breaking news
vault Department
-
మంచు కొండలో ఈ వాల్ట్ ఎందుకో తెలుసా?
మన భూమిపై పలు రకాల మొక్కలు, పంటలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఏదైనా జరిగితే, వాతావరణ మార్పులు, ప్రకతి విపత్తుల వల్ల కొన్ని జాతుల పంటలు, మొక్కలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు మళ్లీ వాటిని పండించేందుకు, ఆహార పంటలు, మొక్కల వైవిధ్యాన్ని రక్షించేందుకు నార్వేలోని స్వాల్బార్డ్ అనే ప్రదేశంలో ఈ విత్తనాల బ్యాంకును ఏర్పాటు చేశారు.ప్రపంచంలోని వేలాది పంటల విత్తనాలను బ్యాకప్గా భద్రపరిచే ప్రత్యేకమైన గ్లోబల్ సీడ్ వాల్ట్ ఇది. నార్వే దేశంలోని స్వాల్బార్డ్ అనే ఆర్కిపెలాగోలోని స్పిట్స్బెర్గెన్ ద్వీపంలో ఈ సీడ్ వాల్ట్ ఉంది. ఈ వాల్ట్ను ఆర్కిటిక్ మంచు, కొండల మధ్యలో, ఒక పర్వతం లోపల నిర్మించారు. అందుకే ఇది బయట నుంచి చూస్తే మంచు మధ్య దాగి ఉన్న పెద్ద లాకర్లా ఉంటుంది.సీడ్ వాల్ట్ లక్ష్యం ఏంటి?నిజానికి ప్రపంచంలో అనేక దేశాల్లో విత్తనాల బ్యాంకులు ఉన్నాయి. మన దేశంలో కూడా విత్తనాలను భవిష్యత్తు తరాల కోసం సంరక్షించే సంస్థలు ఉన్నాయి. అలాగే స్వాల్బార్డ్ అనేది సీడ్ బ్యాంక్ కాదు.. ఇది వాల్ట్.వివిధ దేశాలు, పరిశోధనా సంస్థలు, జీన్ బ్యాంకుల నుంచి విత్తనాలను ఇక్కడ భద్రపరుస్తారు. ఒక దేశంలో ప్రకతి విపత్తు సంభవించినా, యుద్ధం కారణంగా పంటలు లేదా విత్తనాల సేకరణలు నాశనమైనా, భవిష్యత్తులో ఈ విత్తనాలను తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.దీనిని పర్వతం లోపల నిర్మించారు. అది ఒక నేచురల్ ఫ్రీజర్గా పని చేస్తుంది. పర్వతం లోపల లోతుగా ఉండటం వల్ల బయట ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల నుంచి ఈ విత్తనాలకు ప్రొటెక్షన్ లభిస్తుంది. ఆర్కిటిక్ ప్రాంతంలోని సహజమైన చల్లని వాతావరణం కూడా ఈ సంరక్షణకు సహాయపడుతుంది.స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్ను 2008లోప్రారంభించారు. దీని నిర్మాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పర్వతం లోపలికి వెళ్లే ఒక పొడవైన టన్నెల్ ద్వారా సీడ్ స్టోరేజ్ చాంబర్లకు చేరుకోవచ్చు. అక్కడ మన షాపింగ్ మాల్లో ఉన్నట్టు ర్యాక్స్ ఉంటాయి. ఒక దేశానికి ర్యాక్లో కొంత ప్లేస్ ఇస్తారు. ఆ ప్లేస్లో ఆ దేశం పంపించే విత్తనాలను సేవ్ చేస్తారు.ఇది సాధారణ సీడ్ స్టోరేజ్ సెంటర్ కాదు. భవిష్యత్ తరాల కోసం ప్రపంచంలోని వ్యవసాయ వైవిధ్యాన్ని కా΄ాడే ఒక గ్లోబల్ బ్యాకప్ సిస్టమ్. అందుకే దీనిని కొన్నిసార్లు ‘‘డూమ్స్డే వాల్ట్’’ అని కూడా పిలుస్తారు.ఇవి చదవండి: బ్రహ్మపుత్రను ‘రెడ్ రివర్’ అని ఎందుకు అంటారో తెలుసా? -
ఆర్బీఐ ఖజానాలో బంగారం ధగధగలు
ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు ధగధగా మెరిసిపోతున్నాయి. సెప్టెంబర్ చివరికి ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 880.18 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. గత 12 నెలల్లోనే 25.45 మెట్రిక్ టన్నుల మేర పసిడి నిల్వలను ఆర్బీఐ పెంచుకుంది. ఇందులో 575.82 మెట్రిక్ టన్నుల బంగారం దేశీయంగా నిల్వ చేసుకోగా, మిగిలినది విదేశాల్లోని వాల్టుల్లో భద్రపరిచింది.బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వద్ద 290.37 టన్నుల బంగారం నిల్వ ఉంది. 13.99 టన్నుల మేర బంగారం డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది. ఆర్బీఐ వద్ద విదేశీ మారకం నిల్వల్లో బంగారం వాటా 13.92 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చినాటికి ఇది 11.70 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి ఆరు నెలల కాలంలో 600 కిలోల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది.అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళికపరమైన తీవ్ర అనిశ్చితులు నెలకొన్న తరుణంలో, డాలర్ రిస్క్ను తగ్గించుకునేందుకు ఆర్బీఐ ఇటీవలి సంవత్సరాల్లో తన విదేశీ మారకం నిల్వల్లో బంగారానికి వెయిటేజీ పెంచుకోవడం గమనార్హం. సెప్టెంబర్ చివరికి మొత్తం విదేశీ మారకం నిల్వలు 700 బిలియన్ డాలర్లకు చేరాయి. సరిగ్గా ఏడాది క్రితం ఇవి 705.78 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు -
ఈ పేమెంట్ ద్వారా ఉద్యోగుల జీతాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్:ఖజానాశాఖలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఖజానా శాఖ ద్వారా చెల్లించే వివిధ చెల్లింపులను ఈ పేమెంట్ ద్వారా చెల్లించేందుకు సర్వం సిద్దం చేశారు. వచ్చే నెల నుంచి ఉద్యోగుల జీతాలు నేరుగా వారి ఖాతాల్లో జమకానున్నాయి. ఇంతవరకు ఉద్యోగుల జీతాలు ముందుగా ట్రెజరీలో సంబంధిత అధికారులు అందజేసిన వివరాల ప్రకారం ఖజానాశాఖ అధికారులు బ్యాంకులకు ఖాతాల వారీగా జమ చేసేలా నివేదికలు అందజేసేవారు. ఇక నుంచి ఈ పేమెంట్ విధానంలో ఆ ప్రక్రియ ఉండదు. నేరుగా ఖజానా శాఖ నుంచి ఉద్యోగి బ్యాంకు ఖాతాలో వారి జీతం తదితర నగదు జమ కానుంది. ఈ పేమెంట్ విధానం అంటే ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఈ విధానం కార్పొరేట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ విధానం ద్వారా జరుగుతుంది. ఇలా ఉద్యోగుల జీతాలు చెల్లింపులు చేయడం వల్ల ఖజానా శాఖ నుంచి నేరుగా ఉద్యోగి ఖాతాలోనికి జమ అవుతుంది. బ్యాంకుకు ప్రభుత్వం చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులు మిగలనున్నాయి. ఈ పేమెంట్ ద్వారా ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, పదవీ విరమణ చేసిన తరువాత వారికి వచ్చే ప్రయోజనాల నగదు, ఆర్జిత సెలవులు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు, టెలిఫోన్, కార్యాలయ నిర్వహణా ఖర్చులు వంటివి చెల్లింపులు జరుగుతాయి. పంచాయతీలకు సంబంధించిన బిల్లులు పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాలు, పంచాయతీల అభివృద్దికి సంబంధించిన పన్నుల బిల్లులు, పీడీ అకౌంట్కు సంబంధించిన బిల్లులు ఈ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరగవు. ఇవి ఎప్పటిలానే బ్యాంకుల ద్వారా చెల్లింపులు నిర్వహిస్తారు. ఈ మేరకు ఈ నెల 2న విశాఖపట్నంలో మూడు జిల్లాలకు చెందిన సబ్ ట్రెజరీ అధికారులుగా గణాంక అధికారులతో ఈపేమెంట్పై శిక్షణలు కూడా ఉన్నతాధికారులు అందజేశారు. జిల్లా ఖజానాశాఖ కార్యాలయంతో పాటు 14 సబ్ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి 30వేలకు పైనే ఉన్నారు. పెన్షన్దారులు ఉన్నారు. వీరందరికీ ఈపేమెంట్ ద్వారా జీతాలు చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే జిల్లాలో నాలుగు సబ్ట్రెజరీల్లో డాటాఎంట్రీ ఆపరేటర్లు లేరు. ఆమదాలవలస, రణస్థలం, కొత్తూరు, కోటబొమ్మాళి ఉపఖజానా కార్యాలయాల్లో డీఏవోలు లేక సిబ్బందే నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మిగిలిన ఉప ఖజానాకార్యాలయాల్లో 11 మంది ఔట్సోర్సింగ్ విధానంలో డాటాఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. ఈపేమెంట్ ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటికీ సిబ్బంది కొరత వేధిస్తోంది.


