breaking news
vamsy paidipally
-
‘మహర్షి’ తల్లి పాత్రపై క్లారిటీ
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. మూడు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమాలో మహేష్ తల్లి పాత్రపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ తల్లిగా అలనాటి అందాల నటి జయప్రధ నటించనున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం నటి జయసుధ తాజా ఇంటర్య్వూలో క్లారిటీ ఇచ్చారు. మహర్షి సినిమాతో తాను మహేష్కు తల్లిగా నటిస్తున్నట్టుగా వెల్లడించారు. దీంతో మహర్షి సినిమాలో తల్లి పాత్రలో కనిపించబోయేది జయప్రధ కాదు జయసుధ అని కన్ఫామ్ అయిపోయింది. -
మరో మల్టీ స్టారర్లో మహేష్...?
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. మురుగదాస్ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' అనే పొలిటికల్ థ్రిల్లర్లో నటించనున్నాడు. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు. అశ్వనిదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న సినిమా మల్టీ స్టారర్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీనియర్ హీరో వెంకటేష్తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించాడు మహేష్. ఈ సారి ఓ యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడట. వంశీ డైరెక్ట్ చేయబోయే సినిమాలో మహేష్ బాబుతో పాటు కామెడీ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో ఇప్పుడే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను చిత్రయూనిట్ అఫీషియల్ గా ప్రకటించటం లేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.