-
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు టీమిండియాకు గుడ్న్యూస్!
ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు ముందు టీమిండియాకు ఓ గుడ్న్యూస్ అందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ తమ కోవిడ్ పాలసీని మార్చడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత విధానం ప్రకారం.. పాజిటివ్గా తేలిన ఆటగాడు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలి. అయితే ఇప్పుడు కొవిడ్ పాజిటివ్గా తేలినప్పటికీ ఆటగాడు మ్యాచ్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఐసీసీతో కూడా బీసీసీఐ సంప్రదింపులు జరపనున్నట్లు సమాచారం. కాగా కొవిడ్ సోకిన ఆటగాళ్లకు మ్యాచ్లో ఆడేందుకు అనుమతి ఇవ్వడం ఐసీసీకి ఇదేమీ కొత్త కాదు. కామన్వెల్త్ గేమ్స్లోనే ఐసీసీ ఈ రూల్ను తీసుకొచ్చింది. ఇప్పడు బీసీసీఐ కూడా ఈ విషయంపై దృష్టిపెట్టింది. "డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం మా కొవిడ్ కోవిడ్ పాలసీని రివర్స్ చేయాలా వద్ద అనే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం ఐపీఎల్లో మా పాత కొవిడ్ విధానాన్నే అనుసరిస్తున్నాం. అయితే ఆటగాళ్లతో పాటు అధికారులు అందరూ బూస్టర్ డోస్ తీసుకున్నారు. కాబట్టి పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. ఈ విషయంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్తో పేర్కొన్నారు. రహానేకు పిలుపు ఇక భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జాన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించగా.. తాజాగా బీసీసీఐ కూడా భారత జట్టును ఎంపిక చేసింది. అయితే ఈ జట్టులో వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేకు చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కారణంగా రహానేకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. 🚨 NEWS 🚨#TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced. Details 🔽 #WTC23 https://t.co/sz7F5ByfiU pic.twitter.com/KIcH530rOL — BCCI (@BCCI) April 25, 2023 చదవండి: IPL 2023 RCB vs KKR: కేకేఆర్ హీరో జాసన్ రాయ్కు భారీ జరిమానా.. -
భారత్ ‘డబుల్’ ధమాకా
- ప్రపంచ టీమ్ బిలియర్డ్స్లో స్వర్ణ, రజతాలు - టైటిల్స్లో పంకజ్ అద్వానీ రికార్డు గ్లాస్గో: అంతర్జాతీయ బిలియర్డ్స్లో భారత్ మరోసారి సత్తా చాటింది. గ్లాస్గోలో జరిగిన ప్రపంచ టీమ్ చాంపియన్షిప్లో ఓ స్వర్ణం, రజత పతకంతో మెరుపులు మెరిపించింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో భారత్ ‘బి’ జట్టు 5-4తో భారత్ ‘ఎ’ జట్టును ఓడించింది. తాజా విజయంతో పంకజ్ అద్వానీ (10) అత్యధిక ప్రపంచ టైటిల్స్ సాధించిన భారత ప్లేయర్గా రికార్డులకెక్కాడు. ఇంతవరకు ఏ క్రీడలో ఏ ఆటగాడూ ఇన్ని ప్రపంచ టైటిల్స్ను గెలవలేదు. భారత్ ‘ఎ’ తరఫున అలోక్ కుమార్, భాస్కర్, సౌరవ్ కొఠారీ, ధ్రువ్ సిత్వాలా; భారత్ ‘బి’ తరఫున పంకజ్ అద్వానీ, రూపేశ్ షా, దేవేంద్ర జోషి, అశోక్ శాండిల్యాలు ప్రాతినిధ్యం వహించారు. గంటపాటు జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. తొలి మూడు రౌండ్లలో భారత్ ‘ఎ’ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి మూడు రౌండ్లలో ‘బి’ జట్టు 2-1తో నెగ్గి స్కోరును సమం చేసింది. చివరి మూడు రౌండ్లలో భారత్ ‘బి’ ఆటగాళ్లు పంకజ్ 613-116తో కొఠారీని; రూపేశ్ షా 379-90తో అలోక్ను ఓడించి జట్టుకు టైటిల్ను అందించారు. కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత ప్రపంచ టీమ్ ఈవెంట్ను నిర్వహించాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్న అంతర్జాతీయ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ సమాఖ్య వచ్చే కామన్వెల్త్ గేమ్స్లో క్యూ స్పోర్ట్స్ను ప్రవేశపెట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement