breaking news
Woman 2014
-
భర్త క్షేమం కోరి కర్వా చౌత్ ఉపవాసం ఉంటే..పాపం విధి మరోలా..
"ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు" అన్న పాటలానే జీవితం ఉంటుంది. అప్పటి వరకు మనతో ఆడుతూ పాడుతూ సందడి చేసినవాళ్లు హఠాత్తుగా మనల్ని వదిలేసి వెళ్లిపోతే కచ్చితంగా ఠక్కున మన ఘంటసాలగారు పాడిన పాటల మదిలోకి వచ్చేస్తుంది. మనం ఒకటి అనుకుని సరదాగా గడిపితే విధి మరోలా మన కథ రాసేస్తుంటుంది. అలాంటి విషాద ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఈ దురదృష్టకర సంఘటన పంజాబ్లో జరిగింది. పంజాబ్లోని బర్నాలాలో కర్వాచౌత్ వేడుకల సందర్భంగా తన భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంది 59 ఏళ్ల ఆశా రాణి. దక్షిణ భారతదేశంలో జరుపుకునే అట్లతద్ది మాదిరిగా జరుపుకునే పండుగే ఈ కర్వా చౌత్. అయితే ఈ కర్వాచౌత్ పండుగలో ఉపవాస విరమణ భర్తచేతుల మీదుగా జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ ఆశారాణి అనే మహిళ కూడా భర్త క్షేమం కోరి ఉపవాసం ఉంది. అయితే ఈ వేడుకను ఆ రోజు(శుక్రవారం) సాయంత్రం స్నేహితుల ఇంటిలో జరుపుకోవాలని భావించి మనవరాలు, భర్తతో కలిసి వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ చంద్రుడి రాకకై నిరీక్షిస్తూ..అంతా సందడి సందడిగా గడిపారు. ఈలోపు నీరసం రాకుండా ఉత్సాహంగా ఉండేలా కాస్త ఆటపాటలు, నృత్యాలతో నిరీక్షిస్తున్నారు. ఈ ఆశారాణి కూడా అందులో భాగంగానే ఓ పాటకు వారందరితో కలిసి నృత్యం చేస్తూ..ఒక్కసారిగా కుప్పకూలిపోయింద. సకాలంలో వైద్యుడి వద్దకు తీసుకువెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు దృవీకరించారు వైద్యులు. అప్పటిదాక ఆనంద సంతోషాలతో తేలియాడిన ఆ రెండు కుటుంబాలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయాయి. భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉండి..ఆమెనే సుమంగళిగా మృత్యుఒడికి వెళ్లిపోయిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. ఇలాంటి ఘటనలు చూడగానే.. ఏ క్షణంలో ఏం జరగుతుందో ఎవ్వరికీ తెలియదు..విధి చాలా బలీయమైనది అన్న మాటలు స్పురణకు వస్తాయి కదూ..!. ..ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ..అప్పటి దాక ఆడిపాడి..మనముందే తనువు చాలిస్తే..ఆ బాధ అంత తేలిగ్గా మర్చిపోలేరెవ్వరూ..!. సో బీకేర్ఫుల్ ఇలాంటి విషయాల్లో..సదా అప్రమత్తంగా ఉండండి.Karwa Chauth celebration in Barnala turn tr@gic after woman coll@pses while dancing#KarwaChauth #KarwaChauthcelebration pic.twitter.com/dz3G5APp7r— True Scoop (@TrueScoopNews) October 13, 2025 (చదవండి: ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు) -
మొదటి అడుగు
మహిళ 2014 ఒక వైపు ప్రగతి... మరో వైపు అధోగతి..! వాడుకభాషలో, సినిమా ఫక్కీలో చెప్పాలంటే - ఒకరోజు ‘దూకుడు’... మరుసటి రోజు ‘బ్రేకుడు’! మూడు అడుగులు ముందుకు, రెండు అడుగులు వెనక్కి... సంక్షిప్తంగా 2014 సంవత్సరం మహిళకు రెండు విభిన్న కోణాల్లో కనపడింది. సంవత్సరం ప్రథమార్ధంలో రాజకీయాలలో, ముఖ్యంగా ఎన్నికల్లో ప్రముఖ పాత్ర వహించినవారిలో సోనియా గాంధీ, సుష్మాస్వరాజ్, స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్, ఆనందీబెన్, తెలుగువాళ్ళలో కవిత, షర్మిల, రోజా - ఇలా ఎంతోమంది మహిళలున్నారు. వీళ్ళంతా... ‘ఆడవారు ఎందులోనైనా దూసుకెళ్ళగలరు’ అని నిరూపించారు. చక్కటి కాంచీవరం పట్టుచీర, తలనిండా మల్లెపూలు, చేతి నిండా గాజులు పెట్టుకొని ట్రెడిషనల్గా ఉంటూనే, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో లాంచ్ అయిన ‘మంగళయాన్’ ప్రాజెక్ట్లో తమది నంబర్ 1 పాత్ర అని చూపించారు. మరోవైపు కేవలం హైదరాబాద్ లాంటి ప్రధాన నగరంలోనే మహిళలపై అత్యాచారాలు ఒకటిన్నర రెట్లు ఎక్కువయ్యాయి. 2012లో 75 అత్యాచారం కేసులు నమోదైతే, ఈ సంవత్సరం దాదాపు 102 కేసులు వచ్చాయి. వచ్చే ఏడు ఎలాంటి ఉమెన్ సేఫ్టీ పాలసీ వస్తుందో, ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో అని ఎదురుచూసి మోసపోకుండా, ఆడవారు తమ సేఫ్టీ, సెక్యూరిటీ తామే చూసుకోవాలని గ్రహించారు. అందుకే, ఈ సంవత్సరం చివరలో మొబైల్ ఫోన్లో సేఫ్టీ యాప్స్ డౌన్లోడ్స్తో, పెప్పర్ స్ప్రేలతో, మార్షల్ ఆర్ట్స్తో రెడీ అవుతున్నారు. మార్పు మనతోనే మొదలవ్వాలని నమ్మి, తామే మొదటి అడుగు వేస్తున్నారు. మంజులతా కళానిధి (ఈ ఏడాది ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ‘రైస్ బకెట్ ఛాలెంజ్’ రూపకర్త)


