిరక్షించుకోవాలి. వయోవృద్ధుల్లో భద్రత 35 సంవత్సరాలు దాటిన చాలామందిలో చదివేటప్పు డు ఇబ్బందికరంగా ఉంటుంది. మధుమేహగ్రస్తులు, రక్తపోటు ఉన్నట్లయితే ప్రతి ఏడాది తప్పనిసరిగా నేత్ర వైద్యుని సంప్రదించాలి. దానివలన శాశ్వత అంధత్వాని కి గురికాకుండా కళ్లను భద్రంగా ఉంచుకున్నవారవుతా రు. ఎవరికైనా గ్లకోమా ఉన్నట్లేనా ప్రతి ఏడాది సంపూర్ణ కంటి పరీక్ష తప్పనిసరి. ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి కంటిపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడగానే బీపీ, సుగర్ వ్యాధులకు గురవుతున్నారు. అటువంటి వారు డాక్టర్ సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. నిర్లక్ష్యం వద్దు కంటి చూపు, సంరక్షణ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ చాలా అవసరం. ఏదైనా ఇబ్బంది గమనించినట్లయితే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. చాలామంది సరైన సమయంలో వైద్యులను సంప్రదించకపోవడంతో శాశ్వత అంధత్వానికి గురవుతున్నారు. – ఎం.ఆర్.కె.దాస్, పారామెడికల్ ఆప్తాల్మిక్ అధికారి అశ్రద్ధ చేయకండి మనిషి జీవితంలో ప్రతీది దృష్టితో ముడిపడి ఉంది. అందుకే కళ్లను నిర్లక్ష్యం చేయరాదు. ప్రస్తుత జీవన విధానంలో వస్తున్న మార్పులు, దీర్ఘకాలిక వ్యాధులతో కంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆరు నెలలకు ఒక్కసారి కంటి వైద్యుడ్ని సంప్రదించాలి. – డాక్టర్ వి.దినేష్కాంత్, రెటీనా నేత్ర వైద్య నిపుణులు జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో దశ కింద గత ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఈనెల 12వ తేదీ వరకూ నేత్ర పరీక్షలు ఇలా.. 60 ఏళ్లకు పైబడిన ఉన్న వృద్ధులు: 3,24,764 మంది కంటి పరీక్షలు చేసినవారి సంఖ్య: 96,128 ఉచిత కళ్లద్దాలకు సిఫారసు చేసిన వారి సంఖ్య: 41,995 కాటరాక్ట్ రిఫర్ చేసిన వారి సంఖ్య :11,857 శస్త్ర చికిత్సలు చేసిన వారి సంఖ్య : 9,600 స్క్రీనింగ్ బృందాలు : 27 చిన్నారి చూపు కార్యక్రమం ద్వారా.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కంటి పరీక్షలు చేసిన విద్యార్థుల సంఖ్య: 3,69,371 కంటి అద్దాలకు రిఫర్ చేసిన వారి సంఖ్య: 12,089 కంటి శుక్లాలు ఉన్న విద్యార్థులు: 14 మెల్లకన్ను శస్త్ర చికిత్సలు : 10 -
క్షయను పారదోలుదాం
గజ్వేల్: క్షయవ్యాధి రహిత సమాజ నిర్మాణానికి ఉద్యమ స్థాయిలో ప్రయత్నం జరగాల్సిన అవసరముందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ టి.రాజయ్య అన్నారు. మంగళవారం గజ్వేల్లోని పీఎన్ఆర్ గార్డెన్స్లో వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఆరుభా హెల్త్ప్రాజెక్ట్ చేపట్టనున్న టీబీ నివారణ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ, దేశంలో క్షయ వ్యాధి వ్యాప్తి ఆందోళన క లిగించే విధంగా ఉందన్నారు. ఇలాంటి తరుణంలో ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాల న్నారు. దేశంలో నిమిషానికో టీబీ రోగి చనిపోతున్నారన్నారు. స క్రమంగా చికిత్స తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చన్నారు. చికిత్సపై అవగాహన లేక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు జిల్లాల్లో క్షయ నివారణ కార్యక్రమాన్ని చేపట్టడానికి సంకల్పించిన వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించడానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ డెరైక్టర్ సాంబశివరావు, టీబీ నియంత్రణ బోర్డు డెరైక్టర్ సూర్యప్రకాశ్రావు, జిల్లా వైద్యాధికారిణి పద్మ, వరల్డ్ విజన్ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ జోబ్రెడ్డి, క్యాలిటీ మేనేజర్ జెస్సీ మధుకర్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ దుంబాల అరుణ, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ చార్జి భూంరెడ్డి, గజ్వేల్ ఎంపీపీ చిన్నమల్లయ్య, జగదేవ్పూర్, ములుగు జెడ్పీటీసీలు రాంచంద్రం, సింగం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ఫొటో లేకపోవటంపై నేతల ఆగ్రహం వరల్డ్ విజన్ అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలోని సభా వేదికపై సీఎం కేసీఆర్ ఫొటో లేకపోవటంతో టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి తదితరులు వేదిక వద్దకు దూసుకెళ్లి నిర్వాహకులను నిలదీశారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మలేకుండా కార్యక్రమాన్ని ఎలా చేపడతారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డాక్టర్ టీ.రాజయ్య కలుగజేసుకొని నిర్వాహకుల తీరును తప్పుబట్టారు. దీంతో నిర్వాహకులు జోబ్రెడ్డి సభాముఖంగా క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. డెలివరీలు చేస్తలేరు... చిన్న గాయాలకూ పట్నం పంపుతుండ్రు అంతకుముందు గజ్వేల్ ఆస్పత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం రాజయ్యకు రోగులు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ‘‘గజ్వేల్ ఆస్పటల్లా సరిగా వైద్యం చేస్తలేరు. చిన్న, చిన్న గాయాలకు పట్నంకు రాస్తుండ్రు. పైసల్లేని పేదోళ్లు ఈడికి డెలివరీలకు వస్తే సిద్దిపేటకు పోమ్ముంట్రుండ్రు. సీఎం కేసీఆర్ ఇలాకా ఇది. అస్పటల్ను బాగుచేయాలే’’ అని గజ్వేల్ మండలం శేర్పల్లి గ్రామానికి చెందిన చంద్రాగౌడ్ డిప్యూటీ సీఎం డాక్టర్ టీ.రాజయ్యకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ఈ వ్యవహారంపై విచారణ చేపడతామని వెల్లడించారు. ప్రస్తుతం 50 పడకలుగా ఉన్న ఈ కమ్యునిటీ ఆస్పత్రిని 100 పడకలుగా (ఏరియా) అప్గ్రేడ్ చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అంతకుముందు డిప్యూటీ సీఎం ఆస్పత్రిలోని పలువార్డుల్లో రోగులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టెతస్కోప్ చేతబట్టి రోగులను పరీక్షించారు. పలువురు రోగులకు బీపీని పరీక్షించించి తగు సూచనలు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement