-
టి.బిల్లుకు ఇరుసభల్లో మద్దతిస్తాం: మాయావతి
తెలంగాణ బిల్లుకు లోక్సభలోనూ... రాజ్యసభలోనూ మద్దతు ఇస్తామని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి కుమారి మాయావతి స్పష్టం చేశారు. మంగళవారం ఆమె న్యూఢిల్లీలో మాట్లాడారు. తన స్వంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ను కూడా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే చాలా కాలం నుంచి ప్రత్యేక రాష్ట్రంలో కావాలని డిమాండ్ చేస్తున్న మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇరు రాష్ట్రాల విభజనపై కేంద్ర ప్రభుత్వం చాలా ఆలస్యం చేసిందని ఆమె ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అలాగే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. -
‘విదర్భ’ కోసం ఏకం కండి
నాగపూర్: ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన కోసం పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ ఎంపీ విలాస్ ముత్తెంవార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన విదర్భ ప్రాంతానికి చెందిన ఎమెల్మేల్యకు లేఖ రాశారు. ముంబై కేంద్రంగా విధాననిర్ణయాలు చేసేవారంతా విదర్భను నిర్లక్ష్యం చేస్తున్నారని అందులో ఆరోపించారు. ప్రత్యేక విదర్భ డిమాండ్కు బహిరంగ మద్దతు పలకాలని, ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గద్దని కాంగ్రెస్ పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలను కోరారు. విదర్భ ప్రాంత నాయకులు రాజకీయపరంగా ఎంతగానో సహకరించారని, అయితే అధినాయకత్వం ఏనాడూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కనబరచలేదన్నారు. విదర్భ ప్రాంతానికి చెందిన నాయకులను కేవలం ద్వితీయ స్థానాలకే పరిమితం చేశారని, గుర్తింపులేని మంత్రి పదవులు కేటాయించారని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినందుకు ఈ ప్రాంతం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆయన తన లేఖలో ఆరోపించారు. ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈనాటిది కాదని, తెలంగాణ కంటే పాతదని అన్నారు. అయితే తమ వైఖరిని బహిరంగంగా వెల్లడించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భ యపడ్డారని, అందువల్లనే ఈ డిమాండ్ను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఆరోపణలు సరికాదు మంత్రివర్గంలో లేనందువల్లనే తాను ప్రత్యేక విదర్భ రాష్ర్ట ఏర్పాటు డిమాండ్ను లేవనెత్తుకున్నానంటూ వచ్చిన ఆరోపణలను విలాస్ కొట్టిపారేశారు. విదర్భవాదాన్ని తలకెత్తుకున్నందుకు తాను ఎంతో నష్టపోయానని ఏడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన విలాస్ విచారం వ్యక్తం చేశారు. కాగా వారం క్రితం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలు ఆచరణ సాధ్యం కాదని, పెద్ద రాష్ట్రాలే మేలని పేర్కొన్న సంగతి విదితమే. -
‘ప్రత్యేక’ విదర్భ అవసరం లేదు
సాక్షి, ముంబై: ప్రత్యేక విదర్భ రాష్ట్రం వల్ల నక్సలైట్ల ప్రభావం పెరిగే అవకాశముందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏర్పాటుచేసిన ఛత్తీస్గడ్, జార్ఖంఢ్లలో పెద్ద ఎత్తున నక్సలైట్ల ప్రభావం పెరిగిందని గుర్తుచేశారు. చంద్రాపూర్ జిల్లా చిమూర్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విదర్భ రాష్ట్రం అవసరం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ప్రకటన అనంతరం మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ ఉద్యమం మరోసారి జోరుగా కొనసాగుతుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక విదర్భ ఏర్పాటైతే నక్సలైట్ల ప్రభావం మరింత పెరుగుతుందన్నారు. అభివృద్ధితోనే విదర్భకు మేలు.. ప్రత్యేక విదర్భ రాష్ర్ట ఏర్పాటు పెద్దగా అవసరం లేదని, అయితే అక్కడ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు నిర్వహించి విదర్భను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి జరిగితే విదర్భకు మేలు జరుగుతుందన్నారు. పుణే, ముంబైలతో పోలిస్తే విదర్భలో అభివృద్ధి కొంతమేర కుంటుపడిందని ఆయన అంగీకరించారు. ఈ కారణంతోనే ప్రత్యేక విదర్భ ఏర్పాటు చేయమనడం సబబు కాదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విదర్భ కోసం ప్రత్యేక ప్యాకేజీల ద్వారా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. సమైక్యంగా ఉంటేనే అందరికీ లాభమన్నారు. ఐక్యతే మహారాష్ట్ర అభివృద్ధికి ప్రధాన కారణమని తెలిపారు. కాగా, ప్రత్యేక తెలంగాణ ప్రకటన అనంతరం మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ ఉద్యమం మరోసారి జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ చవాన్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలపై విదర్భ వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం
ఆర్య కథ వినగానే ఇది నా ఇడియట్ అనిపించింది: అల్లు అర్జున్
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
సీఎం జగన్ వెంటే ఉంటాం ●
నగేష్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
గుత్తి కోటను సందర్శించిన ఎన్నికల పరిశీలకుడు
నయ వంచకుడు చంద్రబాబు
No Headline
జేసీకి భంగపాటు తప్పదు
పల్లె పిలిచింది
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement