-
డిపాజిటర్లు ఆందోళన చెందొద్దు..
l డీసీసీబీ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి l ఖాతాదారులు, డిపాజిటర్లకు అండగా ఉంటాం l ప్రత్యేక అధికారి, వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వరంగల్ రూరల్: వరంగల్ డీసీసీబీ డిపాజిటర్లు, ఖాతాదారులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని, ఎవ్వరూ కూడా ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీసీసీబీ ప్రత్యేక అధికారి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్లో డీసీసీబీ అధికారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకు పనితీరు తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ పాటిల్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో డిపాజిటర్లు సంయమనం పాటించాలని, ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరి డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే బ్యాంకు కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించామని, డిపాజిటర్లు, రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పాటిల్ తెలిపారు. డీఫాల్టర్ల జాబితా అందజేయాలి 2016–17 ఆర్థిక సంవత్సరంలో వరంగల్ డీసీసీబీ రూ.5కోట్ల లాభాలను ఆర్జించిందని అధికారులు కలెక్టర్ పాటిల్కు వివరించారు. అలాగే, 2015–16 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు 98శాతం రుణాల రికవరీ సాధించిందని, అదేవిధంగా బ్యాంకు రుణాలు, అప్పులు, పెట్టుబడులు, డిపాజిట్లు తదితర విషయాలపై వివరాలు తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు అధికారులు రుణాల రికవరీపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే, డిఫాల్టర్ల జాబితాతో పాటు బ్యాంకు ఖర్చులు, ఆదాయం తదితర అంశాలకు సంబంధించిన అకౌంట్స్, బ్యాలెన్స్షీట్ అందజేయాలని ఆదేశించారు. ఫసల్ బీమాపై.. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఫసల్ బీమా యోజనపై రైతులకు అవగా>హన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఫసల్ బీమాపై రైతులు ఆసక్తి చూపించేలా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నాలుగో విడత రుణ మాఫీ నిధులు విడుదల చేసిందని, జిల్లా వ్యాప్తంగా ఉన్న 19శాఖల ద్వారా కేటగిరీల వారీగా అర్హత ఉన్న రైతుల వివరాలు అందజేస్తే, ఆ వివరాల ఆధారంగా రుణమాఫీ నిధులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డీసీసీబీలో 1.50లక్షల ఖాతాలు ఉన్నాయని, ఆయా ఖాతాదారులందరూ నగదు రహిత లావాదేవీలు చేసే దిశగా ప్రోత్సహించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. ఖాతాలకు వంద శాతం ఆధార్, మొబైల్ సీడింగ్, చేయాలన్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న 37వేల కిసాన్ క్రెడిట్ కార్డులను సంబంధిత శాఖల ద్వారా ఖాతాదారులకు వెంటనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్ష సమావేశంలో డీసీసీబీ సీఈఓ అంజయ్య, ఇన్చార్జి జీఎం శ్రీనివాస్, డీజీఎం మధు, అర్బన్ డీసీఓ కరుణాకర్, రూరల్ డీసీఓ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వరంగల్ డీసీసీబీ పాలకవర్గం సస్పెన్షన్
- ఆరు నెలలపాటు విధింపు - ప్రత్యేక అధికారిగా వరంగల్ రూరల్ కలెక్టర్ సాక్షి, వరంగల్: వరంగల్ కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గాన్ని సస్పెండ్ చేస్తూ సహకార శాఖ నిర్ణయం తీసుకుంది. పాలకవర్గం సస్పెన్షన్ నేపథ్యంలో 6 నెలలపాటు ప్రత్యేక అధికారిగా వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన బాధ్యతలను స్వీకరించారు. సహకారశాఖ నిర్ణయంతో 2 వారాలు గా నెలకొన్న సందిగ్దతకు తెరపడింది. పాలకవర్గాన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈ గడువులోపు మరోసారి ఉన్నతస్థాయి విచారణ నిర్వహించే అవకాశం ఉంది. ఈ విచారణ నివేదిక ఆధారంగా పాలకవర్గాన్ని రద్దు చేయడమో, పునరుద్ధరించడమో జరుగుతుంది. సస్పెన్షన్ గడువును మరో 6 నెలలూ పొడిగించే అవకాశ ముందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఫిబ్రవరిలో సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరితో ప్రస్తుత సంఘాల పదవీకాలం ముగియనుంది. వరంగల్ డీసీసీబీలో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, టి.రాజయ్య, ఎమ్.యాదగిరిరెడ్డి, ధర్మారెడ్డి, ఎ.రమేశ్, బి.శంకర్నాయక్ సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సహకార శాఖ ప్రాథమిక విచారణ చేసింది. డీసీసీబీలో నిర్వహణ లోపాలపై చైర్మన్ జంగా రాఘవరెడ్డికి సహకార శాఖ జాయింట్ రిజిస్ట్రార్ జి.శ్రీనివాసరావు ఏప్రిల్ 15న నోటీసు జారీ చేశారు. నోటీసుకు జంగా రాఘవరెడ్డి సోమవారం వివరణ ఇచ్చా రు. మరుసటి రోజు పాలకవర్గాన్ని సస్పెండ్ చేస్తూ సహకార శాఖ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్పై ఎమ్మెల్యే దయాకర్రావు స్పందిస్తూ.. అవినీతి, అక్రమాల కారణంగానే వరంగల్ డీసీసీబీ పాలకవర్గాన్ని సస్పెండ్ చేశారని, ఈ విషయంలో ఇతర కారణాలు లేవని అన్నారు. కక్ష సాధింపు చర్యలు: జంగా రాఘవరెడ్డి ‘‘సహకార చట్టాలకు విరుద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కక్ష సాధింపులకు పాల్పడ్డారు. నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే. పాలకవర్గం, నేను... అవినీతి, అక్రమాలకు పాల్పడితే నష్టాల్లో ఉన్న డీసీసీబీ రూ.5 కోట్లకు పైగా లాభాల్లోకి ఎలా వస్తుంది’’ అని రాఘవరెడ్డి ప్రశ్నించారు..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరంగల్ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
పవన్ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement