breaking news
veeranjaneya swamy temple
-
పునఃప్రతిష్ట నిలిచిపోయిందని YS జగన్ దృష్టికి తెచ్చిన ఆలయ ఛైర్మన్
-
ఏపీలో ప్రసిద్ధ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
అనంతపురం ఎద్దులు ఫస్ట్
వల్లూరు: కడప– తాడిపత్రి ప్రధాన రహదారి పక్కన వల్లూరు మండలంలోని పాపాఘ్ని నగర్ వద్ద వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాల మహోత్సవంలో భాగంగా గురువారం నిర్వహించిన బండలాగుడు పోటీలలో అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చాగల్లుకు చెందిన వై ఆదినారాయణ ఎద్దులు 3986 అడుగులు బండను లాగి మొదటి స్థానంలో నిలిచాయి. మొత్తం 23 జతల కాండ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. కమిటీ సభ్యులు చిన్న ఓబులేసు పోటీలను ప్రారంభించారు. ►వల్లూరు మండలం చిన్న నాగిరెడ్డి పల్లెకు చెందిన నారంగారి శంకర్రెడ్డి ఎద్దులు 3863 అడుగులు బండను లాగి ద్వితీయ స్థానంలో, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం అప్పనపల్లెకు చెందిన గురు చరణ్ ఎద్దు మరియు దువ్వూరు మండలం దాసరిపల్లెకు చెందిన నరేష్ ఎద్దు కలిసి 3609 అడుగులు బండను లాగి మూడవ స్థానంలో నిలిచాయి. ►రాజుపాలెం మండలం కూలూరుకు చెందిన మారం రమేష్ ఎద్దులు 3500 అడుగులు లాగి నాలుగో స్థానంలో, ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం వంగపాడుకు చెందిన కైపా వెంకట రమణారెడ్డి ఎద్దులు 3423 అడుగులు లాగి ఐదవ స్థానంలో, కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం గుడిపాడుకు చెందిన వెంకట రామిరెడ్డి ఎద్దులు 3263 అడుగులు లాగి ఆరవ స్థానంలో, ఖాజీపేట మండలం ముత్తలూరు పాడుకు చెందిన ధవనం ఓబన్న ఎద్దులు 3151 అడుగులు లాగి ఏడవ స్థానంలో నిలిచాయి. ►మొదటి బహుమతి రూ. 20 వేలను ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రెండవ బహుమతి రూ. 15, 116 నారంగారి శంకర్రెడ్డి, మూడవ బహుమతి రూ. 10,016 నాగుల గార్ల రమణ, నాలుగవ బహుమతి రూ. 5, 016 పుత్తా మసాన్, ఐదవ బహుమతి రూ. 3, 016 వై బయన్న, ఆరవ బహుమతి రూ. 2,016 ఆది వేమయ్యలు వితరణగా అందచేశారు. -
వేద ధర్మాన్ని పరిరక్షించాలి
కె.తాడేపల్లి (విజయవాడ రూరల్) : మనిషిని మనిషిగా తీర్చిదిద్దే జీవన వికాస సోపానాలు వేదాలని, వేద ధర్మాన్ని పరిరక్షించి, భావితరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి అన్నారు. రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో ఉన్న పంచముఖ వీరాంజనేయస్వామి దేవస్థానం, షణ్ముఖ వేద విద్యాలయాలను స్వామి శుక్రవారం సందర్శించారు. ఆలయ నిర్వాహకులు మారుతి లక్ష్మీనారాయణ, మారుతి జానకీరామశర్మ.. స్వామికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవకోటి కుంకుమార్చన వివరాలను తెలుసుకుని స్వామీజీ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్వామి అనుగ్రహభాషణం చేస్తూ మానవ వికాసానికి వేదం పునాదిగా నిలుస్తోందన్నారు. వేద పారాయణ జరిగే స్థలం అత్యంత పవిత్రత పొందుతుందని, వేదం వినడం వల్లే అన్ని పాపాలు తొలగిపోతాయన్నారు. వేద ధర్మ పరిరక్షణకు ప్రజలందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వ్యాపారవేత్తలు మాగంటి సుబ్రహ్మణ్యం, దిట్టకవి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.