-
కొడుకుతో పార్క్కు వెళ్లిన షకీరా.. ఒక్కసారిగా అడవి పందుల దాడి
కొలంబియన్ పాప్ సింగర్ షకీరా పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఆమెపై ఇటీవల రెండు అడవి పందులు దాడి చేసినట్లు గాయని సోషల్ మీడియాలో తెలిపింది. ఈ విషయం గురించి చెబుతూ మురికిగా, చిరిగిన తన బ్యాగ్ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. కొడుకుతో కలిసి సేద తీరడానికి బార్సీలోనాలోని ఓ పార్క్కి వెళ్లగా, ఆ సమయంలో ఒక్కసారిగా రెండు అడవి పందులు అక్కడికి వచ్చి ఆమెపై దాడికి దిగాయని షకీరా తెలిపింది. తన బ్యాగ్ని, ఫోన్ నోట కరుచుకుని అడవిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాయని, అంతే కాకుండా అందులోని అన్ని వస్తువులను నాశనం చేశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే దాడి అనంతరం చిరిగిపోయిన బ్యాగ్ను తీసుకున్న ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. చదవండి: ‘గాంధీ’ అంత్యక్రియల సీన్కి 4 లక్షల మంది భారతీయులు: హాలీవుడ్ నటుడు -
బంధువులే చంపి.. అడవిపంది దాడిగా చిత్రీకరించారు!
సాక్షి, బషీరాబాద్: అడవిపంది దాడిలో వ్యక్తి మృతిచెందిన కేసులో కొత్త మలుపు తిరిగింది. తన తండ్రిని బంధువులే చంపేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బషీరాబాద్ మండలం మాసన్పల్లి గ్రామానికి రైతు గొల్ల కమలప్ప అడవి పంది దాడిలో ఈనెల 8వ తేదీన మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. అయితే తాజాగా మృతుడి కుమారుడు గొల్ల చరణ్ తన తండ్రిది ‘ముమ్మాటికి హత్యే’ అని ఆరోపించారు. ఆస్తి కోసం బంధువులే హత్యచేసి ప్రమాదకరంగా చిత్రీకరిస్తున్నారని తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. గ్రామంలోని పొలాలతో పాటు తాండూరులో ఇంటి స్థలాలు తమకు ఉన్నాయని, వాటిని కాజేయడడానికి తన మేనమామ గొల్ల మొగులప్ప, మేనత్తలు గొల్ల కమలమ్మ, మొగులమ్మతో పాటు మరికొందరు కలిసి హత్యచేశారని ఆరోపించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని వారు బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరారు. విచారణకు ఆదేశించాం మాసన్పల్లి గ్రామానికి చెందిన రైతు కమలప్ప మృతిపై మొదట ఫిర్యాదు చేయడానికి కుటుంబసభ్యులు వెనకాడారు. పోస్టుమార్టం కూడా వద్దన్నారు. ఆ తర్వాత ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశాం. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు లోతుగా విచారణ చేపట్టాలని తాండూరు గ్రామీణ సీఐకి ఆదేశించాం. అన్ని కోణాల్లో విచారణ చేస్తాం. పోస్టుమార్టం, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా కేసును త్వరగా చేధిస్తాం. – లక్ష్మీనారాయణ, డీఎస్పీ -
పంట చేలపై అడవి పందుల దాడి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఏటేటా అడవి పందుల సంఖ్య వేలల్లో పెరిగిపోతోంది. సహజ అటవీ సంపద రోజురోజుకూ పలుచబడి అడవి పందులు పంట చేల మీదకు మళ్లుతున్నాయి. విత్తనం వేసిన నాటి నుంచి మొదలుపెట్టి పంట చేతికొచ్చే వరకు రైతు కళ్లలో ఒత్తులేసుకొని కాపు కాసినా... అర్ధరాత్రి వేళ ఆపదొచ్చినట్టు వచ్చి పంట విధ్వంసం చేసి పోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి సంవత్సరం 1.50 లక్షల ఎకరాలపై అడవి పందుల ప్రభావం ఉన్నట్లు తేలింది. అడవి పందులు రెండేళ్ల కాలంలో ఇద్దరు రైతులపై దాడి చేసి చంపివేయగా.. 12 మందికి గాయపరిచాయి. అయితే.. ఇవేవి అటవీ రికార్డులకెక్కకపోవడం గమనార్హం. పంట చేలపై దాడి చేసే అడవి పందులను చంపవచ్చని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చినా.. అటవీ శాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని నిబంధనలను ముందు పెట్టి రైతుల చేతులు కట్టేస్తున్నారు. పంట కంటే ముందే పందులు.. మహబూబ్బాద్ జిల్లాలో 16 మండలాలు ఉండగా.. దాదాపు అన్ని ప్రాంతాల్లో అడవి పందుల గుంపులు ఉన్నట్లు ఫారెస్టు అధికారులు నిర్ధారిం చారు. మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్లోని గూడూరు, బయ్యారం, గార్ల, కొత్తగూడెం, గంగారం మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఈ ఐదు మండలాలల్లో సుమారు 80 వేల ఎకరాల్లో భూమి సాగు అవుతుండగా.. 45 వేల ఎకరాల సాగుపై అడవి పందుల ప్రభావం ఉంటోంది. తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్లలోని 16 మండలాల్లో కలిపి 5 వేలకు పై గానే అడవి పందుల సంచారం ఉన్నట్లు అంచనా. జయశంకర్ జిల్లాలో.. గత ఏడాది భూపాలపల్లి జిల్లా మహాముత్తారం స్తంభంపల్లిలో రైతు జాడి రాజయ్య (45) పత్తి చేలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా.. అడవి పంది దాడి చేసి చంపేసింది. ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, గోవిందరావుపేట, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడ, గూడూ రు, వాజేడు, కన్నాయిగూడెం, కాటారం, మహదేవ్పూర్, మహాముత్తారం, పలిమెల తదితర మండలాల్లో 1.75లక్షల ఎకరాల్లో పంట సాగవుతోంది. పత్తి, మిరప, మొక్కజొన్న, పసుపు పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో అడవి పందుల సమస్యతో రైతులు పం టలు వేయడానికే భయపడుతున్నారు. ఇక్కడ దాదాపు 75 వేల ఎకరాలపై అడవి పందుల ప్రభావం ఉంటుం దని రైతు సంఘాలు చేసిన ఒక సర్వేలో తేలింది. జనగామ, రూరల్ జిల్లాలో.. జనగామ జిల్లాలో బచ్చన్నపేట, నర్మెట, జనగామ, రఘునాథపల్లి, లింగాలఘనపురం 25వేల ఎకరాల్లో, వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్, నల్లబెల్లిలో 5వేల ఎకరాలపై అడవి పందుల తీవ్ర ప్రభావం ఉంది. ప్రత్యేక చట్టం తెచ్చినా.. అడవి పందుల పంట విధ్వంసం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. పంట లపై దాడి చేసే అడవి పందులను వేటాడి చంపవచ్చని అందులో పేర్కొంది. ఈ చట్టం రైతులకు కొంత ఊరట నిచ్చింది. అయితే.. ఎలా చంపాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా పంట చేలల్లోకి వచ్చే అడవి పందులను వేటాడటానికి రైతులు ఉచ్చులు వేయడం, విష ప్రయోగం, బాణాలు సంధించడం, వలలు పెట్ట డం, కరెంటు తీగలు అమర్చడం వంటి నాటు పద్ధతుల ను అవలంబించేవాళ్లు. ఇందులో కరెంటు తీగలు పెట్టే విధానం అత్యంత ప్రమాదకరం కావడంతో ఇలాంటి రైతులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ మే ఆదేశించింది. ఈ క్రమంలో అటవీశాఖ తన తెలివి తే టలను ప్రదర్శించింది. రైతులు ఎట్టి పరిస్థితుల్లో అడవి పందులను చంపడానికి వీల్లేదని, గన్ ఫైరింగ్లో నిపుణులను ఎంపిక చేసి.. వారితోనే కాల్చివేయాలనే నిబంధన ను ప్రభుత్వం ముందు పెట్టింది. ఇలాంటి వాళ్లను తామే ఎంపిక చేస్తామని, రైతుకు రూపాయి ఖర్చు లేకుండా అడవి పందులను చంపిస్తామని ప్రభుత్వానికి చెప్పింది. ఆ ఇద్దరు వస్తేనే.. గన్ ఫైరింగ్ చేయగలిగే ఔత్సాహికులు ఉంటే ఫారెస్టు శాఖలో పేరు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించగా.. తెలంగాణ వ్యాప్తంగా కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే వాటిని చంపేందుకు ముందుకు వచ్చారు. వరంగల్ జిల్లా నుంచి మాజీ డీజీపీ పేర్వారం రాములు కొడుకు సంతాజీ, హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సఫత్ అలీఖాన్ అనే ఇద్దరు ఫైరింగ్ నిపుణులు మాత్రమే ఇందుకు ఒప్పుకున్నారు. పంట చేల మీదపడి పందులు విధ్వంసం చేస్తున్నా.. వాటిని ఏమి అనకుండా రైతులు ముందుగా డీఎఫ్ఓకు సమాచారం ఇవ్వాలి. సదరు అధికారి నిజనిర్ధారణ చేసిన తర్వాత ఫైరింగ్ నిపుణులను సంప్రదిస్తారు. వారు సమయం కేటాయిస్తే.. అదే వేళలో పందులు ఎక్కడ ఉన్నాయో రైతులు పసిగట్టి చూపించాలి. వాటిని నిపుణులు ఫైరింగ్ చేసి కాల్చి చంపుతారు. అంతేకాని రైతులు నేరుగా అడవి పందులను వేటాడకూడదనే నిబంధన కఠినతరం చేశారు. దీంతో రాష్ట్రంలో ప్రత్యేక చట్టం అమలవుతున్నా... రైతన్నలు అడవిపందుల నుంచి తమ పంటను కాపాడుకోలేక పోతున్నారు. ఇక్కడో దబాయింపు సెక్షన్.. న్యప్రాణులతో పంట నష్టం జరిగితే వరి, చెరుకు పంటలకు ఎకరాకు రూ.6 వేల చొప్పున , పత్తి, సోయ, పెసర తదితర పప్పు రకాల పంటలకు ఎకరాకు రూ.2 వేల నుంచి రూ.3 వేల చొప్పున పంట నష్టపరిహారం అందిస్తారు. అడవి పందుల దాడిలో మరణిస్తే రూ.5 లక్షలు, గాయపడితే రూ.70 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లిస్తారు. అయితే.. జిల్లాలో అడవి పందుల దాడులు జరుగుతున్నా.. ఫారెస్టు రికార్డుల్లో రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ క్రమంలో వాస్తవ పరిస్థితులపై ఆరా తీస్తే ఏజెన్సీ ప్రాంతంలోని 50 శాతం భూముల పట్టా హక్కులపై ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తేలింది. ఇటువంటి భూముల్లో పంటలు సాగు చేస్తున్న రైతాంగంపై అడవి పందులు దాడి చేస్తే.. ఫారెస్టు అధికారులు కేసులు నమోదు చేయడం లేదు. పైగా వన్య ప్రాణుల ఆవాసంలోకి అక్రమంగా చొరబడి వాటి సహజ జీవనానికి విఘాతం కలిగిస్తున్నారని ఉల్టా కేసు పెడుతున్నారు. దీంతో రైతులు పంట నష్టం జరిగినా.. ప్రాణాపాయం వచ్చినా ఫారెస్టు అధికారులకు మాత్రం చెప్పడం లేదు.పంటలు సాగుచేస్తే పందులపాలైతాంది. అష్టకష్టాలు పడి పంటలను సాగు చేస్తే అడవి పందుల పాలైతాంది. రాత్రి వేళల్లో చేలు, పొలాల్లో కలియతిరుగుతూ పంటను పనికి రాకుండా చేస్తున్నాయి. గ్రామస్తులంతా ఏకమై తరమాల్సిన పరి స్థితి వచ్చింది. వాటికి హాని కలిగిస్తే అటవీ అధికారులు కేసులు పెడుతున్నారు. పంటలు కోల్పోయినందుకు మాత్రం అటవీశాఖ అధికారులు పరిహారం ఇవ్వరు. – కోరం నర్సయ్య, గిరిజన రైతు,సర్వాయి(ఏటూరునాగారం) అడవి పందులతో నష్టపోతున్నాం.. గుంపులు గుంపులుగా అడవి పందులే సేండ్ల మీదకొస్తున్నయి. 30 ఏండ్ల నుంచి ఇదే తంతు. మక్క, పత్తి, వరి, కూరగాయలను సర్వనాశనం చేస్తున్నాయి. వ్యవసాయ బావి వద్దకు వెళ్లాలంటేనే వణికిపోతున్నాం. చాలా మంది రైతులు వ్యవసా యం మానుకునే పరిస్థితి నెలకొంది. అడవి పం దుల నుంచి రక్షించాలి. – గీస సందీప్, మన్సాన్పల్లి, బచ్చన్నపేట, జనగామ -
మహిళపై అడవి పంది దాడి
గోవిందరావుపేట వరంగల్ : తునికాకు సేకరణ కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన మహిళపై అడవి పంది దాడి చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం పస్రా అభ్యుదయ కాలనీకి చెందిన జిట్టబోయిన లక్ష్మి సమీప అటవీ ప్రాంతంలోకి తునికాకు సేకరణకు వెళ్లింది. ఈ క్రమంలో అడవి పంది ఆమెపై దాడి చేయడంతో కాలికి బలమైన గాయమైంది. ఆమె అరుపులతో సమీపంలో ఉన్న కూలీలు అక్కడికి రాగా పంది పారిపోయింది. గాయాలపాలైన లక్ష్మిని పస్రా అటవీ శాఖ అధికారులు ఆస్పత్రికి తరలించారు -
వెంటాడి మరీ చంపేసింది..!
ఏపీలోని నెల్లూరు జిల్లాలో అడవి పంది దాడిలో వ్యక్తి మృతి బుచ్చిరెడ్డిపాళెం: పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న ముగ్గురిపై అడవి పంది దాడి చేసింది. వారిలో ఒకరిని వెంటాడి మరీ హతమార్చింది. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం ఆర్ఆర్కాలనీ (మఠం)లో గురువారం రాత్రి జరిగింది. మండలంలోని ఆర్ఆర్నగర్ కాలనీకి చెందిన తీరంశెట్టి చెంచయ్య (45), అతని కుమారుడు కృష్ణయ్య, మరో వ్యక్తి అంబూరు పెంచలయ్య కూలి పనులు ముగించుకుని వస్తుండగా మార్గమధ్యలో ఓ అడవి పంది అకస్మాత్తుగా ముగ్గురిపై దాడి చేసింది. వీరిలో ఇద్దరు అక్కడి నుంచి పరుగులు తీశారు. ముందువెళ్తున్న తీరంశెట్టి చెంచయ్య ఎదురు రొమ్ముపై తీవ్రగాయం కావడంతో పరుగులు తీస్తూ పక్కనున్న బావిలో పడ్డాడు. అడవిపంది సైతం అతనితో పాటు బావిలోకి దూకింది. చాతి భాగాన్ని చీల్చి, ముఖంపై రక్కి తీవ్రంగా గాయపర్చడంతో చెంచయ్య అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. అడవిపంది దాడితో పరుగులు తీసిన మిగతా ఇద్దరు స్థానిక గ్రామస్తులకు విషయం చెప్పడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే చెంచయ్య మృతి చెందడంతో వల సహాయంతో పందిని బయటకు తీశారు. ఈ క్రమంలో ఉచ్చు బిగిసుకుని పంది సైతం మృతిచెందింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement