breaking news
thumb impression
-
ఇక వేలిముద్రే మీ గుర్తింపు!
-
ఇక వేలిముద్రే మీ గుర్తింపు!
► రెండువారాల్లో ఆధార్తో బయోమెట్రిక్ చెల్లింపులు ► డిజిధన్ మేళాలో ఈ–వ్యాలెట్ యాప్.. ‘భీమ్’ ఆవిష్కరణ ► దీంతో ఇంటర్నెట్ లేకుండానే సాధారణ ఫోన్లతోనూ లావాదేవీలు ► నిరాశావాదులకు తన వద్ద ఔషధం లేదన్న ప్రధాని స్మార్ట్ ఫోన్ అయినా.. వెయ్యి, రూ.1,200 విలువైన ఫీచర్ ఫోన్ అయినా భీమ్ యాప్ను వినియోగించుకోవచ్చు. దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు. వేలిముద్రతోనే పనిచేస్తుంది. ఒకప్పుడు నిరక్షరాస్యులను అంగూఠా ఛాప్ (వేలిముద్రగాళ్లు) అనేవారు. కానీ కాలం మారింది. మీ అంగూఠానే మీ బ్యాంకు అకౌంట్, మీ గుర్తింపు. – ప్రధాని మోదీ ఇకపై వేలిముద్రే అందరికీ గుర్తింపుగా మారబోతోంది. దాంతోనే అన్ని లావాదేవీలు జరగనున్నాయి. మరో 2 వారాల్లో ప్రారంభమయ్యే ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ చెల్లింపుల విధానం ద్వారా ఇది సాధ్యం కానుంది. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎంలను సమర్థవంతంగా ఉపయోగించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మన దేశ సామాన్యులు.. ఈ కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని డిజిటల్ లావాదేవీలు జరిపి, మరోసారి ఆ ఘనత సాధించగలరు’ అంటూ భవిష్యత్ భారత డిజిటల్ ముఖచిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కళ్లకు గట్టారు. దేశ రాజధానిలో జరిగిన డిజిధన్ మేళాలో శుక్రవారం అంబేడ్కర్ పేరుతో ఆధార్ ఆధారిత మొబైల్ ఈ వ్యాలెట్ యాప్ ‘భీమ్’(భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ)ను ఆయన ఆవిష్కరించారు. సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజ లను డిజిటల్, తక్కువ నగదు లావాదేవీలవైపు ప్రోత్సహించే దిశగా ఆధార్ కార్డుతో బయోమె ట్రిక్ చెల్లింపుల విధానాన్ని కేంద్రం 2 వారాల్లో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఢిల్లీలోని తలక్తోరా ఆడిటోరియంలో ఏర్పా టుచేసిన డిజిధన్ మేళాలో ప్రధాని మోదీ ప్రకటించారు. కొత్త సంవత్సరం నుంచి కార్డులు, ఈ–వాలెట్ల ద్వారా లావాదేవీలు జరిగేలా డిజిటల్ కరెన్సీని వినియోగించాలని దేశ ప్రజలను ఆయన కోరారు. డిజిటల్ చెల్లింపులు, లావాదేవీలు సులభతరం చేయ డానికి అనువుగా శుక్రవారం ‘భీమ్’(భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) యాప్ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ కర్త, ఆర్థికవేత్త డాక్టర్ భీమ్ రావు అంబేడ్కర్ పేరిట ఆవిష్కరించిన ఈ యాప్ ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరో 2 వారాల్లో వేలిముద్రలతో చెల్లింపు విధానాన్ని తీసుకొస్తా మన్నారు. ఫోన్, ఇంటర్నెట్ లేకుండా భద్రత మైన లావాదేవీ జరిగే అవకాశాన్ని కల్పించా లని చాలా రోజులుగా ఆలోచిస్తున్నామని మోదీ తెలిపారు. ‘స్మార్ట్ ఫోన్ అయినా.. వెయ్యి, రూ.1200 విలువైన ఫీచర్ ఫోన్ అయినా భీమ్ యాప్ను వినియోగించు కోవచ్చు. దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు. వేలిముద్రతోనే పనిచేస్తుంది. ఒకప్పుడు నిరక్ష రాస్యులను అంగూఠా ఛాప్ (వేలిముద్రగాళ్లు) అనేవారు. కానీ కాలం మారింది. మీ అంగూ ఠానే మీ బ్యాంకు అకౌంట్, మీ గుర్తింపు’అని మోదీ అన్నారు. భీమ్ యాప్ను వినియోగిం చడం చాలా సులభమన్నారు. ఇప్పటికే 100 కోట్ల మంది దగ్గర ఆధార్ కార్డ్లు ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇంతమంది ఆధార్ ఆధారిత యాప్ ద్వారా లావాదేవీలు జరిపితే అది చరిత్ర సృష్టిస్తుందన్నారు. భారత్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నా ఎన్నికల్లో ఈవీఎంలను సమర్థవంతంగా వినియోగించి నందుకు ప్రపంచం ఆశ్చర్యపోయిందని.. ఇప్పుడు ఈ కొత్త సాంకేతికను వినియోగించు కోవటమూ అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతుందన్నారు. ఇక యూపీఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్), యూఎస్ఎస్డీ (అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) సేవలకు మరింత భద్రత, అధునాతన ఫీచర్లు జోడించి భీమ్ యాప్ను రూపొందించారు. కుంభకోణాల పరిస్థితిలో మార్పు అవినీతి, నల్లధనంపై చేపట్టిన చర్యలపై ఇప్పటికీ కొందరు నిరాశావాదంతో విమర్శలు చేస్తున్నారని..అలాంటివారికి తన వద్ద ఔషధ మేమీ లేదన్న మోదీ.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయా న్ని విమర్శిస్తున్న కాంగ్రెస్, విపక్షాలకు చురక లంటించారు. ఆశావాదుల కోసం తనవ ద్ద చాలా అవకాశాలున్నాయని ..సాంకేతిక పరి జ్ఞానం వల్ల పేదలకు, చిరు వ్యాపారులకు, సామాన్యులకు సాధికారత లభిస్తుందన్నారు. ‘మూడేళ్ల క్రితం వరకు పేపర్ తెరిస్తే బొగ్గు, 2జీ, తదితర స్కామ్ల గురించే కనబడేది. యూపీఏ హయాంలో ఏ కుంభకోణంలో ఎంత డబ్బు పోయిందో రాసేవారు. కానీ ఇప్పుడు వ్యవస్థలోకి ఎంత మొత్తం వచ్చిందన్న వార్తలు వస్తున్నాయి’అని మోదీ చెప్పారు. నోట్లరద్దు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందన్న విమర్శలపైనా మోదీ స్పందించారు. పేదల సొమ్మును కొట్టేస్తున్న ఎలుకను పట్టడమే కీలకమన్నారు. లక్కీడ్రాలతో క్రిస్మస్ కానుక అదృష్ట వినియోగదారుల యోజన, డిజిధన్ వ్యాపార యోజనలు దేశానికి క్రిస్మస్ బహుమ తి అని మోదీ చెప్పారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి దేశంలోని 100 నగరాలలో డిజిధన్ మేళాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించిన వారికి మోదీ ప్రశంసాపత్రాలను అందజే శారు. డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించే వారికి వంద రోజుల పాటు ఈ యోజనల్లో లక్కీ డ్రాల ద్వారా ఒక్కోవిజేతకు రూ.