-
సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) యాజమాన్యం11వ వేజ్ బోర్డు ఏరియర్స్ విడుదల చేసింది. ఇందుకుగానూ రూ.1450 కోట్లను కేటాయించింది. సంస్థ డైరెక్టర్(పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్ ఆదేశాలపై కార్మికుల అకౌంట్లలో గురువారం మధ్యాహ్నం ఈ నగదు జమ చేసింది. ప్రస్తుత 39, 413 మంది ఉద్యోగుల కోసం రూ. 1450 కోట్లు విడుదల చేసింది సింగరేణి యాజమాన్యం. సింగరేణి భవన్ నుంచి గురువారం మధ్యాహ్నం ఆన్లైన్ ద్వారా ఎరియర్స్ విడుదల చేసిన చేశారు డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్, జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేష్. సగటున ఒక్కో కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేల రూపాయల ఎరియర్స్ అందనుంది. అయితే.. ఉద్యోగులకు వాళ్ల వాళ్ల సర్వీస్ సీనియారిటీని బట్టి నగదు జమ అవుతుంది. ఎరియర్స్ చెల్లింపుపై సింగరేణి సీ&ఎండీ ఎన్.శ్రీధర్, డైరెక్టర్ ఎన్ బలరామ్కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. త్వరలో దసరా, దీపావళి బోనస్ల చెల్లింపు ఉంటుందని డైరెక్టర్ బలరామ్ వెల్లడించారు. -
సింగరేణి కార్మికులకు 11వ వేజ్బోర్డ్ వేతనాలు నేడు
సింగరేణి (కొత్తగూడెం)/గోదావరిఖని: సింగ రేణి కార్మికులకు 11వ వేజ్బోర్డ్ ప్రకారం కొత్త వేతనాలను సంస్థ సోమవారం చెల్లించనుంది. కోల్ ఇండియా పరిధిలోని సింగరేణితో పాటు మరో 8 బొగ్గు పరిశ్రమలకు చెందిన సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు జూలై నుంచి కొత్త వేతనాలు అందించేందుకు సర్క్యులర్ విడుదల చేసింది. 10వ వేజ్బోర్డ్లో 1వ కేట గిరీ నుంచి ఏ1 గ్రేడ్ కార్మికులు, సూపర్వైజర్లు కలిపి సుమారు 42వేల మంది పనిచేస్తున్నా రు. వీరికి జూన్ వరకు నెలకు రూ.320 కోట్లు వేతనాల రూపంలో చెల్లించగా, 11వ వేతన సవరణలో అదనంగా రూ.70 కోట్ల మేర పెరి గాయి. గతంలో కేటగిరీ–1 కార్మికులకు రోజు కు రూ.1011.27 చెల్లించగా, ఇప్పుడు రూ.1502.66 చెల్లిస్తారు. ఏ1 గ్రేడ్, సూపర్ వైజర్లకు వేతనం గతంలో రూ.47,802.52 ఉండగా, 11వ వేజ్బోర్డు అమలుతో రూ.71, 030.56కు పెరిగింది. ఇంకా వీటికి అలవెన్స్లు అదనంగా లభిస్తాయి. బకాయి వేతనాలు విడుదల.. 10వ వేజ్బోర్డ్ కాల పరిమితి 2021 జూన్ 30 తో ముగిసింది. అంటే 2021 జూలై 1 నుంచి 11వ వేజ్బోర్డు అమలు కానుంది. ఈ నేపథ్యంలో 23 నెలల బకాయిలు కూడా కార్మికుల ఖా తాల్లో జమ కానున్నాయి. 11వ వేజ్బోర్డ్లో 19 శాతం మినిమమ్ గ్యారెంటీ బెనిఫిట్ (ఎంజీ బీ) జీతం పెరుగుదలతోపాటు 25 శాతం అల వెన్స్లు కలిపి ఒకొక్క కార్మికుడికి వారి వేతన స్థాయిని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు బకాయిలు అందే అవకాశం ఉంది. -
బొగ్గు గని కార్మికుల వేజ్బోర్డు ఐదేళ్లు
శ్రీరాంపూర్ (మంచిర్యాల)/గోదావరిఖని: సింగరేణి సహా దేశంలోని అన్ని బొగ్గు గనుల 11వ వేజ్ బోర్డు కాలపరిమితి ఐదేళ్లు ఉండేలా ఒప్పందం జరిగింది. బుధవారం ఢిల్లీలోని సామ్రాట్ హోటల్లో కోలిండియా చైర్మన్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన 11వ జేబీసీసీఐ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భేటీలో భాగంగా వేతన ఒప్పందంపై కోలిండియా, సింగరేణి కంపెనీ, 4 జాతీయ సంఘాల ప్రతినిధులు చర్చించారు. నవరత్న, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో వేతన ఒప్పంద కాలపరిమితి 10 ఏళ్లుగా ఉందని, బొగ్గు పరిశ్రమల్లోనూ ఇలానే ఒప్పందాలు చేసుకోవాలని కోలిండియా యాజమాన్యం పట్టుబట్టింది. సంస్థలో పనిచేస్తున్న అధికారులతో పోల్చితే కార్మికుల బేసిక్ ఎక్కువగా ఉంటోందని పేర్కొంది. అయితే ఈ ఒప్పందానికి జాతీయ సంఘాలు ససేమిరా అన్నాయి. ఐదేళ్ల కాలపరిమితికే అంగీకరిస్తామని చెప్పాయి. దీంతో యాజమాన్యం వెనక్కి తగ్గి అంగీకరిస్తూ ఒప్పందం చేసుకుంది. మిగతా జీతభత్యాల విషయం ఈ చర్చల్లో కొలిక్కి రాలేదు. డీపీఈ ప్రకారం వేతనాలు మాకొద్దు కార్మిక సంఘాల డిమాండ్లను పరిష్కరిస్తే ఎంత ఆర్థిక భారం పడుతుందో యాజమాన్యం లెక్కలేసి చెప్పింది. పీఎస్యూల్లో ఉన్న వేతనాలకు అనుగు ణంగా బొగ్గు పరిశ్రమల్లోనూ వేతనాలు ఉండాలని సూచించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (డీపీఈ) గైడ్లైన్స్ మార్గదర్శకాల ప్రకారం వేతనాలు పెంచుతామంది. కానీ కార్మిక సంఘాల నేతలు డీపీఈ గైడ్లైన్స్ ప్రకారం వేతనాలు అంగీకరించబోమన్నారు. వేతనాలు, అలవెన్సు పెరుగుదల, కేడర్ స్కీం, సీపీఆర్ఎంఎస్ మెడికల్ స్కీం సవరణ, పెన్షన్ సవరణ, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వంటి డిమాండ్లను 5 విభాగాలుగా చేసి ప్రత్యేక కమిటీల ద్వారా చర్చిస్తామని యాజమాన్యం ప్రతిపాదించగా కార్మిక సంఘాల నేతలు ఖండించారు. అన్నింటినీ తదుపరి సమావేశాల్లోనే చర్చించాలని డిమాండ్ చేశారు. మిగతా డిమాండ్లపై ఏప్రిల్లో జరిగే సమావేశంలో చర్చిస్తామని వేజ్బోర్డు సభ్యుడు వి.సీతారామయ్య తెలిపారు. సమావేశంలో లక్ష్మారెడ్డి, మాధవ్నాయక (బీఎంఎస్), రియాజ్ అహ్మద్ (హెచ్ఎమ్మెస్), మంద నర్సింహారావు (సీఐటీయూ) పాల్గొన్నారు. -
వేజ్బోర్డు బకాయిలు ఏవి?
గోదావరిఖని(రామగుండం) : సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు 2016 జూలై ఒకటి నుంచి 10వ వేజ్బోర్డు అమలవుతోంది. కోల్ఇండియాలో చేసిన ఒప్పందం సింగరేణిలో కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ వేతన ఒప్పందానికి సంబంధించిన బకాయిల్లో కొంత మొత్తం చెల్లించగా...మిగిలిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనేది ఇంకా తేలకపోవడంతో కార్మికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా ఎనిమిది సబ్సిడరీ సంస్థలతో కూడిన కోల్ఇండియాలో పనిచేస్తున్న మూడున్నర లక్షల మంది, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సింగరేణిలో పనిచేస్తున్న 53 వేల మంది కార్మికులకు ప్రతీ ఐదేళ్లకోసారి వేతనాలు పెంచుతారు. ఇందుకోసం కోల్ఇండియా, సింగరేణిలో పనిచేస్తున్న జాతీయ కార్మిక సంఘాలు, యాజమాన్యాల నుంచి ప్రతినిధులను ఎంపికచేసి జాయింట్ బైపార్టియేటెడ్ కమిటీ ఫర్ కోల్ ఇండస్ట్రీ (జేబీసీసీఐ) అనే కమిటీని నియమిస్తారు. ఈ కమిటీ పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం వేతనాలు ఎంత మేరకు పెంచాలనే నిర్ణయం తీసుకుంటుంది. ఆ మేరకు పెరిగిన వేతనాలను కోల్ఇండియా యాజమాన్యం, సింగరేణి యాజమాన్యం కార్మికులకు అందజేస్తుంది. 2017 నవంబర్ నుంచి కొత్త వేతనాలు.. పదో వేతన ఒప్పందం 2016 జూలై ఒకటి నుంచి అమలు కావాల్సిఉంది. పెరిగిన వేతనాలు అప్పటి నుంచి ఇవ్వాల్సి ఉండగా.. యాజమాన్యాలు 2017 నవంబర్ నెల నుంచి ఇస్తున్నాయి. అయితే 2016 జూలై నుంచి 2017 అక్టోబర్ వరకు 16 నెలలకు సంబంధించి ఇవ్వాల్సిన వేతనాలు యాజమాన్యాలు కార్మికులకు బకాయి పడ్డాయి. అయితే ఆనాడు చేసుకున్న ఒప్పందంలో భాగంగా ప్రతీకార్మికుడికి బకాయిలలో రూ.51 వేలను ప్రతీ కార్మికుడికి 2017 నవంబర్ 3న చెల్లించాయి. కానీ.. పెరిగిన వేతనాల ప్రకారం ఒక్కో కార్మికుడికి కనీసంగా లక్ష రూపాయల నుంచి రూ.2.50 లక్షల వరకు ఈ 16 నెలలకు సంబంధించి రావాల్సి ఉంది. ఇందులో రూ.51 వేలను ముందస్తుగా ఇవ్వగా మిగిలిన బకాయిలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ యాజమాన్యాలు ఇప్పటి వరకు వేతన బకాయిలను చెల్లించడానికి ముందుకు రాకపోవడంతో కార్మికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈనెల 15 లోపు ఇవ్వడం అనుమానమే.. కోల్ఇండియా యాజమాన్యం ఈనెల 15 లోపు వేతన ఒప్పంద బకాయిల్లో 70 శాతం వరకు చెల్లింపులు చేస్తామని మే 31న ఉత్తర్వుల జారీచేసింది. కానీ జేబీసీసీఐ కమిటీలోని జాతీయ కార్మిక సంఘాలకు చెందిన సభ్యుల సంఖ్య విషయంలో తారుమారు కావడంతో ఆయా సంఘాల సభ్యుల సమావేశం కాలేదు. దీంతో ఈ నెల 15లోపు ఇవ్వాలనుకున్న వేతన బకాయిలు కూడా చెల్లించేది అనుమానంగా ఉంది. కోల్ఇండియాలో చేసేచెల్లింపుల ఆ«ధారంగానే సింగరేణిలో కూడా వేతన బకాయిలు చెల్లిస్తారు. కానీ... కోల్ఇండియాలో వేతన బకాయిల చెల్లింపు జరిగే అవకాశాలు కనిపించకపోవడంతో ఇక్కడ కూడా చెల్లింపులు చేయడం జరగదనే ఊహగానాలు బయలుదేరుతున్నాయి. అయితే కోల్ఇండియాతో సంబంధం లేకుండా సింగరేణి యాజమాన్యం కార్మికులకు పదో వేతన ఒప్పంద బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కొత్త వేజ్బోర్డుకు మరింత సమయం
సాక్షి, హైదరాబాద్: బొగ్గు పరిశ్రమల యాజమాన్యాలు, జాతీయ కార్మిక సంఘాల మధ్య ఇటీవల కుదిరిన 10వ జాతీయ బొగ్గు కార్మికుల వేతనాల ఒప్పందం (ఎన్సీడబ్ల్యూఏ) అమలుకు కొంత సమయం పట్టే అవకాశముందని సింగరేణి బొగ్గు గనుల సంస్థ యాజమాన్యం తెలిపింది. అయితే, ఈ ఒప్పందం ప్రకారం 2016 జూలై 1 నుంచి కార్మికులకు కొత్త వేజ్బోర్డు అమలు చేయాల్సి ఉంది. కాగా కొత్త వేజ్బోర్డు వేతనాల బకాయిల నుంచి రూ.51 వేలను దీపావళి సందర్భంగా కార్మికులకు అడ్వాన్స్గా చెల్లిస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం సింగరేణి కార్మికుల ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని వెల్లడించారు. కొత్త వేజ్బోర్డు వేతనాలు అమల్లోకి వచ్చినప్పుడు ఈ రూ.51 వేల అడ్వాన్స్ను మినహాయించుకుని మిగిలిన బకాయిలను కార్మికులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ గత నెల రోజుల్లో 3 పర్యాయాలు కార్మికులకు వివిధ రూపాల్లో చెల్లింపులు జరిపిందని.. దసరా అడ్వాన్స్గా రూ.120 కోట్లు, దీపావళి బోనస్గా రూ.336 కోట్లు, లాభాల బోనస్గా రూ.98.84 కోట్లు మొత్తం కలిపి రూ.554.84 కోట్లు చెల్లించిందని వివరించారు. తాజాగా కొత్త వేజ్బోర్డు వేతన బకాయిల నుంచి రూ.265 కోట్లను చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement