breaking news
Trajectory of progress
-
కలిసి నడవాలి
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశం ప్రగతి పథంలో పయనించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, దారిద్య్ర నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కోరారు.బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటైన నిర్మాణ రంగ యంత్రాల అంతర్జాతీయ ప్రదర్శనను శుక్రవారం చెన్నై ట్రేడ్ సెంటర్లో ఆయన ప్రారంభించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆలోచనా ధోరణే చాలా భిన్నమైనదని, ప్రగతి దిశగా పరుగులు తీస్తోందని అన్నారు. వ్యవసాయం, రహదారు లు, భవన నిర్మాణ రంగం ఇలా అన్నింటిపైనా ఆయన ఆలోచన ధోరణిని అందుకోవాలని కోరారు. దేశ ఆర్థిక వనరుల్లో 43 శాతం వడ్డీల చెల్లింపునకే సరిపోతోందన్నారు. ఈ పరిస్థితిని అధిగమిం చాలంటే మరింత ఆర్థిక పురోగతి అవసరమని అభిప్రాయ పడ్డారు. అందుకే ప్రధాని మోదీ తాను నిద్రపోకుండా, ఎవ్వరినీ నిద్రపోనీకుండా పని చేస్తున్నామన్నారు. ప్రశంసా త్మకమైన మోదీ పనితీరును విపక్షాలు మెచ్చుకోవడం మాని మోకాలొడ్డడమే పనిగా పెట్టుకున్నాయని వ్యాఖ్యానించారు. నల్లధనాన్ని ఒక్కరోజులో తేలేమన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రదర్శన సావనీర్ను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. సభానంతరం ప్రదర్శన కమిటీ అధ్యక్షులు రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. సి మెంటు కంపెనీల యజమానులు ఇష్టారాజ్యం గా ధరలు పెంచడం వల్ల నిర్మాణ రంగం పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణకు కేంద్ర స్థాయిలో సిమెంటు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
‘జన్ ధన్’ ఉంటే ఉచిత సిమ్
- వినియోగదారులకు మెరుగైన సేవలు - 3 జీ సేవలు మరింత విస్తృతం - బీఎస్ఎన్ఎల్ జీఎం మహంతి శ్రీకాకుళం అర్బన్: ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు నూతన పోకడలతో ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ హెచ్.సీ.మహంతి అన్నారు. శ్రీకాకుళంలోని సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ధన్ యోజన పథకం కింద రూ.20 విలువ చేసే ప్రీ-పెయిడ్ సిమ్ను ఉచి తంగా అందజేస్తున్నామన్నారు. సిమ్ను పొందగోరేవారు తమ ఫొటోతోపాటు జన్ధన్ యోజన బ్యాంకు ఖాతా ప్రతులను సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ పథకంతో లబ్ధిదారులందరికీ బ్యాంకు ఖాతాతోపాటు సెల్ఫోన్ కనెక్షన్ ఉంటుందన్నారు. తమ సంస్థ అత్యుత్తమ ఆఫర్లను ప్రవేశపెట్టిందని.. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రూ. 100 నుంచి రూ. 1000 వరకూ ఫుల్టాక్టైమ్, రూ. 1010 నుంచి రూ. 2,990 వరకు 10 శాతం అదనపు టాక్టైమ్తో ప్యాకేజీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఆఫర్ ఈనెల 22వ తేదీ వరకు మాత్రమే ఉంటుందన్నారు. అలాగే కొత్త కూంబో ఎస్టీవీ ప్లాన్ కింద రూ. 111లకు రూ. 90 టాక్టైమ్తోపాటు 70 నిమిషాల ఇంటర్నెట్ సదుపాయం ఉంటుందన్నారు. రూ. 222 ప్లాన్లో రూ.190 టాక్టైమ్తోపాటు రూ. 110 నిమిషాల ఇంటర్నెట్ సదుపాయాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. బ్రాడ్బ్యాండ్ను ఉపయోగించుకునే వినియోగదారులకు కూడా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. బీబీహోమ్ యూఎల్ రూ. 525 పథకాన్ని మార్పుచేసి బీబీహోమ్ యూఎల్ రూ.545 పథకం కింద 512 కేబీపీఎస్ నెల మొత్తంగా వర్తించే విధంగా రూపొందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 3.50 లక్షలు మంది బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఉన్నారని..వీరికి మెరుగైన సేవలు అందజేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో 203 2జీ సెల్టవర్లు ఏర్పాటు చేశామని..అలాగే 3జీ సెల్టవర్లు 63 ఉన్నాయన్నారు. మరింత మెరుగైన సిగ్నల్స్ కోసం పురుషొత్తపురం, తామరాపల్లి గ్రామాల్లో త్వరలో సెల్టవర్లు నిర్మించనున్నామన్నారు. నరసన్నపేట, టెక్కలి, పాతపట్నంలతోపాటు పాలకొండకు కూడా 3జీ సెల్ సర్వీస్ ఏర్పాటు చేయబడ్డాయని, శ్రీకాకుళం పట్టణం, ఆమదాలవలస, సోంపేటలకు 3జీ సేవలను మరింతగా విస్తృత పరిచామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 17 కొత్త సెల్టవర్లు ప్రారంభించామన్నారు. పలాస పరిధిలో ఫ్రాంచేజీ కోసం ఓపెన్బిడ్ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి, సంతబొమ్మాళి మండలాలు దీని పరిధిలో ఉన్నాయన్నారు. ఈ బిడ్కు ఆఖరుతేదీ ఈనెల 27వ తేదీ సాయంత్రం 3 గంటలలోగా అందజేయాలన్నారు. సమావేశం లో ఏజీఎం డి.మహేశ్వరరావు, ఏజీఎం(పరిపాలన) బీవీవీ నగేష్, సీఏవో జె.నాగరాజు, ఏఈ శైలూప్రసాద్, యూనియన్ నాయకులు డి.వెంకటేశ్వరరావు, బి.జగన్నాథం పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణే లక్ష్యం
►అభివృద్ధిలో మెతుకుసీమ అగ్రస్థానంలో నిలవాలి ►ప్రతి నియోజకవర్గంలోనూ లక్ష ఎకరాలకు సాగునీరు ►గజ్వేల్, జహీరాబాద్లో పరిశ్రమల ఏర్పాటు ►ఐదుచోట్ల కొత్త వ్యవసాయ మార్కెట్ల నిర్మాణం ►గజ్వేల్లో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్టు కాలేజీ ►గత పాలకుల వల్లే కరెంట్ కష్టాలు ►స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీష్రావు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఆకలిచావులు లేని బంగారు తెలంగాణ నిర్మించుకుందాం. ఉద్యమంలోనే కాదు, ప్రగతిపథంలో కూడా మెతుకుసీమ ముందుంటుందని ప్రపంచానికి చాటుదాం.. తెలంగాణ సంస్కృతికి పునరుజ్జీవం పోద్దాం’ అని నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సంగారెడ్డిలో పోలీసు పరేడ్గ్రౌండ్లో 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరుగుతున్న మొట్టమొదటి స్వాతంత్య్ర దినోత్సవవేడుకలకు మంత్రి హరీష్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక పోలీసు పరేడ్గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవవందనం స్వీకరించిన అనంతరం మంత్రి హరీష్రావు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. గతంలో ఎన్నోమార్లు జెండా పండుగలు చేసుకున్నా ఇంత ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకోలేదన్నారు. పేరుకు 68వ స్వాతంత్య్ర వేడుకలైనా మనందరికీ ఇది తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలని ప్రకటించారు. ఆంధ్ర వాసనలు పోగొట్టి తెలంగాణ పరిమళాలు వెదజల్లే కార్యక్రమాలు భవిష్యత్తులో జరుగుతాయని తెలిపారు. జిల్లాతో ముఖ్యమంత్రి కేసీఆర్, తనకు జన్మజన్మల బంధం ఉందని, జిల్లా అడుగడుగునా తమకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. పుట్టిన నేల రుణం తీర్చుకునే సువర్ణవకాశం తమకు దక్కిందన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధిపరుస్తామని ప్రకటించారు. మంత్రి హరీష్రావు తన ప్రసంగంలో మహాకవి దాశరథి కవితలను చదివి వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. మాసాయిపేట దుర్ఘటనలో చిన్నారుల మృతిని గుర్తుచేసుకుంటూ ఈ వేడుకల్లో పాల్గొన్న పిల్లలను చూస్తే నాకు ఆ చిన్నారులే గుర్తుకొస్తున్నారు.. వారు కూడా ఈ రోజు పొద్దున్నే తయారై జెండా వందనానికి వచ్చేవారు కదా...