-
దరఖాస్తు చేసినా ఓటు రాలేదు సార్
ఖమ్మం అర్బన్: ఓటు ఆయుధం లాంటిదని, ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్గా మారడంతో ప్రతి ఓటు కీలకంగా మారుతోంది. దీంతో ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో అని ప్రజలు ఎంతో ఆతృతగా పరిశీలిస్తున్నారు. గతంలో అనేక సార్లు దరఖాస్తు చేసిన వారి పేరు మళ్లీ జాబితాలో లేక పోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎన్నికల సంఘం చివరి అవకాశంగా ఓటు ఉందో లేదో పరిశీలించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాను ప్రదర్శించి ‘చెక్ యువర్ ఓట్’ అనే కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు నిర్వహించింది. దీంతో ఖమ్మం నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రా ల సందడి నెలకొంది. తమ ఓటు ఉందో లేదోనని ప్రజలు అక్కడికి చేరుకొని జాబితాను చెక్ చేసుకోవడం కనిపించింది. గతంలో ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసిన వారు జాబితాలో పేరు లేకపోవడం అనేక మందికి ఎదురైంది. మళ్లీ, మళ్లీ దరఖాస్తు ఇవ్వడం తప్ప పేరు మాత్రం నమోదు కావడం లేదంటూ కేంద్రాల వద్ద కొందరు అసహనం వ్యక్తంచేశారు. ఖమ్మం నియోజకవర్గంలోని 295 పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓలు ఓటర్ల జాబితాను పట్టుకొని వేచి ఉన్నారు. నివాసం ఉన్న ఇంటి నుంచి ఖాళీ చేసి వెళ్తే విచారణ సమయంలో వాటిని తొలగించాలని చెప్పినా జాబితాల్లో పేర్లు అలాగే ఉంచారని కొందరు ఫిర్యాదు చేశారు. -
13 వరకు ఓటర్ల పరిశీలన ప్రక్రియ
గుంటూరుసిటీ,న్యూస్లైన్ :ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన క్లెయింలు, అభ్యంతరాలను పరిశీలించే గడువును ఈనెల 10వ తేదీనుంచి 13వ తేదీకి(మూడు రోజులు) కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్లాల్ తెలిపారు. విశాఖపట్నం నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలన గడువును పొడిగించిందని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టరు గమనించి 13వతేదీ లోగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పరిష్కరించిన వాటి వివరాలను ఏరోజు కారోజు అప్డేట్ చేయాలన్నారు. 16వ తేదీన ఓటర్ల తుదిజాబితాను ప్రకటించాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగాని, మార్చిలోగాని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నందున, ఓటర్ల నమోదు ప్రక్రియ జాగ్రత్తగా పూర్తి చేయాలన్నారు. ఓటర్ల నమోదుపై ఏ విధమైన ఫిర్యాదులు అందినా వాటిని తుది జాబితా విడుదల చేసేలోగా పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈవీఎంలను నిల్వచేసేందుకు చేపట్టిన గోడౌన్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే పూర్తయిన గోడౌన్లలోకి ఈవీఎంలను తరలించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్ కుమార్ మాట్లాడుతూ గత నెల 23 నాటికి సుమారు 3లక్షల 26వేల క్లెయింలు, అభ్యంతరాలు వచ్చాయన్నారు. వీటిలో 54 శాతం విచారణ పూర్తయిందని,26 శాతం డేటా నమోదు చేసినట్టు వివరించారు. పెండింగ్లో ఉన్న క్లెయింలు, అభ్యంతరాలను 13లోగా పరిష్కరిస్తామని చెప్పారు. గోడౌన్ల నిర్మాణం నెలాఖరుకు పూర్తిచేస్తామన్నారు. కాన్ఫరెన్స్లో జె.సి వివేక్యాదవ్, అదనపు జేసీ కె.నాగేశ్వరరావు, డీఆర్వో కె.నాగబాబు, ఈఆర్వో, ఏఈఆర్వోలు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement