breaking news
vote -note
-
ఓటుకు కోట్లు కేసులో కర్త, కర్మ, క్రియ చంద్రబాబే
సాక్షి, అమరావతి: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, ఈ కేసులో కర్త, కర్మ, క్రియ ఆయనేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయినా చంద్రబాబుపై ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని, ఎందుకు విచారణకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. ఇలా దొరికిపోయిన నేతను వదిలిపెట్టడం వల్ల ప్రజలకు చట్టం, రాజ్యాంగంపై విశ్వాసం సన్నగిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో ప్రధాన నిందితుడిగా చంద్రబాబు అనుచరుడు రేవంత్రెడ్డి ఉన్నట్టు తెలిపారు. స్టీఫెన్సన్కు రూ.50 లక్షలిస్తూ రేవంత్రెడ్డి పట్టుబడ్డారని, ఆ సమయంలో ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన విషయం అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు పాత్రను ఈడీ ప్రస్తావించిందన్నారు. అవి చంద్రబాబు మాటలేనని ఫోరెన్సిక్ రిపోర్టు ధ్రువీకరించిందని చెప్పారు. చంద్రబాబు సూచనలతోనే తాను రాయబారం చేశానని ఈడీకి మత్తయ్య వాంగ్మూలం ఇచ్చినా చంద్రబాబును విచారించకపోవడం సరికాదన్నారు. ఇలాగైతే వ్యవస్థలపై సామాన్యులకు ఎలా నమ్మకం కలుగుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో చంద్రబాబును విచారించి శిక్ష విధించాలని ఈడీని డిమాండ్ చేశారు. సీఎం జగన్పై విషం చిమ్మడానికే మహానాడు డ్రామా జూమ్ మీటింగ్లో రోజంతా మాట్లాడిన చంద్రబాబు.. రేవంత్రెడ్డిపై ఈడీ కేసు బుక్ చేసిన విషయంపై ఎందుకు స్పందించలేదని జోగి రమేష్ నిలదీశారు. పార్టీ వ్యవస్థాపకుడి చావుకు కారణమై.. ఇప్పుడు మహానాడు పేరుతో హైదరాబాద్ నుంచి జూమ్లో గంటలు గంటలు మాట్లాడుతూ డ్రామాలాడుతుంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్పై విషం చిమ్మడమే మహానాడులో చంద్రబాబు అండ్ కో పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రెండేళ్ల ప్రభుత్వ విజయాలను మరుగునపర్చాలన్న ఏకైక అజెండాతో రెండు రోజులు మహానాడు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ప్రజా దీవెనలు ఎల్లప్పుడూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్నాయని చెప్పారు. -
ఓటుకు కోట్లు కేసు: కుట్రదారును వదిలి పాత్రధారులపై అభియోగాలా?
సాక్షి, హైదరాబాద్: ఈడీ చార్జిషీట్లో ‘ఓటుకు కోట్లు’కుట్రకు ప్రధాన సూత్రధారి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పేరును నిందితుడిగా చేర్చకపోవడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘మనవాళ్లు అంతా బ్రీఫ్డ్ మీ. వారిచ్చిన హామీని నెరవేరుస్తా’నంటూ నేరుగా స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టిన చంద్రబాబును పక్కనపెట్టి.. కుట్రను అమలుచేసిన పాత్రధారులపై మాత్రమే అభియోగాలు మోపడం ఆశ్చర్యకరమని అంటున్నారు. టీడీపీ మహానాడు వేదికగా కుట్ర జరిగినట్టు బయటపడినా, స్పష్టమైన ఆడియో, వీడియో ఆధారాలున్నా కూడా చంద్రబాబును నిందితుడిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తున్నారు. ఆ స్వరం చంద్రబాబుదే.. స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన సంభాషణలను ప్రఖ్యాత ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) పరీక్షించింది. ఆ స్వరం చంద్రబాబుదేనని తేల్చిచెప్పింది. చంద్రబాబు చేసిన ఈ కుట్రను రేవంత్రెడ్డి తదితరులు అమలు చేశారనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. ఆడియో, వీడియో ఆధారాలున్నా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈడీ కూడా చంద్రబాబును నిందితుడిగా చేర్చకపోవడం సరికాదు. చట్టం దృష్టిలో అందరూ సమానమనే సందేశం ఇవ్వాలంటే చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలి. – కొంతం గోవర్ధన్రెడ్డి, న్యాయవాది చంద్రబాబే కుట్రదారు టీడీపీ అధినేత, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే వచ్చామని రేవంత్, ఇతర నిందితులు స్టీఫెన్సన్కు చెప్పారు. అంటే ప్రధాన కుట్రదారు చంద్రబాబే. ఆయనను వదిలేసి పాత్రధారుల్ని నిందితులుగా చేర్చడం శోచనీయం. చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ కుట్రను అమలు చేసినా ఈడీ ఆయనను విచారించలేదు. లంచం డబ్బును తీసుకొచ్చిన వారిని నిందితులుగా చేర్చి.. డబ్బు సమకూర్చి పంపిన చంద్రబాబును విడిచిపెట్టడం ఏమిటి? ఇప్పటికైనా చంద్రబాబును నిందితుడిగా చేరుస్తూ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయాలి. – ఒద్యారపు రవికుమార్, న్యాయవాది -
చంద్రబాబే ఏ-1
సాక్షి, హైదరాబాద్ : ఎట్టకేలకు ‘ఓటుకు కోట్లు’ కేసు కొలిక్కి రాబోతోంది! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ కేసులో ఏ–1 నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోబోతున్నారు. శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినట్లు రుజువైనందున ఈ కుట్రలో ఆయనే కీలకం అవుతారని న్యాయ నిపుణులు ఇప్పటికే తేల్చిచెప్పారు. కేసులో ఆయన్ను ఏ–1 నిందితుడిగా పేర్కొనాల్సి ఉంటుందని సోమవారం ప్రగతిభవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో పోలీసు అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దృష్టికి తెచ్చారు. ‘‘చట్టం ముందు అందరూ సమానులే. చట్ట ప్రకారం వ్యవహరించండి. మీపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఓటుకు కోట్లు కేసును ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు రెండున్నర గంటలపాటు పోలీసు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్ష రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు మరోమారు తెరపైకి రావడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. మూడేళ్ల నాటి కేసు మూడేళ్ల క్రితం జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు లంచం ఇస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి రెడ్హ్యాండెడ్గా దొరకడం, అరెస్టు కావడం తెలిసిందే. స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇవ్వజూపడానికి ముందే చంద్రబాబునాయుడు ఆయనకు ఫోన్ చేసి టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రలోభాలకు గురిచేసిన ఆడియో అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది. ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఏ–1 నిందితుడిగా పేర్కొన్న మొదటి చార్జిషీట్లో చంద్రబాబు పేరు 22 సార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాత స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో రికార్డులో ఆ వాయిస్ చంద్రబాబుదా కాదా అని నిర్ధారించేందుకు ఏసీబీ చర్యలు చేపట్టింది. ఆడియో టేపులను చండీగఢ్ ఫోరెన్సిక్ విభాగానికి పంపింది. అది చంద్రబాబు వాయిసేనంటూ ఫోరెన్సిక్ విభాగం ఇటీవలే నివేదిక ఇచ్చింది. కారణమేంటో గానీ రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసు ఏ మాత్రం ముందుకు సాగలేదు. చండీగఢ్ ఎఫ్ఎస్ఎల్ ధ్రువీకరణ స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడిన ఆడియోను ధ్రువీకరించుకునేందుకు ఏసీబీ చాకచక్యంగా వ్యవహరించింది. రాష్ట్రంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కాకుండా చండీగఢ్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో వాయిస్ను శాంపిల్ను పరీక్ష చేయించింది. అంతకుముందే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం బాబు ఆడియో శాంపిల్స్ను ఓ ప్రైవేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో పరీక్ష చేయించారు. అది చంద్రబాబు గొంతే అని స్పష్టంగా తేలడంతో ఆయన.. బాబుపై విచారణ జరపాలంటూ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీరా ఇప్పుడు ఏసీబీ అధికారికంగా పరీక్షించిన వాయిస్ టెస్టులో అది చంద్రబాబు గొంతేనని మరోసారి అధికారికంగా ధ్రువీకరించడంతో కేసులో కదలిక వచ్చింది. ప్రఖ్యాతిగాంచిన చండీగఢ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నాలుగు రోజుల క్రితం బాబు ఆడియో నివేదిక ఏసీబీ చేతికి అందింది. అన్ని ఆధారాలు లభ్యం కావడంతో రా>ష్ట్ర ప్రభుత్వం ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు నాలుగు రోజులుగా లోలోపల కసరత్తు చేస్తోంది. కుట్ర మొత్తం బాబుదే.. ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ..’అంటూ సంభాషించింది చంద్రబాబు అని తేలడంతో ఓటుకు కోట్లు కేసులో కుట్ర మొత్తం చంద్రబాబుదిగానే ఏసీబీ చార్జిషీట్ రూపొందిస్తోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణతో సెక్షన్లు చేర్చబోతోంది. ఇప్పటివరకు ఈ కేసులో ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఏ–1గా ఉండగా, సెబాస్టియన్ ఏ–2గా, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏ–3గా, ఉదయ్సింహ ఏ–4గా, జెరూసలెం మత్తయ్య ఏ–5గా ఉన్నారు. అయితే ఇప్పుడు కుట్ర మొత్తం చంద్రబాబుదే అని స్పష్టం కావడంతో ఏ–1గా ఆయన పేరు చేర్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు స్పష్టంచేశారు. ఆ తర్వాత మిగిలిన నిందితుల పేర్లను చేరుస్తామని అధికారులు తెలిపారు. 2015 జూలై 28న తొలి చార్జిషీట్ ఓటుకు కోట్లు కేసులో ముందుగా అరెస్టయిన రేవంత్రెడ్డి, సెబాస్టియన్, సండ్ర, ఉదయ్సింహలను విచారించిన ఏసీబీ అధికారులు 2015 జూలై 28న మొదటి చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా ఆడియో, వీడియో శాంపిల్స్, స్టీఫెన్సన్, సెబాస్టియన్, రేవంత్, తదితరుల ఫోరెన్సిక్ రిపోర్టులను 2017 మార్చిలో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో పొందుపరిచారు. ఇప్పుడు బాబే అసలు నిందితుడని తేలడంతో ఏసీబీ ఈ నెల చివరి వారంలో తుది చార్జిషీట్ను దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎవరి ఒత్తిడికీ లొంగవద్దు: కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఓటుకు కోట్లు కేసు పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు, ఏసీడీ మాజీ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్చంద్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ కేసులో చట్టం తని పని తాను చేసుకుపోవాలని, ఆధారాలు బలంగా ఉన్నప్పుడు ఎవరి ఒత్తిడికి లొంగాల్సిన అవసరం లేదని, చార్జిషీట్ దాఖలు చేయాల్సిందేనని సీఎం అధికారులకు సూచించినట్టు తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా రంగంలోకి దిగనున్నారని సీఎం కార్యాలయ వర్గాలు స్పష్టంచేశాయి. గవర్నర్ దృష్టికి.. ఆదివారం రాత్రి సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ భేటీలోనూ ఈ కేసు ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. గవర్నర్కు కేసు పురోగతిని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబుపై తీసుకోబోతున్న చర్యలను కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కావడంతో చార్జిషీట్, నిందితుల జాబితాలో చేర్చడం వంటి అంశాల్లో గవర్నర్ నుంచి అనుమతి కూడా రాష్ట్ర ప్రభుత్వం పొందినట్టు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వచ్చే పదిహేను రోజుల్లో ఏసీబీ కోర్టులో పూర్తి స్థాయి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు జీఏడీ నుంచి అనుమతి తీసుకున్నామని, గవర్నర్ నుంచి కూడా అనుమతి లభించినట్టు ఏసీబీలోని కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. బాబు వివాదాస్పద నిర్ణయాలపై పునఃసమీక్ష ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఎంజీ అనే సంస్థకు రాజధాని హైదరాబాద్లో క్రీడా మైదానాలు అప్పగించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కూడా తిరగదోడాలని, దానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలిలో దుబాయ్కి చెందిన ఎమ్మార్ సంస్థకు గోల్ఫ్ కోర్సు పేరిట దాదాపు 500 ఎకరాలు కట్టబెట్టిన వైనంపైనా విచారణ జరుపనుంది. ఎమ్మార్, రహేజాతో పాటు చంద్రబాబు హయాంలో సాగిన అన్ని భూ లావాదేవీల వెనుక గుట్టును రాబట్టాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు హయాంలో భూ కేటాయింపులకు సంబంధించి అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. సెబాస్టియన్ (బాబు అనుచరుడు): హలో స్టీఫెన్సన్: యా బ్రదర్.. సెబాస్టియన్: బాబు గారు గోయింగ్ టు టాక్ టూ యు, బి ఆన్ ద లైన్ (బాబు గారు మీతో మాట్లాడుతారు మీరు లైన్లో ఉండండి) స్టీఫెన్సన్: యా చంద్రబాబు: హలో.. స్టీఫెన్సన్: సర్ గుడ్ ఈవెనింగ్ సర్.. చంద్రబాబు: ఆ.. గుడ్ ఈవెనింగ్ బ్రదర్, హౌ ఆర్ యూ స్టీఫెన్సన్: ఫైన్.. థ్యాంక్యూ సర్ చంద్రబాబు: మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. ఐయామ్ విత్ యూ.. డోంట్ బాదర్ (మనవాళ్లు నాకు అంతా వివరించారు. మీకు అండగా నేనున్నాను. కంగారు పడాల్సిన పని లేదు) స్టీఫెన్సన్: యస్ సర్.. రైట్ సర్ చంద్రబాబు: ఫర్ ఎవ్రీ థింగ్ ఐ యాం విత్ యు, వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్ (దేనికైనా మీకు నేను అండగా ఉంటాను. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తా) స్టీఫెన్సన్: ఎస్ సార్.. రైట్ సార్.. చంద్రబాబు: ఫ్రీలీ యూ కెన్ డిసైడ్.. నో ప్రాబ్లం ఎట్ ఆల్ (మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు.. ఎలాంటి సమస్యా లేదు) స్టీఫెన్సన్: ఎస్ సర్ చంద్రబాబు: దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ వుయ్ విల్ వర్క్ టుగెదర్ (అది మా హామీ.. మనం కలసి పని చేద్దాం) స్టీఫెన్సన్ : రైట్...థాంక్యూ సర్.. చంద్రబాబు: థాంక్యూ. చంద్రబాబు–ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మధ్య నడిచిన ఫోన్ సంభాషణ ఇదీ.. -
ఓటుకు నోటు కేసులో బాబే దోషి
కడప వైఎస్సార్ సర్కిల్ : ఓటుకునోటు కేసులో చంద్రబాబే అసలు దోషి అని శాసనమండలి ప్రతిపక్షనేత రామచంద్రయ్య పేర్కొన్నారు.శుక్రవారం ఇందిరాభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రజల పరువు తీశారని, చంద్రబాబు అవినీతికి పాల్పడకుంటే కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య బీజేపీ ఢిల్లీ పెద్దలు రాజీ కుదిర్చి చంద్రబాబును కేసు నుంచి తప్పించి హైదరాబాదు విడిచి విజయవాడకు వెళ్లే విధంగా ఒప్పంద చే శారని ఆరోపించారు. దీంతో పదేళ్ల ఉమ్మడి రాజధానిలో ఉండాల్సిన ఉద్యోగులను బలవంతంగా విజయవాడకు తరలించారన్నారు. రాజ్భవన్ను రాజీల భవన్గా మార్చి పంచాయితీలు చేస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాల పేరుతో ఉన్న నీటిని వదిలేసి రైతులు పంటలు వేసుకోకుండా చేశారన్నారు. పుష్కరాల పేరుతో18వందల కోట్లు దుబారా ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతిపై ఏసీబీ విచారణ జరుగుతుంటే నిలిపివేయడం ఇద్దరి సీఎంల మధ్య సయోధ్య కుదరడమేనన్నారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి ప్రజలకు రోజుకో మాట చెబుతు కాలం గడుపుతున్నారు తప్ప ఏం చేయలేదన్నారు ప్రత్యేకహోదా ఇవ్వకుండా ప్యాకేజీలపేరుతో ఏపి ప్రజలను అన్యాయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. సుజనాచౌదరి ప్రత్యేకహోదాకు చట్టంలో అడ్డంకులు ఉన్నాయని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఈసమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, పీసీసీ జనరల్ సెక్రటరీ సత్తార్ పాల్గొన్నారు