అంటూ మంత్రి హరీష్ గద్గదస్వరంతో పేర్కొనటం.. వేడుకలకు హాజరైన వారి అందరి హృదయాలను కదిలించింది. రైతులకు రుణమాఫీ, దళితులకు భూమి తెలంగాణ ప్రభుత్వం రైతు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి హరీష్రావు చెప్పారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీ ప్రకటించారన్నారు. దీంతో జిల్లాలో 1.07 లక్షల మంది రైతులకు రూ.570 కోట్ల రుణాలు మాఫీ అవుతున్నట్లు చెప్పారు. నాలుగేళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న రూ.47 కోట్ల పంట నష్టపరిహారం విడుదల చేశామన్నారు. వ్యవసాయ కూలీలుగా ఉన్న దళితులను రైతులుగా మార్చేందుకు ప్రతి ఒక్కరికీ మూడెకరాల భూమి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రూ.18 కోట్లతో 214 మంది దళితులకు 458 ఎకరాల భూమి పంచుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 2,500 హెక్టార్లలో హైబ్రీడ్ కూరగాయలు, వెయ్యి హెక్టార్లలో పండ్లతోటల సాగు చేపట్టనున్నట్లు వివరించారు. గజ్వేల్లో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్టు కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తొగుట, వంటిమామిడిలో కూరగాయల మార్కెట్, గంగాపూర్లో మిర్చి, గజ్వేల్లో పండ్ల మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 12 కోట్ల మొక్కలు నాటి జిల్లాను హరితవనంగా మారుస్తామని తెలిపారు. కల్యాణలక్ష్మీ పథకం ద్వారా గిరిజన, దళిత ఆడపిల్లలకు రూ.50 వేల ఆర్థికసాయం అందజేస్తున్నట్లు చెప్పారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మారుస్తున్నట్లు వివరించారు. ఎస్టీలకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో అన్యాక్రాంతమైన 30 వేల ఎకరాల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. తెలంగాణలో ఎంప్లాయ్ ఫ్రండ్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందజేస్తామని మంత్రి హరీష్ చెప్పారు. సింగూరు జలాలు పూర్తిగా జిల్లాకు వాడుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఆఫ్ తెలంగాణకు సిద్దిపేటే స్ఫూర్తి అన్నారు. జహీరాబాద్, గజ్వేల్ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా జిల్లా ఆర్థికంగా ఎదగటమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో సింగింల్ విండో విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేకపోవటం వల్లే ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. రేషన్కార్డులు, గృహనిర్మాణం, పింఛన్లు ఇంకా ఇతర పథకాల్లో అవినీతికి ఇదే కారణమని తెలిపారు. తెలంగాణలో ఎవరి పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవటం కోసం ఈ నెల 19న ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. మెదక్ జిల్లాలో 28 వేల మంది ఉద్యోగులతో 7.62 లక్షల ఇళ్లలో సర్వే జరుగుతుందన్నారు. ఒకేరోజు తెలంగాణ అంతటా ఇంటింటి జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. అందుకోసమే ఈ నెల 19న సెలవు దినంగా ప్రకటించామని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండి సర్వేకు సహకరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలు, పీఎంపీలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందని తెలిపారు. ఇప్పటికే శిక్షణ తీసుకున్నవారికి సర్టిఫికెట్లు అందజేస్తామని, శిక్షణ లేని ఆరోగ్య వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేసి ప్రోత్సహిస్తామని చెప్పారు. జిల్లాలో మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా 1,056 గ్రామాల్లో రూ.2,167 కోట్ల విలువైన ప్రతిపాదనలు తయారు చేసుకున్నామని, ఐదు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో 11,123 పనులను ప్రాధాన్యత ఉన్నవిగా గుర్తించామన్నారు. ఈ పనుల కోసం రూ.236 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. జిల్లా ప్రణాళికలో సైతం రూ.1,247 కోట్ల ప్రతిపాదనలు వచ్చాయని, వీటన్నింటికీ నిధులు మంజూరు చేసుకుని వచ్చే ఐదేళ్లలో జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. రెండేళ్ల వరకు కరెంటు కష్టాలు తప్పవు విద్యుత్ కొరతతో రైతులే కాకుండా అన్నివర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి హరీష్రావు ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర పాలకులు అవలంబించిన పక్షపాత ధోరణి వల్లే విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటున్నామని అన్నారు. సమస్యను అధిగమించేందుకు జెన్కో ద్వారా ఆరువేల మెగావాట్లు, ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. మరో రెండు మూడేళ్లలో మన రాష్ట్రం విద్యుత్తు కొరత లేని రాష్ట్రంగా మారుతుందని తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రయోగాత్మకంగా సిద్దిపేట నియోజకవర్గంలో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
జేఎన్టీయూకు మహర్దశ
యూనివర్సిటీ: జేఎన్టీయూ అనంతపురం ప్రగతి పథంలో పయనించడానికి అడుగులు వేస్తోంది. త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక సాధారణ బడ్జెట్లో జేఎన్టీయూకు నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేయనుంది. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహాని పిలుపు మేరకు మంగళవారం వీసీ ఆచార్య కే లాల్కిశోర్, రిజిస్ట్రార్ కే హేమచంద్రారెడ్డిలు హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఆ వివరాలను బుధవారం వీసీ ఆచార్య లాల్కిశోర్ వెల్లడించారు. 2013-14 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. ఆ కళాశాలను 300మంది విద్యార్ధులతో ప్రారంభించామని, 2015-16 విద్యా సంవత్సరానికి వీరి సంఖ్య 900 మందికి చేరుకుంటుందని చెప్పారు. అలాగే ఖాళీగా వున్న బోధనా పోస్టుల భర్తీకై ఆర్థిక పరమైన అనుమతులను బడ్జెట్లో పొందుపరచాలని కోరామన్నారు. నూతనంగా రెండు కళాశాలలకు అటానమస్ హోదా 2014-15 విద్యా సంవత్సరానికి జేఎన్టీయూ పరిధిలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెన్సైస్, కడపలోని కేఎస్ఆర్ఎం కళాశాలలకు అటానమస్ హోదాను కల్పించారు. దీంతో జేఎన్టీయూఏ పరిధిలో 10 కళాశాలలకు అటానమస్ హోదా కల్పించినట్లైంది. జేఎన్టీయూ కాకినాడ, హైదరాబాద్ల కంటే ఎక్కువ అటానమస్ కళాశాలలను ప్రోత్సహిస్తున్న యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. అలాగే నూతనంగా తాడిపత్రి సీవీ రామన్ కళాశాలలో ఎంబీఏ కోర్సు ప్రారంభానికి అనుమతి ఇచ్చారు. ఫుల్టైం పీహెచ్డీ ప్రోగ్రాంకు శ్రీకారం ఈ విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీలో ఫుల్టైం పీహెచ్డీ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. అనుబంధ కళాశాలలకు కూడా ఈ విధానాన్ని వర్తింపచేయనున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది రీసెట్ నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు.