breaking news
welfare schemes and development works
-
బీజేపీతోనే అవినీతిరహిత పాలన సాధ్యం
ఆదిలాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జనగర్జన సభ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలను సీఎం కేసీఆర్ పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కుటుంబ అభివృద్ధికి మాత్రమే సీఎం కృషి చేశారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు ప్రధాన మోదీ నాయకత్వంలో కేంద్రంలో నీతిమంతమైన పాలన సాగుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని గిరిజనులు విద్య, ఉద్యోగ పరంగా మరింత ముందుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని మోదీ గిరిజన వర్సిటీ ప్రకటించారన్నారు. జిల్లాలో బీజేపీకి ఎంతో ప్రజాదరణ ఉందని, ఇక్కడి నుంచి పార్లమెంట్ స్థానాన్ని గెలవడంతో పాటు గతంలో పలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ నుంచి పూరించనున్నట్లు వెల్లడించారు. ఈ బహిరంగ సభకు ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు. -
పల్లెకు పట్టం: వేలల్లో జనాభా.. కోట్లలో అభివృద్ధి
పల్లె అంటేనే అభివృద్ధికి ఆమడదూరమనే భావం అందరిలోనూ ఉండేది. గతంలో రోడ్లు లేవు. పక్కా భవనాల్లేవ్. పిల్లలు చదువుకోడానికి కనీస వసతుల్లేవ్. ఇక పల్లెవాసులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కాలంటే చెప్పులరిగేలా తిరిగినా దరిచేరని దుస్థితిలో పల్లెజనం మగ్గిపోయారు. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక పరిస్థితులు మారాయి. ప్రతి గడపలోనూ ప్రభుత్వ పథకాలు తలుపుతట్టాయి. అవ్వా, తాత, అక్కా చెల్లెమ్మలకు జగనన్న అండగా నిలిచారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ ఆదరిస్తున్నారు. పల్లె ముంగిట్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వెలిశాయి. పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి. ఆరోగ్య కేంద్రాలు ఆధునికతను సంతరించుకున్నాయి. వీటన్నింటికీ కోట్లాది రూపాయలు వెచ్చించిన ప్రభుత్వం పల్లెకు పట్టం కట్టింది. దీంతో పల్లెలు ప్రగతి బాట పట్టాయి. సాక్షి, చిత్తూరు: పునర్విభజన తర్వాత జిల్లాలోని ఏడు నియోజవర్గాల్లో మొత్తం 31 మండలాలున్నాయి. ఇందులో 697 గ్రామ పంచాయతీలున్నాయి. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత పల్లె స్వరూపం మారింది. అభివృద్ధి పరంగా మూడున్నరేళ్లలో గ్రామాల రూపురేఖలు మారాయి. అభివృద్ధి నినాదంతో ముందుకుపోతున్నాయి. మచ్చుకు కొన్ని గ్రామ పంచాయతీలకే ప్రభుత్వం పారించిన నిధుల వరద చూద్దాం. మహాసముద్రానికి రూ.14 కోట్లు బంగారుపాళెం మండలంలో 1,290 మంది జనాభా ఉన్న మహాసముద్రం గ్రామానికి రూ.14 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, పక్కా గృహాలు, రోడ్ల నిర్మాణాల కోసం రూ.6కోట్ల 79 లక్షలు వ్యయం చేశారు. ఈ గ్రామంలో సంక్షేమ పథకాలకు చేదోడు, జగనన్న తోడు, విద్యాదీవెన, సున్నావడ్డీ కింద రూ.4.5 కోట్లు అందజేశారు. మిగిలిన పథకాలకు పింఛన్– రూ.1.8 కోట్లు, ఆసరా –రూ.49 లక్షలు, విద్యాదీవెన – రూ.18 లక్షలు, రైతు భరోసా – రూ.20 లక్షలు, చేయూత – రూ.22 లక్షలు, ఆరోగ్యశ్రీ – రూ.9 లక్షలు, రొంపిచెర్లకు రూ.30.71 కోట్లు మండలంలోని 6756 మంది జనాభా ఉన్న రొంపిచెర్ల గ్రామానికి రూ.30.71 కోట్లు ఖర్చు చేశారు. 