-
కాంగ్రెస్కు మరో సీనియర్ నేత గుడ్బై
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత రాజీనామా చేశారు. ఏఐసీసీ సభ్యుడు, తెలంగాణ పీసీసీ ట్రెజరర్ గూడూరు నారాయణరెడ్డి సోమవారం పార్టీని వీడారు. ఆయన తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. త్వరలోనే నారాయణరెడ్డి బీజేపీలో చేరనున్నారు. గతంలోనే నారాయణరెడ్డి కాంగ్రెస్ను వీడతారనే ప్రచారం కూడా జరిగింది. మరోవైపు విజయశాంతి కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీలో చేరతారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్షాను విజయశాంతి కలిశారు. (అమిత్షాను కలిసిన విజయశాంతి) -
మళ్లీ పొరపాటు చేయొద్దు: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటు మరోసారి చేయొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని ఆమె అన్నారు. నరేంద్ర మోదీ వెనకుండి కేసీఆర్ను నడిపిస్తున్నారన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు మోదీ సాయం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ చేసిన అన్నిరకాల మోసాలకు మోదీ సర్కార్ మద్దతుగా నిలిచిందని విమర్శలు గుప్పించారు. శనివారం శంషాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో విజయశాంతి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ టెర్రరిస్టులా ప్రజలను భయపెడుతున్నారని ఆమె విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయని, ఇక పార్లమెంట్ ఎన్నికల సమరం మొదలైందన్నారు. ఇది కాంగ్రెస్-బీజేపీకి మధ్య జరిగే యుద్ధమంటూ విజయశాంతి అభివర్ణించారు. ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, అయితే మోదీ దాన్ని ఖూనీ చేసి, నియంతలా పాలించి, మరోసారి గద్దెనెక్కాలనుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం బీజేపీని చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తోందని, మోదీ ఎప్పుడు ఏం బాంబు వేస్తారో అని ప్రజలు వణికిపోతున్నారన్నారు. పెద్దనోట్ల రద్దు మొదలు.. జీఎస్టీ, పుల్వామా ఉగ్రదాడి వరకూ ఇదే పరిస్థితి అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలని విజయశాంతి కోరారు. తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్... తమ పార్టీ ఎమ్మెల్యేలను నయానో, భయానో, ఆశ చూపించో టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు. అందరి ముందు నరేంద్ర మోదీని తండ్రీకొడుకులు తిడతారని, కానీ తెర వెనుక మాత్రం అందరూ కలిసే పనిచేస్తారని అన్నారు. తన కొడుకును ఎలాగైనా ముఖ్యమంత్రిని చేసి, తాను ఢిల్లీలో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ ప్రయత్నాలు ఫలించవని ఆమె జోస్యం చెప్పారు. -
రేపు టికెట్లు ప్రకటించనున్న కాంగ్రెస్
కాంగ్రెస్ టికెట్ల ఖరారుపై రేపు స్పష్టత రానుంది. ఎప్పటినుంచో ఊహించిన విధంగానే నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతారెడ్డికి టికెట్ ఖాయమైనట్లు తెలుస్తోంది. మెదక్ టికెట్పై షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దీనికోసం 14 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం మెదక్ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ టికెట్ కోసం తీవ్రంగా కృషి చేసిన శశిధర్రెడ్డి రెబల్గా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన ఆశావహులు మాత్రం విజయశాంతి అభ్యర్థిత్వాన్ని సమర్థించినట్లు సమాచారం. సాక్షి, మెదక్: నెలరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనుంది. దీంతో మెదక్, నర్సాపూర్ టికెట్లపై స్పష్టత రానుంది. గురువారం రోజంతా స్క్రీనింగ్ కమిటీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వడకట్టింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి జాబితాను అందజేసింది. రాహుల్గాంధీ ఆమోదముద్ర పడినవెంటనే అభ్యర్థులను పేర్లను ప్రకటించనున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు అందరూ ఊహించిన విధంగానే నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ సునీతారెడ్డికి ఖరారు అయినట్లు తెలుస్తోంది. మెదక్ సీటుపై మాత్రం చివరి వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మెదక్ నుంచి పోటీ చేయాల్సిందిగా మాజీ ఎంపీ విజయశాంతిపై కాంగ్రెస్ అధిష్టానం వత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అధిష్టానం సూచన మేరకు ఆమె మెదక్ నుంచి పోటీ చేసేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ టికెట్ ఆశిస్తున్న ఇతర కాంగ్రెస్ నాయకులు సైతం విజయశాంతి పోటీ చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఎదుట గురువారం మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, జిల్లా నాయకుడు తిరుపతిరెడ్డిలు హాజరయ్యారు. వీరిద్దరిని కాంగ్రెస్ పెద్దలు బుజ్జిగించినట్లు సమాచారం. విజయశాంతి విజయానికి సహకరించాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని రెబెల్గా పోటీ చేయొద్దని ఇద్దరిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ టికెట్పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి మాత్రం విజయశాంతికి టికెట్ కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మెదక్ టికెట్ తనకు ఇస్తే భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతికి బహుమానంగా ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీలో మీడియాకు తెలియజేశారు. తనకు కాంగ్రెస్ టికెట్ దక్కని పక్షంలో రెబెల్గా పోటీచేసే యోచనలో శశిధర్రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తిరుపతిరెడ్డితోపాటు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బట్టి జగపతి, సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ తదితరులు విజయశాంతి అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నారు. మెదక్ నుంచి టీజేఎస్ పోటీ చేసేకంటే కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి పోటీచేస్తేనే తమకు, పార్టీకి బాగుంటుందని వారు భావించటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒత్తిడి తీసుకురావడంతో.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మొదలు మెదక్ అసెంబ్లీ టికెట్పై ఉత్కంఠ నెలకొంది. దీని కోసం 14 మంది కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో శశిధర్రెడ్డి మినహా మిగితా ఆశావహులంతా విజయశాంతిని కలిసి తమలో ఎవరికి టికెట్ ఇప్పించినా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఒప్పించారు. దీంతో విజయశాంతి శశిధర్రెడ్డిని మినహాయించి మిగితా ఆశావహుల్లో ఎవరికైనా టికెట్ ఇప్పించాలని అనుకున్నారు. అయితే అకస్మాత్తుగా టీజేఎస్ ఈ టికెట్ కోసం పట్టుబట్టింది. పొత్తులో భాగంగా మెదక్ స్థానాన్ని వదులుకునేందుకు ముందుగా కాంగ్రెస్ సిద్ధమైంది. దీనిని పసిగట్టిన ఆశావహులంతా మరోమారు విజయశాంతిని కలిసి మెదక్ టికెట్ టీజేఎస్కు వెళ్లకుండా చూడాలని, అవసరమైతే మీరే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తెలిపారు. దీంతో విజయశాంతి మూడు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ పెద్దలతోపాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్దాస్ను కలిసి మెదక్ టికెట్ ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్కే ఇవ్వాలని టీజేఎస్కు ఇవ్వొద్దని కోరారు. మెదక్ స్థానం టీజేఎస్కు ఇవ్వవద్దని అనుకుంటే మీరే పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతిపై వత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో విజయశాంతి మెదక్ నుంచి పోటీచేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కాగా టీజేఎస్ మాత్రం మెదక్పై ఇంకా ఆశలు వదులుకోవడం లేదు. విజయశాంతి పక్కకు తప్పుకున్న పక్షంలో మెదక్ స్థానం తమకే దక్కుతుందని టీజేఎస్ నాయకులు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం టికెట్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ టికెట్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. -
