ups and downs
-
టారిఫ్లు, ప్రపంచ మార్కెట్లపై దృష్టి
ముంబై: ప్రధానంగా ప్రపంచ పరిణామాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాల కారణంగా నేలచూపులకే పరిమితమవుతున్నాయి. ఈ బాటలో మరోసారి ఆటుపోట్లు చవిచూడనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చైనా ఎఫెక్ట్ యూఎస్ టారిఫ్లు తదితర పాలసీ నిర్ణయాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. కొద్ది నెలలుగా మార్కెట్లు దిద్దుబాటు ధోరణిలో సాగుతున్నాయి. దీంతో మార్కెట్లు ఎక్కడ టర్న్అరౌండ్ అయ్యేదీ అంచనా వేయడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల మరోసారి చైనా మార్కెట్లవైపు విదేశీ ఇన్వెస్టర్లు దృష్టి పెట్టినట్లు పేర్కొంటున్నారు. ఫలితంగా దేశీ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నట్లు తెలియజేశారు. దీంతో పలువురికి ఆదాయపన్ను ఉపశమనాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్, వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.25 శాతం కోత పెట్టిన ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష పెద్దగా ప్రభావం చూపలేకపోయినట్లు ప్రస్తావించారు. వారాంతాన... గత కేలండర్ ఏడాది(2024) చివరి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు శుక్రవారం(28న) వెల్లడికానుంది. అక్టోబర్–డిసెంబర్(క్యూ4)లో దేశ జీడీపీ పురోగతి గణాంకాలు విడుదలకానున్నాయి. జులై–సెప్టెంబర్(క్యూ3)లో జీడీపీ 5.4 శాతం వృద్ధి చూపింది. మరోపక్క యూఎస్ క్యూ4 జీడీపీ రెండో అంచనాలు 27న వెలువడనున్నాయి. ముందస్తు అంచనాలు 2.3 శాతం వృద్ధిని సంకేతించాయి. గత మూడు త్రైమాసికాలలో ఇది తక్కువకాగా.. క్యూ3లో 3.1 శాతం పురోగతి నమోదైంది. ఇదే రోజు జనవరి నెలకు యూఎస్ కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు, డ్యురబుల్ గూడ్స్ ఆర్డర్లు, వ్యక్తిగత ఆదాయం, వ్యయాలు తదితర గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. ఇన్వెస్టర్లు గ్లోబల్ అంశాలపైనా దృష్టి పెట్టనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసె స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు.గత వారమిలా..గత వారం(17–21) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోవారంలోనూ డీలా పడ్డాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్ నికరంగా 628 పాయింట్లు(0.85 శాతం) క్షీణించి 75,311 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 133 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 22,796 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.6 శాతం, 1 శాతం చొప్పున బలపడటం గమనార్హం!ఇతర అంశాలురష్యా– ఉక్రెయిన్ యుద్ధం సంబంధిత వార్తలు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి తీరు సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు ఖేమ్కా పేర్కొన్నారు. దేశీ మార్కెట్లలో బలహీన సెంటిమెంటు నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు వినోద్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఆర్జన మెరుగుపడటం, గ్లోబల్ లిక్విడిటీ, కరెన్సీ నిలకడం వంటి సానుకూల పరిస్థితులు నెలకొనేవరకూ మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యే వీలున్నట్లు నిపుణులు వివరించారు. యూఎస్ విధిస్తున్న టారిఫ్లపై ఆందోళనలు దేశీ మార్కెట్లతోపాటు.. పలు ఇతర మార్కెట్లను సైతం ప్రభావితం చేయనున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలియజేశారు. సమీప భవిష్యత్లో టారిఫ్ వార్తలు ట్రెండ్ను నిర్దేశించవచ్చని అంచనా వేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు కీలక భాగస్వామ్య దేశాలను ప్రభావితం చేయనున్నట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. దీనికితోడు దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు కొంతమేర నిరాశపరుస్తున్నట్లు తెలియజేశారు. -
తీవ్ర హెచ్చుతగ్గులు
♦ చివరకు సెన్సెక్స్ 81 పాయింట్లు డౌన్ ♦ 25 పాయింట్లు తగ్గిన నిఫ్టీ ముంబై: అంతర్జాతీయ ట్రెండ్కు అనుగుణంగా రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన భారత్ స్టాక్ మార్కెట్ చివరకు క్షీణతతో ముగిసింది. గత రాత్రి అమెరికా మార్కెట్ పతనం కావడం, అదేరీతిలో ఆసియా మార్కెట్లు పడిపోవడంతో గురువారం తొలుత బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్ల వరకూ క్షీణించి 24,473 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. ఇన్ఫోసిస్ ఫలితాలు ఉత్సాహపర్చడం, చైనా మార్కెట్ రికవరీ కావడంతో మధ్యాహ్న సెషన్లో కోలుకుని 25,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. అయితే అటుతర్వాత యూరప్ మార్కెట్లు పతనబాటపట్టడంతో చివరకు 81 పాయింట్ల తగ్గుదలతో 24,773 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,440-7,600 పాయింట్ల మధ్య ఊగిసలాడి చివరకు 25 పాయింట్ల నష్టంతో 7,537 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. రూపాయి రెండున్నరేళ్ల కనిష్టస్థాయికి పడిపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలహీనపర్చింది. చైనా మినహా మిగిలిన ప్రపంచ ప్రధాన మార్కెట్లు బలహీనంగా ట్రేడ్కావడంతో సెన్సెక్స్ లాభాల్ని నిలబెట్టుకోలేకపోయిందని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. వెలుగులో ఇన్ఫో సిస్, లోహ, బ్యాంకింగ్ షేర్లు పతనం.... ఇన్ఫోసిస్ ఫలితాలు మార్కెట్ అంచనాల్ని మించడం, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గెడైన్స్ పెంచడంతో ఆ షేరు 5 శాతం వరకూ ర్యాలీ జరిపింది. ఇదేబాటలో టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్లు స్వల్పంగా పెరిగాయి. ప్రపంచ ట్రెండ్ను అనుసరిస్తూ లోహ షేర్లు పతనమయ్యాయి. అధిక రుణభారం కారణంగా టాటా స్టీల్ను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ డౌన్గ్రేడ్ చేయడంతో ఆ షేరు 3.3 శాతం క్షీణించింది. వేదాంత, హిందాల్కోలు 2.5 శాతం వరకూ తగ్గాయి. జిందాల్ ఐరెన్ అండ్ స్టీల్ 8 శాతం పతనమయ్యింది. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు 1-4 శాతం మధ్య తగ్గాయి. చైనా షాంఘై సూచి 2 శాతం వరకూ పెరిగింది. సెన్సెక్స్ 22,000కు..: ఆంబిట్ అంచనా దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నదని, ఫలితంగా వచ్చే కొద్దిరోజుల్లో సెన్సెక్స్ 22,000 స్థాయికి పడిపోతుందని బ్రోకరేజ్ సంస్థ ఆంబిట్ క్యాపిటల్ అంచనావేసింది. బలహీన కార్పొరేట్ ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహకరణ ఈ పతనానికి దారితీస్తుందని ఆంబిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఈక్విటీస్) సౌరభ్ ముఖర్జియా చెప్పారు. బొగ్గు, సిమెంటు ఉత్పత్తి, ద్విచక్ర వాహన విక్రయాలు, గ్రామీణ వేతనాలు, విద్యుదుత్పత్తి, చమురుయేతర బ్యాంకు రుణాలు, డిపాజిట్లు తగ్గుతున్నాయని ముఖర్జియా తెలిపారు. ఈ అంశాలు ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నదనడానికి సంకేతాలన్నారు. -
ఆటుపోట్లను అధిగమిస్తూ...