2 సచివాలయాలు, 2 ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, షాదీ మహల్, పక్కా గృహాలు, సీసీ రోడ్డు, కాలువల నిర్మాణాలకు రూ.11.87 కోట్లు ఖర్చు చేశారు. సంక్షేమ పథకాలైన చేదోడు, జగనన్న తోడు, రైతు భరోసా, ఈబీసీ నేస్తం, సున్నావడ్డీ మొత్తంగా రూ.10.2 కోట్లు చెల్లించారు. వీటితోపాటు పింఛన్ – రూ.2.77 కోట్లు, ఆసరా – రూ.2.85 కోట్లు, విద్యాదీవెన – రూ.69 లక్షలు, చేయూత – రూ.1.4 కోట్లు, ఆరోగ్య శ్రీ – రూ.30 లక్షలు వెచ్చించారు. బుగ్గ అగ్రహారంలో రూ.30 కోట్లు నగరి మండలంలోని 2028 మంది జనాభా ఉన్న బుగ్గ అగ్రహారంలో మొత్తం రూ.30 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, పక్కా గృహాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.15 కోట్లు చెల్లించారు. పింఛను –రూ.2.55 కోట్లు, ఆసరా – రూ.1.15 కోట్లు, విద్యాదీవెన – రూ.23 లక్షలు, చేయూత – రూ.75 లక్షలు, ఆరోగ్య శ్రీ – రూ.32 లక్షలు, చేయూత, జగనన్న తోడు, విద్యాదీవెన, సున్నావడ్డీ ఇలా మొత్తంగా సంక్షేమం కోసం రూ.15 కోట్లు ఖర్చు చేశారు. చిన్నవేపంజేరిలో రూ.9.32 కోట్లు జీడీనెల్లూరులోని 910 మంది జనాభా ఉన్న చిన్నవేపంజేరి గ్రామానికి రూ.9.32 కోట్లు ఖర్చు చేశారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్క్లినిక్, గృహ నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.6.15 కోట్లు వెచ్చించారు. పింఛను– రూ.2.33 కోట్లు, రైతు భరోసా – రూ.1.28 కోట్లు, సున్నా వడ్డీ – రూ.15 లక్షలు, ఆసరా –రూ.94 లక్షలు, విద్యాదీవెన – రూ.1.06 కోట్లు, చేయూత – రూ.14.5 లక్షలు, ఆరోగ్య శ్రీ – రూ.12.9 లక్షలు ఇలా సంక్షేమ పథకాల కోసం రూ.3.17 కోట్లు ఖర్చు పెట్టారు. పల్లెకు ప్రాధాన్యత పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. సచివాలయాల ద్వారా గ్రామీణులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అర్హులు ప్రభుత్వ పథకాల కోసం వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందుతున్నారు. వాటితోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారు. గ్రామాల్లోని అన్ని వర్గాలవారికి మేలు చేయటం ప్రభుత్వ లక్ష్యం. – ప్రభాకర్రెడ్డి, జెడ్పీసీఈఓ గ్రామాల్లో వసతులకు పెద్దపీట గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. రోడ్లు, కాలువలు, భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. వీటితో పాటు సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులకు జగనన్న ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోంది. చిన్న చిన్న పల్లెల్లో కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రస్తుతం గ్రామాల్లోనూ అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. – శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ మా గ్రామానికే రూ.15 కోట్లు ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మా గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణా లు చాలా బాగున్నాయి. సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. మా పంచాయతీ పరిధిలో రూ.15 కోట్ల వరకూ అభివృద్ధి పనులకు కేటాయించటం ఆనందంగా ఉంది. – షర్మిల శరత్, సర్పంచ్, మహా సముద్రం, బంగారుపాళెం గ్రామ పంచాయతీ బాగా అభివృద్ధి చెందింది రొంపిచెర్ల గ్రామ పంచాయతీలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. మూడేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. తాగునీరు, సీసీ రోడ్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు. ఇలాంటి అభివృద్ధి నేను ఎన్నడూ ఇంత వరకు చూడలేదు. రొంపిచెర్లలో మైనారిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగనన్న కృషి చేస్తున్నారు. – అబుబక్కర్, చిన్న మసీదు వీధి, రొంపిచెర్ల మా ఇంట పథకాల పంట మాది పేద కుటుంబం. నా భర్త సైకిల్ షాపు నడుపుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మా కష్టాలు తొలగిపోయాయి. అమ్మ ఒడి, రైతు భరోసా, జగనన్న తోడు, విద్యాదీవెన, ఆసరా, పక్కా ఇల్లు వంటి అన్ని పథకాలు అందాయి. మూడేళ్లలో మాకు రూ.2.25 లక్షలు లబ్ది చేకూరింది. ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. – ధనలక్ష్మి, బుగ్గ అగ్రహారం అభివృద్ధి మెండుగా జరిగింది గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు జరిగాయి. గతంలో స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలన్నా రోడ్డు సక్రమంగా లేక ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం మంత్రి ఆర్కేరోజా ఆస్పత్రి వరకు సిమెంటు రోడ్డు వేయించారు. వీధి దీపాలు పెట్టించారు. సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం గ్రామంలో నిర్మించారు. కొండ కింద బోరు వేసి తాగునీరందిస్తున్నారు. – కుమారస్వామి, రిటైర్డ్ రైల్వే అధికారి, బుగ్గ అగ్రహారం ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ గతంలో అనేక ప్రభుత్వాలు చూశాం. వేపంజేరి నియోజవర్గంగా ఉండేది. అయినా అభివృద్ధి కనిపించలేదు. సీఎంగా జగన్మోహన్రెడ్డి వచ్చారు. మాకు అన్ని విధాలా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. జగనన్న సంక్షేమ పథకాలు అమలు చేసి కుటుంబంలోని సోదరుడిలాగా ఆదుకుంటున్నాడు. మా కుటుంబం ఆయనకు ఎప్పడూ రుణపడి ఉంటుంది. –శ్యామల, చిన్నవేపంజేరి, గంగాధర నెల్లూరు మండలం -
మాకీ గతేంటి?
అధికారుల తీరుపై సీఎం సిద్ధు సీరియస్ మీ నిర్లక్ష్యంతో మాకు ఇబ్బందులు ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి ప్రతి మూడు నెలలకు ఓసారి సమీక్ష నిర్వహించాలి జిల్లా ఇన్చార్జ మంత్రి గైర్హాజర్ అయితే చర్యలు పన్నుల వసూలుపై నిర్లక్ష్యం వీడండి సహాయక చర్యల్లో అవకతవకలు, జాప్యం చేయొద్దు సాక్షి, బెంగళూరు : కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తుండటంతో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెంగళూరులోని విధానసౌధాలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. అందులో వివిధ శాఖల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, అధికారుల తీరుతెన్నులను సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. నిర్ధిష్ట సమయంలోపు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ పరిస్థితి ఎదురుకాకుండా జాగ్రత్త వహించాలని హితవు పలికారు. ముఖ్యంగా జిల్లా స్థాయి అధికార యంత్రాంగం సరిగా విధులు నిర్వహిస్తే ప్రజల సమస్యల్లో 80 శాతం అప్పటికప్పుడు పరిష్కారమవుతాయన్నారు. ఇందు కోసం జిల్లా ఇన్చార్జ్ మంత్రులతో పాటు కలెక్టర్లు రెండు, మూడు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశం జరపాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొనని జిల్లా ఇన్చార్జ్ మంత్రుల పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పన్నులు వసూలు చేయండి.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలో అనుకున్నంత మేరకు పన్నులు వసూలు కావడం లేదని సిద్ధరామయ్య సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీ ఖాతా పొందన భవన యజమానులు చాలా ఏళ్లుగా పన్నులు కట్టకున్నా సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం తగదన్నారు. పన్నుల రాబడి పెంచడం కోసం ఎన్ని సమావేశాలు నిర్వహించామన్నది ముఖ్యం కాదని.. ఎంత పన్నులు వసూలు చేశామన్నది ముఖ్యమని పేర్కొన్నారు. ఇక అభివృద్ధి పనుల్లో కూడా సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్నారు. ఇందుకు చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోతున్న రోడ్లే ప్రత్యక్ష ఉదాహరణమని అసహనం వ్యక్తం చేశారు. సహాయ కార్యక్రమాలపై సుదీర్ఘ చర్చ రాష్ట్రంలో ఓ వైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి ఏర్పడిన వైనంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సహాయ చర్యలకు అవసరమైన నిధుల కొరత లేదని అధికారులకు స్పష్టం చేశారు. అందువల్ల ప్రజలకు ముఖ్యంగా గ్రామీణులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కరువు కోరల్లో చిక్కుకున్నవారికి ప్రత్యాన్మాయ పనులు చూపించడంలో విఫలమైతే వలసలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అతివృష్టి వల్ల నష్టపోయినవారికి పరిహారం చెల్లింపులో ఎటువంటి అవకతవకలు జరిగినా, ఆలస్యమైనా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.