breaking news
veerabhadragowd
-
ఆలూరు టీడీపీలో బయటపడ్డ విభేదాలు
కర్నూలు జిల్లా : ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. ఆలూరు టీడీపీ ఇంచార్జి వీరభద్రగౌడ్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు వైకుంఠ మళ్లికార్జున్, గోపి ఆరోపణలు గుప్పించారు. నీరు-చెట్టు పథకంలో అవినీతికి పాల్పడ్డారని, అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీంలో ఒక్క ఇంటికి రూ.15 వేలు వసూలు చేశారని విమర్శించారు. అంగన్ వాడీ వర్కర్ల ఉద్యోగానికి ఒక్కొక్కరి దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఇంచార్జి వీరభద్రగౌడ్ అవినీతిపై విచారణ చేయాలని టీడీపీ నాయకులు మళ్లికార్జున్, గోపి డిమాండ్ చేశారు. -
విద్యుదాఘాతానికి ఒకరి మృతి
విడపనకల్లు(ఉరవకొండ) : విడపనకల్లు మండలం గాజుల మల్లాపురంలో వీరభద్రగౌడు(62) విద్యుదాఘాతానికి గురై శనివారం మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి అవసరాల కోసం నీరు అవసరమై బోరును ఆన్ చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా కరెంట్ షాక్తో స్పహ తప్పిపడిపోయినట్లు వివరించారు. వెంటనే ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మతి చెందినట్లు వివరించారు. మతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తండ్రి మతదేహంపై పడి కుమారుడు రోదించడం అందరినీ కలచివేసింది.