breaking news
Tirupati Municipal Corporation Commissioner
-
సౌత్ ఇండియా షాపింగ్ మాల్కు భారీ జరిమానా
లాక్డౌన్ ఎత్తివేయడంతో జనాలు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కరోనా పోకముందే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్కు క్యూ కడుతున్నారు. కోవిడ్ నిబంధనలను గాలికొదిలేసిన ప్రజలు ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలు పాటించకపోవంతో తిరుపతిలోని సౌత్ ఇండియా షాపింగ్మాల్కు భారీ జరిమానా విధించారు. షాపింగ్మాల్ను సందర్శించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరిషా అక్కడి జనాల్ని చూసి అవాక్యయారు. షాపింగ్ మాల్కు వచ్చిన జనాలు మాస్క్లు లేకుండా భౌతిక దూరం పాటించకుండా ఉండటం గుర్తించిన కమిషనర్ మాల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో షాపింగ్ మాల్పై రూ.50 వేలు జరిమానా విధించారు. మరోసారి కోవిడ్ నిబంధనలు పాటించకపోతే 50 లక్షల జరిమానా విధించడంతోపాటు షాప్ను సీజ్ చేస్తామని కమిషనర్ బెదిరించారు. తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని. భౌతిక దూరం పాటించాలని కోరారు. నిబంధనలు పాటించకపోతే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా రూల్స్ పాటించాలన్నారు. -
తిరుపతిలో సౌతిండియా షాపింగ్మాల్కు రూ. 50 వేల ఫైన్
-
తిరుపతి కమిషనర్గా వినయ్చంద్
తిరుపతి కార్పొరేషన్: తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ టి.సకలారెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2008 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి వాడరేవు వినయ్చంద్ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఐటీడీఏ ప్రాజెక్టు డెరైక్టర్గా పనిచేస్తున్న వినయ్చంద్ జిల్లాకు సుపరిచితుడు. 2011 నుంచి 2013 వరకు మదనపల్లె సబ్ కలెక్టర్, ఆపై చిత్తూరు జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో బీటెక్ చేసి ఐఏఎస్గా ఎంపికైన వినయ్చంద్ను తిరుపతి కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత కమిషనర్ సకలారెడ్డి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. పరిపాలనా విభాగంలో రిపోర్టు చేయూలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.