చెన్నై, సాక్షి ప్రతినిధి: జయలలిత.. ఈ పేరు ఒకప్పుడు సాధారణ నటిది. కానీ నేడు జాతీయ స్థాయిలో ఒక ఉక్కుమహిళగా పేరుగాంచిన అన్నా డీఎంకే అధినేత్రిది. 33 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను అధిగమించిన చరిత్ర ఆమెది. తమిళనాడు ప్రజలతో అమ్మ అని పిలిపించుకోవడంలోనే ఆమె సమ్మోహనాస్త్రముంది. 1948 ఫిబ్రవరి 24న జన్మించిన జయలలిత నటిగా వెలుగొందుతున్న కాలంలో ఎం.జి.రామచంద్రన్ ఆమెలోని ప్రతిభా పాటవాలను గుర్తించి 1982లో పార్టీలోకి ఆహ్వానించారు. 1983లో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా ఎంజీఆర్ వద్ద ఆమె మంచి మార్కులు కొట్టేశారు. జయ ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని మెచ్చుకున్న ఎంజీఆర్ 1984లో ఆమెను రాజ్యసభ సభ్యురాలిని చేశారు. 1987 డిసెంబరు 24న ఎంజీఆర్ మరణానంతరం తొలిసారిగా జయకు రాజకీయకష్టాలు మొదలయ్యాయి. ఎంజీఆర్ అంత్యక్రియల ఊరేగింపు నుంచి జయను ఆ పార్టీ నేతలే తోసివేశారు. పార్టీ ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ వర్గం, జయ వర్గంగా విడిపోయింది. ఎంజీఆర్ వారసురాలిగా 93 మంది సభ్యుల మద్దతుతో 1988 జనవరి 7వ తేదీన జానకి సీఎం పదవిని అధిష్టించినా అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ రాజ్యాంగంలోని 356 సెక్షన్తో ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో రాష్ట్రపతి పాలన వచ్చింది. అన్నా డీఎంకే పగ్గాలు జయ చేతికి రాగా 1989 నాటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో తొలి మహిళా విపక్ష నేతగా నిలిచారు. జయను ప్రతిపక్ష నేతగా సహించలేని డీఎంకే సభ్యులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెపై మైక్లు విసిరివేసి తీవ్రంగా అవమానించి కన్నీళ్లు పెట్టుకుంటూ అసెంబ్లీ వదిలి వెళ్లిపోయేలా చేశారు. సీఎంగా అవతరణ..ఎంజీఆర్ను కోల్పోయిన అన్నా డీఎంకేకు జయ చుక్కానిగా మారారు. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపెట్టుకుని తొలిసారి సీంగా ఐదేళ్లు పాలించారు. 2001లో రెండోసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే ఆ ఏడాది సెప్టెంబర్లో టాన్సీ(తమిళనాడు చిన్నతరహా పరిశ్రమల సంస్థ) కేసులో దోషిగా తేలినందున సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పుడు తన అనుచరుడు పన్నీర్సెల్వంను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. తర్వాత 2002లో నిర్దోషిగా తేలడంతో మరోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. 2014 సెప్టెంబర్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిందికోర్టు దోషిగా ప్రకటించడంతో మళ్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పుడు కూడా పన్నీర్సెల్వంను సీఎం కుర్చీలో కూర్చొబెట్టారు. 21 రోజులు జైల్లో ఉండి, సుప్రీం బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. జయను వెంటాడిన డీఎంకే.. అన్నా డీఎంకే అధినేత్రిగా జయ ఏకు మేకైందని భావించిన డీఎంకే తాను అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఆమెపై అనేక కేసులు పెట్టింది. జయ వాటి నుంచి బయటపడుతూ వచ్చారు. జయ నాటి నుంచి నేటి వరకు 14 కేసులతో ఆటుపోట్లను అధిగమించి ఉక్కు మహిళగా నిలిచారు. టాన్సీ, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ప్లజెంట్ స్టే హోటల్ కేసు ఇలా14 కేసుల నుంచి బయటపడి పేరులోనే కాదు జీవితంలోనూ జయమేనని నిరూపించారు. ఈ కేసులన్నీ 1996-2001 మధ్య డీఎంకే ప్రభుత్వ హయాంలో మోపినవే. 2001లో జయ మళ్లీ సీఎం అయిన తర్వాత ఒక్కొక్కటిగా కేసుల నుంచి బయటపడ్డారు. కోర్టుల్లో ఆరోపణలు నిరూపణ కాకపోవడంతో అన్ని కేసుల్లో నిర్దోషిగా మిగిలారు. 13కేసుల్లో నిరపరాధిగా నిరూపించుకున్నారు. బలమైన కేసు... గతంలో ఎదుర్కొన్న కేసుల కంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అత్యంత బలమైనది. 1991-96 మధ్య సీఎంగా జయ అక్రమాస్తులు కూడగట్టారని అప్పటి జనతా పార్టీ చీఫ్ సుబ్రహ్మణ్యస్వామి(ప్రస్తుతం బీజేపీ నేత) 1996 జూన్ 14న మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పట్లో తమిళనాడు గవర్నర్గా ఉన్న మర్రి చెన్నారెడ్డి అనుమతి తీసుకుని మరీ పిటిషన్ వేశారు. విచారణలో రూ. 66.65 కోట్లు అక్రమార్జనగా జయపై అభియోగం మోపారు. కేసులో ఆధారాలు బలంగా ఉన్నాయని ప్రత్యర్థులు ప్రచారం చేసినట్లుగానే ప్రత్యేక కోర్టులో జయకు శిక్షపడింది. కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసుకోవడం ద్వారా డీఎంకే పెట్టిన అన్ని కేసుల నుంచి జయ నిర్దోషిగా నిలిచినట్లయింది. జయ విజయ రహస్యం... సినీ వ్యక్తులను రాజకీయంగా సైతం ఆరాధించే తమిళనాడులో జయ ప్రత్యేక ఆకర్షణ. ఎంజీఆర్ మరణించి 30 ఏళ్లు దాటినా ఆయనపై తరగని అభిమానం ఉంది. ఎంజీఆర్ బతికున్నప్పుడే పార్టీ భవిష్య నాయకురాలిగా జయను తెరపైకి తేవడాన్ని ప్రజలు నేటికీ గుర్తుంచుకున్నారు. డీఎంకేకు ప్రత్యామ్నాయం అన్నాడీఎంకే మాత్రమే అనే రీతిలో ఎంజీఆర్ తీర్చిదిద్దగా అదే బాటలో జయ సైతం నడవడం మరింత బలాన్ని చేకూర్చింది. జయ తాత మైసూరు మహారాజు సంస్థానంలో సర్జన్గా పనిచేసినందున ఉన్నత కుటుంబ నేపథ్యంతో పాటు విద్యాధికురాలిగా ఆమెను గుర్తించారు. ఇంగ్లిష్తో పాటు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. ఎంజీఆర్ను పురచ్చితలైవర్ (విప్లవ నాయకుడు) అని పిలుచుకునే తమిళనాడు ప్రజలు జయను పురచ్చితలైవి(విప్లవనాయకురాలు)గా పిలవడం ప్రారంభించారు. అమ్మ అంటే జయ అంటూ అక్కున చేర్చుకున్నారు. ప్రధానంగా ఆమె తెచ్చిన పథకాలు ఆమెను ప్రజలకు మరింత చేరువ చేశాయి. జయకు జైలు శిక్షపడిన నాటి నుంచి తాజా తీర్పు వరకు 233 మంది బలవన్మరణాలకు పాల్పడటం ప్రజలకు ఆమెపై ఉన్న అభిమానానికి తార్కాణం.