-
కళాశాలలో ఏసీబీ తనిఖీలు
వినుకొండ రూరల్: వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని వివేకానంద డీఈడీ అండ్ బీఈడీ కాలేజీలో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల నేపథ్యంలో అక్రమాల్లో మధ్యవర్తిత్వం వహిçస్తూ వివేకానంద డీఈడీ అండ్ బీఈడీ కళాశాల డైరెక్టర్ సయ్యద్ రఫీ గత నెల 28న ఏసీబీకి పట్టుబడ్డ విషయం విదితమే. ఈ క్రమంలో తనిఖీ నిర్వహించేందుకు ఏసీబీ అధికారులు మంగళవారం కళాశాలకు వద్దకు వచ్చారు. కళాశాలలో సమాచారం ఇచ్చేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పట్టణంలోని వివేకానంద పాఠశాల ప్రిన్సిపల్ నీరజను కాలేజీ వద్దకు పిలిపించారు. రఫీ కుటుంబసభ్యులు సైతం అందుబాటులో లేకపోవడంతో ఏసీబీ అధికారులు సమాచారం సేకరించేందుకు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి స్థానిక తహశీల్దార్ నాగుల్సింగ్ సహకారంతో కళాశాలలోని రఫీ కార్యాలయంతో పాటు ఆయన నివాస గృహానికి ఏసీబీ సీఐ నరసింహారెడ్డి సీల్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలోని సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడంతో తమకు కావలసిన సమాచారం తారుమారు చేస్తారనే అనుమానంతో సీల్ వేశామన్నారు. కాలేజీలో చదివే విద్యార్థులకు ఆటంకం కలుగకూడదనే ఉద్దేశంతో రఫీ పర్సనల్ రూమ్ను మాత్రమే సీజ్ చేశామన్నారు. తనిఖీల్లో జిల్లా కమర్షియల్ టాక్స్ అధికారి కృష్ణకాంత్, పవన్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నోటికాడి పంటనీటిపాలు
6795 ఎకరాల్లో పత్తి... 1584 ఎకరాల్లో వరి =వర్షం ధాటికి దెబ్బతిన్న పంటలు... నేలకూలిన నివాస గృహాలు = ఏజెన్సీలో ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు... రాకపోకలకు అంతరాయం =వరంగల్లో ఇళ్లలోకి నీళ్లు... రోడ్లు, భవనాల శాఖకు రూ.20 కోట్ల నష్టం =జాతీయ విపత్తుల నివారణ శాఖకు నష్టం అంచనా నివేదించిన కలెక్టర్ వరంగల్, న్యూస్లైన్ : వరుస వానలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధాన పంటలన్నీ వర్షం ధాటికి దెబ్బతిన్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 6795 ఎకరాల్లో పత్తి, 1584 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు కలెక్టర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా వేసిన నష్టం అంచనాను జాతీయ విపత్తుల నివారణ కమిషనర్, రెవెన్యూ విభాగానికి పంపించినట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతున్నదని, త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక పంపిస్తామన్నారు. పది నివాస గృహాలు నేలమట్టం కాగా, 23 ఇళ్లు దెబ్బతిన్నాయని, మరో 109 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది.ఏజెన్సీలోని జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుం డడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించారుు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలు జలమయమయ్యూయి. చిన్న వడ్డేపల్లి చెరువు, కాశిబుగ్గ, వివేకానంద కాలనీ, శాంతినగర్, పద్మనగర్, ఎంహెచ్ నగర్, సుందరయ్య నగర్, దేశాయిపేట, సమ్మయ్యనగర్, నయీంనగర్, గోపాల్పూర్ ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. ఈనెల 22 నుంచి వరుసగా వర్షం కురుస్తోంది. 23న 11.7 మి.మీ, 24న 23.3 మి.మీ, 25న 28.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం అత్యధికంగా గీసుగొండ మండలంలో 92 మి.మీ. వర్షం కురిసింది. అదే విధంగా సంగెంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం 51 మండలాల్లో వర్షం కురిసింది. కాగా, కురవిలో పంట నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు ధర్నా చేశారు. పంట నష్టం అధికంగా ఇక్కడే.. జనగామ, నర్మెట్ట, మద్దూరు, చేర్యాల, బచ్చన్నపేట, పరకాల, ఆత్మకూర్, గీసుగొండ, సంగెం, డోర్నకల్, ములుగు, మంగపేట, ఏటూర్నాగారం, వర్ధన్నపేట, నర్సంపేట, దుగ్గొండి ఖానాపురం, నల్లబెల్లి నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో పంటలకు అధికంగా నష్టం వాటిల్లింది. ములుగులో 100 ఎకరాల్లో మిర్చి పంటకు వర్షాలతో తెగుళ్లు సోకినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తెగుళ్లతో మిర్చి దిగుబడి తగ్గే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. ఇక భూపాలపల్లి సింగరేణి ఓపెన్కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 99 రోడ్లు ధ్వంసం ఆర్అండ్బీ పరిధిలోని వరంగల్, మహబూబాబాద్ డివిజన్లో 99 రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు. వీటిని శాశ్వతంగా మరమ్మతు చేసేందుకు రూ.20 కోట్లు అవసరమని, తాత్కాలిక మరమ్మతులకు రూ.2.50 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించినట్లు ఎస్ఈ మోహన్ నాయక్ చెప్పారు. వర్షపాతం ఇలా.. జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం 28.6 మి.మీగా నమోదైంది. చేర్యాలలో 19.6, మద్దూరులో 25.2, నర్మెట్ట 46.6, బచ్చన్నపేట 20.2, జనగామ 28.4, లింగాలఘణపూర్ 28, రఘునాథపల్లి 34.8, స్టేషన్ఘన్పూర్ 38.2, ధర్మసాగర్ 42.2, హసన్పర్తి 38.2, హన్మకొండ 41.2, వర్థన్నపేట 35.2, జఫర్గడ్ 38.2, పాలకుర్తి 46.2, దేవరుప్పుల 52.2, కొడకండ్ల 30.2, రాయపర్తి 22.4, తొర్రూర్ 17.4, నెల్లికుదురు 8.4, నర్సింహులపేట 12.8, మరిపెడ 9.2, డోర్నకల్ 5.4, కురవి 3.6, మహబూబాబాద్ 5.6, కేసముద్రం 12.2, నెక్కొండ 5.6, గూడూర్ 9.8, కొత్తగూడ 12.2, ఖానాపూర్ 12.2, నర్సంపేట 22.8, చెన్నారావుపేట 10.2, పర్వతగిరి 20.2, సంగెం 62.4, నల్లబెల్లి 12.6, దుగ్గొండి 14.2, గీసుకొండ 92.0 ఆత్మకూరు 32.4, శాయంపేట 42.0, పరకాల 61.4, రేగొండ 24.0, మొగుళ్లపల్లి 54.6, చిట్యాల 59.2, భూపాలపల్లి 32.6, ములుగు ఘన్పూర్ 25, ములుగు 14.8, వెంకటాపూర్ 51.6, గోవిందరావుపేట 8.0, తాడ్వాయి 25.2, ఏటూరునాగారం 27.2, మంగపేట 12.8, వరంగల్లో 46.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement