breaking news
Vedanta Group company
-
హింద్ జింక్ లాభం డబుల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వేదాంత గ్రూప్ సంస్థ హిందుస్తాన్ జింక్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ. 5,469 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది రూ. 2,234 కోట్లు. ఇక ఆదాయం సైతం 72 శాతం ఎగిసి రూ. 13,033 కోట్లకు పెరిగింది. క్రితం క్యూ1లో ఇది రూ. 7,591 కోట్లు.లోహాల ధరలు .. ఉత్పత్తి పెరగడం, బై–ప్రోడక్టుల ద్వారా మరింత ఆదాయం లభించడం, డాలరు పటిష్టంగా ఉండటం తదితర అంశాల కారణంగా ఆదాయం గణనీయంగా వృద్ధి చెందినట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు, ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ మాజీ సీఎండీ అమరేందు ప్రకాశ్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హోల్ టైమ్ డైరెక్టర్గా నియమించుకున్నట్లు వివరించింది. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. -
హిందుస్తాన్ జింక్ లాభం 19% అప్
న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్ సంస్థ హిందుస్తాన్ జింక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,921 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 1,618 కోట్లతో పోలిస్తే 19 శాతం అధికం. రూపాయి క్షీణత, అధిక పరిమాణంలో విక్రయాలు .. లాభాల పెరుగుదలకు తోడ్పడినట్లు హిందుస్తాన్ జింక్ చైర్మన్ అగ్నివేష్ అగర్వాల్ తెలిపారు. ఆదాయం 21 శాతం వృద్ధితో రూ. 3,596 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఇతర బేస్ మెటల్ ధరలు తగ్గుతున్నప్పటికీ జింక్ ధర మాత్రం మెరుగ్గానే కొనసాగిందని, పలు గనుల మూసివేత కారణంగా రాబోయే రోజుల్లోనూ దీని రేటు పటిష్టంగానే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు రాంపుర అగూచా, కయాద్, సిందేశ్వర్ ఖుర్ద్ తదితర గనుల కారణంగా జింక్ ఉత్పత్తి వార్షికంగా 42 శాతం పెరిగి 2,32,162 టన్నులకు చేరిందని పేర్కొన్నారు. అయితే, త్రైమాసికాల వారీగా చూస్తే మాత్రం 14 శాతం తగ్గిందని అగర్వాల్ చెప్పారు.


