breaking news
united forum of bank union
-
బ్యాంకులకు 5 రోజులు వరుస సెలవులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరుస సెలవులు, సమ్మెల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు 5 రోజులు నిలిచిపోనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) డిసెంబరు 21న సమ్మెకు పిలుపునిచ్చింది. డిసెంబరు 22 నాలుగో శనివారం, 23వ తేదీ ఆదివారం కావడంతో సాధారణంగా బ్యాంకులు పనిచేయవు. 24వ తేదీ (సోమవారం) బ్యాంకులు తెరుస్తారు. 25వ తేదీ క్రిస్మస్ సెలవు. డిసెంబరు 26న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ సమ్మెకు దిగుతోంది. ఈ లెక్కన 24వ తేదీ మినహాయిస్తే డిసెంబరు 21 (శుక్రవారం) నుంచి 26 (బుధవారం) వరకు బ్యాంకు సేవలు స్తంభించనున్నాయి. అన్ని స్థాయిల్లోనూ వేతన సవరణతోపాలు పలు డిమాండ్ల సాధన కోసం అసోసియేషన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. డిసెంబరు 21 సమ్మెలో దేశవ్యాప్తంగా 3.2 లక్షల మంది అధికారులు పాల్గొంటున్నారు. మరోవైపు, డిసెంబర్ 21న సమ్మె తలపెట్టినప్పటికీ ఏటీఎంలు యథాప్రకారం పనిచేస్తాయని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) తెలిపింది. ఏటీఎంలను బలవంతంగా మూయించివేసే ప్రయత్నాలేమీ ఉండబోవని ఒక ప్రకటనలో పేర్కొంది. డిసెంబరు 26 సమ్మె ప్రభావం ఏటీఎం సేవలపై పడనుంది. -
బ్యాంకులు మూత
కర్నూలు(సిటీ), న్యూస్లైన్: వేతన సవరణను వెంటనే అమలు చేయాలని యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ కన్వీనర్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం అన్ని ప్రధాన బ్యాంకులు, అనుబంధ శాఖల ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దాదాపు 5వేల మంది ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో 880 బ్యాంకులు మూతపడ్డాయి. ఈ కారణంగా రూ.500 కోట్ల లావాదేవీలు స్తంభించడంతో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. నగరంలోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద అన్ని బ్యాంకుల యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వేతన సవరణలో ప్రభుత్వం సిఫారసు చేసిన 10 శాతం పెంపును ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసులు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం స్థానిక బుధవారపేటలోని ఆంధ్రా బ్యాంకు ఎదుట అన్ని యూనియన్లకు చెందిన నాయకులు, ఉద్యోగులు ధర్నా నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.