breaking news
vnr vignana jyothi institute of engineering & technology
-
'విఎన్ఆర్' ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన
బియాస్ దుర్ఘటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి విఎన్ఆర్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. దాంతో కాలేజీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు గత నెలలో విజ్ఞాన యాత్రలో భాగంగా ఉత్తర భారతంలో పర్యటించారు. అందులోభాగంగా హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నదిలోకి దిగిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయి మరణించిన సంగతి తెలిసిందే. అయితే కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థులకు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించి కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తు శుక్రవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. దాంతో కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
బియాస్ నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యం
హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అందులోభాగంగా సహాయ బృందాలు ఆదివారం రెండు మృతదేహాలను వెలికితీశాయి. హైదరాబాద్ నల్లకుంటకు చెందిన రిత్విక్, వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పరమేష్గా గుర్తించారు. దాంతో ఇప్పటివరకు 15 మృతదేహాలు లభ్యమైనాయి. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. హైదరాబాద్లోని వీఎన్ఆర్ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు విజ్ఞాన యాత్రకు వెళ్లారు. ఆ క్రమంలో ఈ నెల 8వ తేదీన 24 మంది విద్యార్థులు బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే.