-
ఒక్క గెలుపు లేకుండానే...
క్రాల్జివో (సెర్బియా): డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్లో భారత్ పరాజయం పరిపూర్ణమైంది. రివర్స్ సింగిల్స్లోనూ ఓటమే ఎదురవడంతో భారత్ 0–4తో ఆతిథ్య సెర్బియా చేతిలో ఓడిపోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో శ్రీరామ్ బాలాజీ 3–6, 1–6తో వరుస సెట్లలో పెజ క్రిస్టిన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. శనివారమే పరాజయం ఖాయం కావడంతో రివర్స్ సింగిల్స్ పోటీలు నామమాత్రమయ్యాయి. ఇరు జట్ల సమ్మతితో మరో నామమాత్రమైన ఐదో సింగిల్స్ మ్యాచ్ను నిర్వహించలేదు. కొత్త డేవిస్ కప్ నిబంధనల ప్రకారం ఇప్పటికిప్పుడు భారత్ ఆసియా ఓసియానియా గ్రూప్ దశకు పడిపోయే అవకాశం లేదు. అయితే 24 జట్లు ఇంటా, బయటా ఆడే క్వాలిఫయింగ్ టోర్నీలో తలపడాల్సి ఉంటుంది. వచ్చే ఫిబ్రవరిలో ఈ పోటీలు ప్రారంభమవుతాయి. -
రెండు సింగిల్స్ మనవే
⇒రామ్కుమార్, ప్రజ్నేశ్ విజయం ⇒ఉజ్బెకిస్తాన్పై 2–0తో ఆధిక్యం ⇒నేడు డబుల్స్ మ్యాచ్ గెలిస్తే వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్కు భారత్ అర్హత నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత యువ ఆటగాళ్లు రామ్కుమార్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ అంచనాలకు అనుగుణంగా రాణించారు. కాస్త పోటీ ఎదురైనా... పట్టుదలతో పోరాడి విజయాలు అందుకున్నారు. ఫలితంగా ఉజ్బెకిస్తాన్తో మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్లో భారత్ శుభారంభం చేసింది. వరల్డ్ గ్రూప్నకు అర్హత సాధించేందుకు కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. బెంగళూరు: సొంతగడ్డపై భారత యువ ఆటగాళ్లు మెరిశారు. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్ల్లోనూ విజయం సాధించి భారత్ను 2–0తో ఆధిక్యంలో నిలిపారు. డేవిస్కప్ టెన్నిస్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్లో భాగంగా ఉజ్బెకిస్తాన్తో జరుగుతోన్న పోటీలో తొలి రోజు భారత్దే పైచేయిగా నిలిచింది. తొలి సింగిల్స్లో 22 ఏళ్ల రామ్కుమార్ రామనాథన్ 6–2, 5–7, 6–2, 7–5తో తెముర్ ఇసామిలోవ్పై గెలుపొందగా... రెండో సింగిల్స్లో డేవిస్కప్లో తన తొలి మ్యాచ్ ఆడుతున్న 26 ఏళ్ల ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 7–5, 3–6, 6–3, 6–4తో సంజార్ ఫెజీబ్ను ఓడించాడు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్లో భారత్కు విజయం దక్కితే సెప్టెంబరులో జరిగే ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు బెర్త్ ఖాయమవుతుంది. ఈ పోటీలో తమ ఆశలు సజీవంగా ఉండాలంటే డబుల్స్లో ఉజ్బెకిస్తాన్ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇసామిలోవ్తో 3 గంటల 14 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో రామ్కుమార్కు రెండో సెట్, నాలుగో సెట్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. డేవిస్కప్లో తన ఏడో మ్యాచ్ ఆడుతోన్న రామ్కుమార్ తొలి సెట్లో ఇసామిలోవ్ సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. రెండో సెట్లోని 12వ గేమ్లో రామ్కుమార్ సర్వీస్ను బ్రేక్ చేసిన ఇసామిలోవ్ సెట్ను దక్కించుకున్నాడు. మూడో సెట్లో రామ్కుమార్ మళ్లీ విజృంభించి రెండు బ్రేక్ పాయింట్లు సంపాదించాడు. నాలుగో సెట్ హోరాహోరీగా సాగినా 11వ గేమ్లో ఇసామిలోవ్ సర్వీస్ను రామ్కుమార్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్ను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో రామ్కుమార్ 16 ఏస్లు సంధించి, 14 డబుల్ ఫాల్ట్లు చేశాడు. ఫెజీబ్తో 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ప్రజ్నేశ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. డేవిస్కప్లో తనకు లభించిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎడంచేతి వాటం క్రీడాకారుడైన ప్రజ్నేశ్ మూడో సెట్లో 1–3తో వెనుకబడ్డా వరుసగా ఐదు గేమ్లు గెలిచి సెట్ను దక్కించుకోవడం విశేషం. నాలుగో సెట్లోనూ ఈ చెన్నై ప్లేయర్కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. -
పాసులిస్తాం... రండి
డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో భారత జట్టుకు అభిమానుల నుంచి భారీ మద్దతు లభించేందుకు నిర్వాహకులు చక్కటి ప్లాన్ వేశారు. పటిష్ట చెక్ రిపబ్లిక్తో ఈ మ్యాచ్లు ఈనెల 18 నుంచి 20 వరకు జరుగుతుండగా వీటిని తిలకించేందుకు అభిమానులకు ఢిల్లీ లాన్ టెన్నిస్ సంఘం (డీఎల్టీఏ) 1500 ఉచిత పాస్లను ఇవ్వనుంది. వీటిని ఈనెల 9నుంచి డీఎల్టీఏ కార్యాలయంలో పొందవచ్చు. ఎవరు ముందు వస్తే వాళ్లకు పాస్లు ఇస్తామని, టెన్నిస్ అభిమానులు దీనిని వినియోగించుకోవాలని భారత టెన్నిస్ సమాఖ్య కోరింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement