-
వరంగల్ కు మహర్దశ..
-
కాంగ్రెస్ యాత్ర షెడ్యూల్ ఖరారు
వరంగల్ : జిల్లాలో జరిగే రెండో విడత ప్రజాచైతన్య బస్సు యాత్రపై హైదరాబాద్లోని గాంధీభవన్లో పీసీసీ చీప్ ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరు కాగా.. వచ్చే నెల మూడు నుంచి పదో తేదీ వరకు జరిగే బస్సు యాత్ర షెడ్యూల్ను డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి పత్రికలకు విడుదల చేశారు. ఏప్రిల్ 3న భూపాలపల్లి నియోజకవర్గంలో బస్సు యాత్ర బృందం రాత్రి బస చేస్తుంది. 4న మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి చేరుకుంటుంది. సాయంత్రం 6గంటలకు పాలకుర్తి నియోజకవర్గంలో బస చేస్తారు. 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పరకాల నియోజకవర్గంలో, సాయంత్రం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బస్సు యాత్ర జరుగుతుంది. అనంతరం నైట్హాల్ట్ చేస్తారు. 8వ తేదీన డోర్నకల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 2గంటలకు, సాయంత్రం 6గంటలకు మహబూబాబాద్ నియోజకవర్గంలో బస్సు యాత్ర జరుగుతుంది. నైట్హాల్ట్ భద్రాచలంలో చేస్తారు. 9వ తేదిన మణుగూరు మీదుగా ములుగు నియోజకవర్గంలో యాత్ర చేసి సాయంత్రం 5 గంటలకు సభలో పాల్గొని అక్కడే రాత్రి బస చేస్తారు. 10వ తేదీన వర్ధన్నపేట నియోజకవర్గంలో మధ్యాహ్నం 2గంటలకు జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో రెండో విడత బస్సు యాత్ర ముగుస్తుందని రాజేందర్రెడ్డి తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్చంద్రారెడ్డి, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, బలరాంనాయక్, మండలి విపక్ష నేత షబ్బీర్అలీ, ఎమ్మెల్యేలు టి.జీవన్రెడ్డి, దామోదర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిశీలకులు సయ్యద్ అజమతుల్లా హుస్సేనీ, పీసీసీ ప్రధాన కార్యదర్శులు నమిండ్ల శ్రీనివాస్, బక్క జడ్సన్, నేరేళ్ల శారద, బట్టి శ్రీను, పులి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, పొదెం వీరయ్య, వేం నరేందర్రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. -
కమిషనరేట్ పరిధిలోకి రెండు జిల్లాలు
వరంగల్, హన్మకొండ జిల్లాలు పూర్తిగా... మానుకోట, భూపాలపల్లిలో ఎస్పీ కార్యాలయాలు పోలీసు శాఖలో వేగంగా పునర్విభజన పూర్తిగా మారనున్న స్వరూపం సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజనతో పోలీసు శాఖ స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ఆ శాఖ పునర్విభజనపై ఉన్నత స్థాయిలో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ రెవెన్యూ జిల్లాలోని వరంగల్ పోలీస్ కమిషరేట్, వరంగల్ రూరల్ జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారి మల్లారెడ్డి నియమించింది. వరంగల్ జిల్లాను.. వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా పునర్విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా పోలీసు శాఖలోనూ విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలకు పోలీసు శాఖ పరంగా ప్రత్యేకంగా ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ముసాయిదాలో పేర్కొన్న మండలాల పరిధిలోని పోలీస్ స్టేషన్లను మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లోకి తీసుకువస్తున్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు ప్రత్యేకంగా రూరల్ విభాగాలు ఏర్పాటు చేయడం వల్ల అదనంగా ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముసాయిదాలో పేర్కొన్న వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. – వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 19 సాధారణ పోలీస్స్టేషన్లు, మూడు ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు, ఒక మహిళా పోలీస్స్టేషన్, ఒక క్రైం పోలీస్స్టేషన్ ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 41 సాధారణ పోలీస్స్టేషన్లు, ఒకటి మహిళా పోలీస్స్టేషన్, ఒకటి క్రైం పోలీస్స్టేషన్ ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో ఇదంతా పూర్తిగా మారిపోనుంది. – వరంగల్ పోలీస్ కమిషరేట్లో పరిధిలో ప్రస్తుతం ఉన్న 19 స్టేషన్లు యథావిధిగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం వరంగల్ రూరల్ పోలీస్ పరిధిలో ఉన్న రఘునాథపల్లి, నర్మెట, పాలకుర్తి, కొడకండ్ల, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల స్టేషన్లు పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి రానున్నాయి. – ప్రతిపాదిత హన్మకొండ జిల్లాలో కరీంనగర్ జిల్లాలోని ఐదు మండలాలు కలుస్తున్నాయి. ఇలా హన్మకొండలో కలుస్తున్న మండలాల్లోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్లు వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో కలపనున్నారు. పోలీసు శాఖ ప్రస్తుత స్వరూపం... వరంగల్ కమిషరేట్ : హన్మకొండ, కేయూసీ, సుబేదారి, మట్టెవాడ, మిల్స్కాలనీ, ఇంతేజార్గంజ్, మామునూరు, జఫర్గఢ్, రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, హసన్పర్తి, కాజీపేట, మడికొండ, ధర్మసాగర్, స్టేషన్ఘన్పూర్. వరంగల్ రూరల్ : జనగామ, రఘునాథపల్లి, లింగాలఘణపురం, నర్మెట, చేర్యాల, బచ్చన్నపేట, మద్దూరు, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రూరు, నర్సింహులపేట, నెల్లికుదురు, సీరోలు, కురవి, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం, మహబూబాబాద్ టౌన్, మహబూబాబాద్ రూరల్, గూడూరు, కొత్తగూడ, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల, మొగుళ్లపల్లి, రేగొండ, చిట్యాల, భూపాలపల్లి, గణపురం, వెంకటాపురం, ములుగు, పస్రా, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్ వాలా పిలుపు
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
Advertisement