breaking news
TRS vs. Congress
-
రెండు నియోజకవర్గాలే టార్గెట్
సాక్షి, జనగామ: భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్.. మరోవైపు కాంగ్రెస్ పకడ్బందీగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా మెజారిటీ ఓట్లు రాబట్టుకుంటే విజయం సాధించవచ్చనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాయి. 2009, 2014 ఎన్నికలతో పోల్చుతూ 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలతో లెక్కలు వేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. భువనగిరి లోక్సభ పరిధిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగామ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏడు నియోజకవర్గాల్లో జనగామ, ఆలేరు నియోజకవర్గాలపైనే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి జనగామ, ఆలేరు నియోజకవర్గాల నుంచి మంచి మెజారిటీ లభించింది. దీంతో అప్పుడు బూర నర్సయ్య గౌడ్ గెలుపు సులువుగా మారింది. 2014 ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థికి 29,084 ఓట్ల మెజారిటీ.. ఆలేరు నుంచి 19,632 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఎక్కువగా ఓట్లు రావడంతో టీఆర్ఎస్ విజయం ఖాయమైపోయింది. ఇప్పుడు మరోమారు జనగామ, ఆలేరు నియోజకవర్గాల నుంచి ఎక్కువ ఓట్లు వస్తే విజయం సాధించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. 2018 డిసెంబర్లో జరిగిన శాసన ఎన్నికల్లో జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 29,538 ఓట్ల మెజారిటీ.. ఆలేరు నుంచి గొంగడి సునీతకు 33,289 ఓట్ల మెజారిటీ వచ్చింది. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి మంచి ఊపుమీద ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో మరోమారు ఎక్కువగా మెజారిటీ వచ్చేలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. భువనగిరి తమ ఖాతాలోనే అన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తోంది. నాడు తమ్ముడు.. నేడు అన్న.. భువనగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నాడు తమ్ముడు బరిలో దిగగా.. నేడు అన్న ఎన్నికల బరిలో ఉన్నాడు. 2009లో భువనగిరి స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన సమీప సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,888 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి రాజగోపాల్రెడ్డి ఆధిక్యత లభించింది. 2014 ఎన్నికల్లో రెండోసారి పోటీచేసిన రాజగోపాల్రెడ్డి ఓటమి చెందారు. ప్రస్తుత ఎన్నికల్లో రాజగోపాల్రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ సైతం జనగామ, ఆలేరు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. జనగామ నుంచి లీడ్ లభిస్తే విజయం సాధించవచ్చనే ఆలోచనతో క్యాడర్ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జనగామ నుంచి టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఉండడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశం. నియోజకవర్గ ప్రజలకు కోమటిరెడ్డి సోదరులు సుపరిచితులు కావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆలేరు, జనగామ నియోజకవర్గాలపైనే ఫోకస్ చేయడం ఆసక్తిగా మారుతోంది. రెండు పార్టీలకు రెం డు నియోజకవర్గాలు ప్రతిష్టగా మారాయి. -
మిషన్పై ఫైర్
ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. మిషన్ కాకతీయపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్వాకం వల్ల ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోందని ధ్వజమెత్తారు. బుధవారం ఉదయం జడ్పీ సీఈవో మారుపాక నాగేష్ సమావేశాన్ని ప్రారంభించారు. అందరూ సహాయ సహకారాలతో పనిచేయూలని సీఈవోతోపాటు జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత ఆకాంక్షించారు. వచ్చేనెలలో జిల్లాలో రెండు ముఖ్యకార్యక్రమాలు హరితహారం, గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలంబరితి తెలిపారు. హరితహారంలో మూడులక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రైవేట్రంగంలో రిజర్వేషన్పై ఏకగ్రీవ తీర్మానం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేట్రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రతిపాదించారు. ఈ మేరకు సభ ఏకగ్రీవం తీర్మానం చేయాలని సూచించారు. సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలపడంతో చైర్పర్సన్ ఆమోదం తెలిపారు. రిజర్వేషన్ల నిర్ణయం కేంద్రం పరిధిలో ఉంటుందని, ఈ తీర్మానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తుమ్మలకు వివరించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాకతీయ మిషన్ ద్వారా చేపడుతున్న చెరువుల అభివృద్ధి నివేదికను ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్ వివరించారు. పినపాక నియోజకవర్గంలో రాయన్నకుంట చెరువు పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై అర్హత గల రైతులకు మట్టి తోలకుండా అర్ధరాత్రి దొంగల్లా మట్టిని రూ.300కు విక్రరుుంచారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సభ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ నిర్ణయం మంచిదైనప్పటికీ అధికారులు, అధికారపార్టీ నేతల నిర్వాకంతో లక్ష్యం దెబ్బతింటోందని పాయం వాపోయూరు. ఏజెన్సీలో చెరువు పనులకు అటవీ అధికారుల నుంచి అనుమతి ఇప్పించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ మిషన్ పనులు కొనసాగుతున్న చెరువులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు రికార్డు చేయూలని, ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే రెండుమూడురోజుల్లో రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. శాసనసభ్యుల ప్రతిపాదనలను సైతం పక్కనబెట్టారని వైరా ఎమ్మెల్యే మదన్లాల్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నిర్దేశించిన ప్రణాళికకు అనుగుణంగా చెరువు పనులు సాగటం లేదని ఖమ్మం ఎమ్మెల్యే అజయ్కుమార్ సభ దృష్టికి తెచ్చారు. క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ కమిటీలు ఎన్ని చెరువులపై విచారణ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చిమ్మపూడిలో కట్టమీద ఉన్న చెట్లను తొలగించకుండానే మట్టితో పూడ్చి వేస్తుంటే రైతులు అడ్డుకున్నారన్నారు. దీనిపై ప్రశ్నించినందుకు టీఆర్ఎస్ నాయకులు బెదిరించారని అన్నారు. దీనిపై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే మదన్లాల్ ఆక్షేపణ తెలిపారు. అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల నుంచి వెళ్లిపోవాలని అటవీ అధికారులు పోడుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రస్తావించారు. ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు..జడ్పీటీసీలకు అవకాశం ఇవ్వరా? అని రఘునాథపాలెం జడ్పీటీసీ వీరూనాయక్ అనడంతో ‘అరుుతే మేము అవసరం లేదా?’ అంటూ ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ బయటకు వె ళ్లబోయూరు. చైర్పర్సన్ జోక్యం చేసుకొని ఆయనకు నచ్చజెప్పారు. ఐటీడీఏ గవర్నింగ్ బాడీకి తీర్మానం.. ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించాలని సభ తీర్మానించింది. మైదాన ప్రాంతలో ఐటీడీఏ ద్వారా ఎక్కడ ఏయే పనులు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి ఉందని ఎమ్మల్యేలు మదన్లాల్ ,అజయ్కుమార్ పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లలో రుణాలకు బ్యాంక్ కాన్సెంట్ ఇవ్వడం లేదని జడ్పీటీసీ ఉన్నం వీరేంధర్ తెలిపారు. స్థానిక సంస్థల 29 అధికారాల్లో ప్రతి అంశం జడ్పీ కిందకు వస్తుందని, వ్యవసాయశాఖ లావాదేవీలన్నీ ఆమోదం తీసుకుంటున్నారా అని జేడీఏని మదన్లాల్ ప్రశ్నించారు. ఇక నుంచి అన్ని అంశాలను జడ్పీలో చర్చించి, ఆమోదంతోనే నిర్ణయం తీసుకోవాలని చైర్పర్సన్ సూచించారు. బోనకల్ మండలంలో మూడుగ్రామాలకు ఇన్ఫుట్ సబ్సిడీ వచ్చిందని, దానిలో 600 ఎకరాలు బోగస్ అని తేలిందని, అర్హులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఎరువులు ఇవ్వకుండా ఖమ్మంకు తరలించారని జెడ్పీటీసీ, ఎంపీటీలు వివరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ కవిత, జేడీఏ, ఆత్మ పీడీలను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.