breaking news
Udta Punjab Leaked
-
'ఉడ్తా పంజాబ్' ఎఫెక్ట్; 179 లింక్స్ బ్లాక్
ముంబై: 'ఉడ్తా పంజాబ్' ఆన్లైన్ లో లీక్ పై ఫిర్యాదు అందించిన 24 గంటల్లో ముంబై పోలీసులు స్పందించారు. ఆన్లైన్ లో ఈ సినిమాకు సంబంధించిన 179 లింకులు బ్లాక్ చేశారు. మరో 500 లింకులను బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్) సహాయంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. విడుదలకు ముందే బుధవారం మధ్యాహ్నం 'ఉడ్తా పంజాబ్'ను ఆన్లైన్ లో లీక్ చేశారు. దీంతో చిత్ర నిర్మాతలు గురువారం కోర్టును ఆశ్రయించారు. తమ సినిమాను ఆన్లైన్ పెట్టిన వెబ్సైట్లను నిలిపివేసేలా ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇంటర్నెట్ డొమైన్లు, 500పైగా ఇంటర్నెట్ యూఆర్ఎల్స్ ను కోర్టుకు సమర్పించారు. 'ఉడ్తా పంజాబ్' ఆన్లైన్ లో ఎవరు లీక్ చేశారో కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, సెన్సార్ వివాదాలను దాటుకుని శుక్రవారం ఈ సినిమా ధియేటర్లలో విడుదలైంది. -
ఆ సినిమా చూడకండి.. వైరస్ వస్తోంది!
ముంబై: బాలీవుడ్ సినిమా 'ఉడ్తా పంజాబ్' విడుదలకు ముందే ఆన్లైన్ లో లీక్ అవడం పట్ల సినిమా ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. పైరసీని ప్రోత్సహించొద్దని, ధియేటర్ కు వెళ్లి సినిమా చూడాలని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. ఈ సినిమాను నిజంగా సెన్సార్ బోర్డు లీక్ చేసివుంటే అంతకన్నా అవమానం మరోటి ఉందని పలువురు వ్యాఖ్యానించారు. ఒకవేళ సెన్సార్ లీక్ చేయకుంటే పైరసీపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ లో 'ఉడ్తా పంజాబ్' లీక్ కావడం బాధ కలిగించిందని తెలుగు సినీ నిర్మాత శోభు యార్లగడ్డ అన్నారు. ఇది సినిమా రూపకర్తలను, ఫిల్మ్ ఇండస్ట్రీని అగౌరవపరచమేనని ఆయన ట్వీట్ చేశారు. 'ఉడ్తా పంజాబ్' వివాదంపై నెటిజన్లు రకరకాలు స్పందించారు. ఈ సినిమా లీక్ వెనుక ప్రధాని మోదీ హస్తం ఉందని ఒకరు అంటే, ఇదందా సెన్సార్ బోర్డు కుట్రని మరొకరు ఆరోపించారు. ముందు హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టడం మానుకోవాలని మరొకరు సలహాయిస్తే.. వివాదంతో 'ఉడ్తా పంజాబ్' మంచి పబ్లిసిటీ వచ్చిందని ఇంకొకరు కామెంట్ చేశారు. ఆన్లైన్ లో లీకైన 'ఉడ్తా పంజాబ్'తో కంప్యూటర్లకు వైరస్ ప్రమాదం ముప్పు పొంచివుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ లింకులను క్లిక్ చేస్తే వైరస్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. 'ఉడ్తా పంజాబ్' లీక్ తో నేను ఎందుకు ట్రెండింగ్ అవుతున్నానని ప్రశిస్తూ 'త్రీఇడియట్స్' సినిమాలోని 'వైరస్' పాత్రధారి ఫొటో పెట్టారు.