breaking news
Vaidehi reddy
-
గూగుల్ హోమ్ పేజీపై వైదేహిరెడ్డి ‘డూడుల్’
న్యూఢిల్లీ: అస్సాం ప్రకృతి సౌందర్యాన్ని, సుసంపన్నమైన సాంస్కృతిక వైభవాన్ని ప్రతిఫలించేలా ఆకర్షణీయంగా రూపొందిన ‘డూడుల్’,.. శుక్రవారం భారత్లో గూగుల్ సెర్చిఇంజన్ హోమ్ పేజీపై దర్శనమిచ్చింది.నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక డూడుల్ను ‘గూగుల్’ తన హోమ్పేజీపై పొందుపరిచింది. ‘ప్రాకృతిక, సాంస్కృతిక స్వర్గం- అస్సాం’ అన్న శీర్షికతో పూణె సైనిక స్కూల్కు చెందిన 9వ తరగతి విద్యార్థి, వైదేహి రెడ్డి రూపొందించిన ఈ ‘డూడుల్’ను గూగుల్ సంస్థ ఒక పోటీలో ఎంపిక చేసింది. డూడుల్ ఫర్ గూగుల్ (Doodle4GoogleD4G) అన్న పేరుతో నిర్వహించిన ఈ పోటీలో 50 నగరాలకు చెందిన 2,100స్కూళ్లనుంచి అందిన 10లక్షలకుపైగా ఎంట్రీలను పరిశీలించారు. చివరకు, వైదేహి అస్సాంపై రూపొందించిన ఈ డూడుల్ను ఎంపికచేశారు. అస్సాం వన్యజీవులను, వృక్ష సంపదను, ప్రతిఫలించేలా పులి, ఖడ్గమృగం, తేయాకు పొదలు, వెదురు చెట్లు, సంప్రదాయబద్ధమైన టోపీతో నృత్యం చేస్తున్న అస్సాం మహిళ తదితర అంశాలతో వైదేహి రెడ్డి ఈ డూడుల్ను చిత్రించింది. పొలిటికల్ కార్టూనిస్ట్ అజిత్ నీనన్, ఏసీకే మీడియా సేవియో సంస్థ ఆర్ట్ డెరైక్టర్ మస్కరెన్హాస్ , గూగుల్ నిపుణుల బృందంతో కూడిన న్యాయనిర్ణేతల బృందం వైదేహి ఎంట్రీని ఎంపిక చేసింది. -
గూగుల్ డూడుల్ పోటీ విజేత వైదేహి రెడ్డి
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ నిర్వహించిన ‘డూడుల్4గూగుల్’ పోటీలో పుణే విద్యార్థిని వైదేహి రెడ్డి విజేతగా నిలిచింది. పుణేలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న వైదేహి ‘సహజ, సాంస్కృతిక స్వర్గం- అస్సాం’ పేరుతో డూడుల్ను రూపొందించి ఈ పోటీలో విజయం సాధించింది. గూగుల్ హోం పేజీలో ప్రత్యేక సందర్భానికి అనుగుణంగా బొమ్మలతో రూపొందించే ‘గూగుల్’ లోగోను డూడుల్గా పిలుస్తారు. ‘భారత్లో నేను చూడాలనుకుంటున్న ప్రదేశం’ అనే కాన్సెప్ట్తో డూడుల్ను రూపొందించాలని ఈ ఏడాది 50 పట్టణాల్లోని 1700 స్కూళ్లలో డూడుల్ పోటీ నిర్వహించగా 12 మంది విద్యార్థులు ఫైనల్కు చేరుకున్నారు. ఈ పోటీకి ఏకంగా పది లక్షల ఎంట్రీలు రావడం విశేషమని కంపెనీ వర్గాలు తెలిపాయి.