త్వరలోనే జిల్లాలో విజయశాంతి పర్యటన
హవేళిఘణాపూర్(మెదక్) : త్వరలోనే మాజీ ఎంపీ విజయశాంతి మెదజ్ జిల్లాలో పర్యటించనున్నారని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు చౌదరి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తొగిట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విజయశాంతి పర్యటించనున్నారన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ట్రాక్టర్లు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. రైతుబంధు పథకం కేవలం భూస్వాముల పథకంగా మారిందని, భూయాజమానికి ఎకరానికి రూ. 4వేలు ఇస్తే మరి కౌలు రైతు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వాధీనం చేస్తామన్న హామీ ఏమైందన్నారు. ఓ వైపు ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ కార్మికులను రోడ్డున పడేస్తు మరోవైపు టీఆర్ఎస్ హయంలోనే గ్రామాభివృద్ధి జరుగుతుందని డప్పు కొట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు సిరిమల్లె శ్రీనివాస్, ఆఫీజోద్దీన్, రమేష్రెడ్డి, కిషన్గౌడ్, శంకర్, లక్ష్మినారాయణ, దుర్గయ్య తదితరులున్నారు. -
ఇత్తడి తెలంగాణ చేశారు
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని ఇత్తడి తెలంగాణ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత ఎం.విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబం మినహా రాష్ట్రంలో ఎవరి కుటుంబమూ బంగారుమయం కాలేదని దుయ్యబట్టారు. సీఎం అతి విశ్వాసంతో పనిచేస్తున్నారని, కాళ్లు నేల మీద ఉంటే మంచిదని సూచించారు. ఉద్యమంలోని కేసీఆర్, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వేర్వేరు అని వ్యాఖ్యానించారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో విజయశాంతి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో నిర్బంధాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోదండరాం, మందకృష్ణ వంటి వారికి సమస్యలపై పోరాడే హక్కుందని.. కోదండరాంను అరెస్టు చేయడమే దారుణమన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పితే ప్రజలనూ జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. అవసరం కోసం పవన్కల్యాణ్ రాజకీయాలు చేస్తుండొచ్చని.. తెలంగాణ ప్రజలు తెలివైన వారని, ఆయన మాటలు నమ్మరన్నారు. అన్న (చిరంజీవి) వల్లే ఏమీ కాలేదని, తమ్ముడు (పవన్) ఏం చేస్తాడని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం పనిచేసిన వారిని మంత్రులుగా తీసుకోవడానికి ముందే కేసీఆర్ ఆలోచించాల్సిందని, ఇప్పుడు టీఆర్ఎస్పై తెలంగాణవాదుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. జయశంకర్ సూచన మేరకే విలీనం.. తెలంగాణ కోసం కొట్లాడుతున్న వారికి వేర్వేరు పార్టీలు ఎందుకని, కలసి పని చేయాలన్న ఆచార్య జయశంకర్ సూచన మేరకే తల్లి తెలంగాణపార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసినట్లు విజయశాంతి వెల్లడించారు. మల్కాజిగిరి, మహబూబ్నగర్ అంటూ మెదక్ ఎంపీ సీటుకే ఎసరు పెట్టారని గుర్తు చేశారు. తనను అర్ధరాత్రి సస్పెండ్ చేశారని, ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ చెప్పలేదన్నారు. ఇక నుంచి చురుగ్గా రాజకీయాలు వ్యక్తిగత పనుల వల్ల కొంతకాలం మౌనంగా ఉన్నానని, ఇక నుంచి పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కోరుకుంటున్నానని, రాహుల్గాంధీకీ ఇదే విషయం చెప్పానని, కానీ కచ్చితంగా పోటీ చేయాలని ఆయన సూచిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని, మీడియా స్వేచ్ఛనూ హరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో చేరి శుక్రవారం నాటికి 20 ఏళ్లు అవుతున్నాయని.. ఇప్పటివరకు ఎన్నో ఆటుపోట్లు, వెన్నుపోట్లు, అవమానాలు చూసినట్లు వెల్లడించారు. తమిళనాడులో జయలలిత అంటే అభిమానమని, డీఎంకే తనను అంతం చేయాలని చూసిందన్నారు. బీజేపీలో అద్వానీకి అన్యాయం జరిగిందని, ఆయనను పార్టీ అధ్యక్షుడిగా చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement