breaking news
Union of European Football Associations
-
పాజిటివ్ వస్తే మ్యాచ్ రెండు రోజులు వాయిదా
జెనీవా (స్విట్జర్లాండ్): ఈ ఏడాదికి వాయిదా పడ్డ యూరో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ను సాఫీగా జరిపేందుకు నడుం బిగించిన యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్స్ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లలోని ఏ ఆటగాడైనా కరోనా బారిన పడితే... ఆ జట్టు ఆడే తదుపరి మ్యాచ్ను గరిష్టంగా రెండు రోజుల పాటు వాయిదా వేసే కొత్త రూల్ను రూపొందించనట్లు పేర్కొంది. అంతేకాకుండా జట్టు సభ్యుల సంఖ్యను 23 నుంచి 26కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ఏ జట్టయినా తన మ్యాచ్ను ఆడకపోతే... 0–3తో ఆ జట్టు ఓడిందని, దానికి సంబంధిచిన పూర్తి పాయింట్ల్ల (3)ను ప్రత్యర్థి జట్టుకు అందజేసేలా నిబంధనను తీసుకొచ్చారు. జూన్ 11 నుంచి జూలై 11 వరకు 31 రోజుల పాటు యూరప్లోని 11 నగరాల్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. 24 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. మ్యాచ్ల సందర్భంగా 25 శాతం మంది అభిమానులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. -
యూరోప్ అత్యుత్తమ ఫుట్బాలర్గా రొనాల్డో
యూరోప్ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (యూఈఎఫ్ఏ) ఉత్తమ ఆటగాడిగా స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఎంపికయ్యాడు. తాజా సీజన్లో చాంపియన్స లీగ్ టైటిల్ గెలుచుకున్న రియల్ మాడ్రిడ్, యూరో కప్ గెలుచున్న పోర్చుగల్ జట్లలో 31 ఏళ్ల రొనాల్డో సభ్యుడు కావడం విశేషం. ఈ రెండు టోర్నీ విజయాల్లో కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డు దక్కింది. యూఈఎఫ్ఏలోని 55 సభ్య దేశాలకు చెందిన జర్నలిస్ట్లు ఓటింగ్లో పాల్గొని రొనాల్టోను అవార్డుకు ఎంపిక చేశారు. 2013-14 సీజన్లో కూడా అతనికి ఈ అవార్డు దక్కింది.