breaking news
Trishul Concrete Products
-
'జేసీ బ్రదర్స్ దొంగల కన్నా హీనం'
సాక్షి, అనంతపురం : యాడికి మండలం కోన ఉప్పలపాడులో జేసీ దివాకర్రెడ్డికి చెందిన త్రిశూల్ ఫ్యాక్టరీ భూములను అఖిలపక్ష నేతలతో కలిసి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ.. త్రిశూల్ సిమెంట్స్ అనుమతుల రద్దును స్వాగతిస్తున్నామని తెలిపారు. త్రిశూల్ సిమెంట్స్ పేరుతో జేసీ దివాకర్రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. పరిశ్రమ స్థాపించి ఉద్యోగాలు కల్పించకుండా అన్యాయం చేశారని,రూ.200 కోట్ల విలువైన సున్నపురాయి గనులను జేసీ కొల్లగొట్టారని పేర్కొన్నారు. జేసీ బ్రదర్స్ దొంగల కన్నా హీనమని, జేసీ దివాకర్రెడ్డి అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దివాకర్రెడ్డ్డిపై బినామి చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పెద్దారెడ్డి పేర్కొన్నారు. (జేసీ వర్గీయుల అక్రమాలు బట్టబయలు) -
ఇండియా సిమెంట్స్లో అనుబంధ కంపెనీల విలీనం
చెన్నై: రెండు అనుబంధ కంపెనీల విలీనానికి ఇండియా సిమెంట్స్ బోర్డు ఆమోదముద్ర వేసింది. తద్వారా త్రినేత్ర సిమెంట్, త్రిశూల్ కాంక్రీట్ ప్రొడక్ట్స్లను విలీనం చేసుకోనుంది. బుధవారం సమావేశమైన డెరైక్టర్ల బోర్డు ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు ఇండియా సిమెంట్స్ పేర్కొంది. విలీన ప్రక్రియలో భాగంగా ఇండియా సిమెంట్స్తోపాటు, అనుబంధ కంపెనీలకున్న షేర్లను రద్దు చేస్తారు. ఈ రెండు కంపెనీలలో మిగిలిన వాటాదారులకు ఇండియా సిమెంట్స్కు చెందిన 9.75 లక్షల షేర్లను కేటాయిస్తారు. ఇది 0.32% వాటాకు సమానంకాగా, విలీనం తరువాత ఇండియా సిమెంట్స్ చెల్లించిన మూలధనం(పెయిడప్ క్యాపిటల్) రూ. 307.18 కోట్ల నుంచి రూ. 308.15 కోట్లకు పెరుగుతుంది. 2013 మార్చినాటికి త్రినేత్ర, త్రిశూల్ సంయుక్తంగా రూ. 283 కోట్లమేర రుణాలను కలిగి ఉన్నాయి. త్రినేత్ర సిమెంట్ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్అయి ఉంది. కంపెనీలో ఇండియా సిమెంట్స్కు 61.22% వాటా ఉంది. రాజస్తాన్లో వార్షికంగా 1.5 మిలియన్ టన్నుల సిమెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సొంత అవసరాలకు వినియోగించే 20 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను సైతం ఏర్పాటు చేసుకుంది. ఇక త్రిశూల్ కాంక్రీట్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరుసహా 8 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. కోరమాండల్ బ్రాండుతో 12.3 లక్షల ఘనపు మీటర్ల రెడీమిక్స్ కాంక్రీట్ను ఉత్పత్తి చేస్తోంది.