వెయ్యి అందజేయనున్నారు. ఏప్రిల్ 14 (అంబేడ్కర్ జయంతి)న మెగా డ్రా నిర్వహించనున్నారు. అంబేడ్కర్ కలల సాకారం దిశగా.. పేదల అభ్యున్నతికి పాటుపడాలనేది అంబే డ్కర్ ఆలోచనని.. అందుకే ఈ యాప్కు ఆయ న పేరు పెట్టినట్లు ప్రధాని తెలిపారు. ఆర్థికవేత్త కూడా అయిన అంబేడ్కర్ను భారత్ మరోసారి గుర్తుచేసుకునే అవకాశం ‘భీమ్’యాప్ ద్వారా కలిగిందన్నారు. భారత్ను ఒకప్పుడు బంగారు పక్షి (సోనేకీ చిడియా)గా ప్రపంచం పిలిచేదని గుర్తుచేసుకున్న మోదీ.. మళ్లీ ఆ పూర్వవైభవం పొందే శక్తి భారత్కు ఉందన్నారు. డిజిటల్ అనుసంధానం దేశంలో అద్భుతాలు చేస్తుందని.. నగదు ఆధారిత లావాదేవీలన్నీ డిజిటల్గా మారేందుకు ఎక్కువరోజులు పట్టదన్నారు. డిజిటల్ ఉద్యమాన్ని ముందుకు నడిపించేందుకు ప్రతి పౌరుడూ రోజుకు కనీసం ఐదుసార్లు మొబైల్ ద్వారా లావాదేవీ లు జరపాలని ప్రధాని కోరారు. ‘భీమ్’ను ఇలా వాడాలి ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఈ భీమ్ యాప్ అందుబాటులో ఉంది. త్వరలోనే ఐఫోన్లలోనూ అందుబాటులోకి తేనున్నారు. మరో 20 రోజుల్లో దీనికి మరిన్ని మార్పులు తీసుకొచ్చి, భద్రతా ప్రమాణాలు చేర్చి సాధారణ ఫోన్లలోనూ పనిచేసేలా సిద్ధం చేయనున్నారు. అప్పుడు ఫోన్ కూడా అవసరం లేకుండా కేవలం వేలిముద్రతోనే లావాదేవీలు జరుపుకోవచ్చు. దీనికోసం వ్యాపారులు, దుకాణదారులు బయోమెట్రిక్ రీడర్ (ధర రూ.2వేల వరకు)ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీన్ని వారి స్మార్ట్ఫోన్లకు జతచేయటం ద్వారా వేలిముద్రతో వినియోగదారుడి అకౌంట్నుంచి డబ్బులు దుకాణదారుడి అకౌంట్లోకి వస్తాయి. అయితే, ఇందుకు వినియోగదారుడి బ్యాంకు ఖాతాతో అతడి ఆధార్ నంబర్ కచ్చితంగా అనుసంధానమై ఉండాలి. ఈ భీమ్ యాప్ ద్వారా వీసా, మాస్టర్, ఇతర సర్వీస్ ప్రొవైడర్లు వసూలు చేసే సర్వీస్ చార్జీలనుంచి ఉపశమనం కలుగుతుంది. -
మీ చేతివేళ్లే.. మీ భవిష్యత్ :మోదీ
-
మీ చేతివేళ్లే.. మీ భవిష్యత్
మీ చేతి వేళ్లే మీ భవిష్యత్తుగా మారబోతున్నాయని భీమ్ యాప్ ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. మీ చేతి వేళ్లతో సరికొత్త భారత్ను ఆవిష్కరించడని ప్రజలకు పిలుపునిచ్చారు.. రాబోయే రోజుల్లో ఆర్థిక లావాదేవీలకు మొబైల్స్, ఇంటర్నెట్ కూడా అవసరం లేదని, కేవలం వేలిముద్ర ద్వారానే లావాదేవీలు జరుపుకోవచ్చన్నారు. 'భీమ్ యాప్ సామాన్యమైనది కాదు. కేవలం ఐదు నిమిషాల్లో లావాదేవీలను పూర్తిచేస్తుంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు ఘన నివాళిగా ఈ యాప్ను ప్రారంభించాం. ఈ యాప్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆర్థిక నిపుణులుగా చేస్తుంది' అని మోదీ చెప్పారు. మార్పు కోసం దేశం సిద్ధమైందని, టెక్నాలజీతో అనుసంధానమయ్యేందుకు సామాన్యుడు కూడా సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు విప్లవాన్ని సృష్టించాయని గుర్తుచేశారు. డిజిటల్ చెల్లింపులతో దేశ స్వరూపమే మారబోతుందన్నారు. 'మూడేళ్ల క్రితం వరకు ఏ పత్రిక చూసిన స్కాంల గురించే మాట్లాడేది. ఇప్పుడు ఎంత వస్తుంది, ఏం లాభం జరుగుతుందనేది వినిపిస్తుంది. నిరాశవాదులకు ప్రత్యేకంగా చెప్పేదే లేదు. ఆశావాదులకు మాత్రం ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పించనుంది' అని పేర్కొన్నారు. -
అమ్మ వేలిముద్ర వ్యవహారంలో మేం తలదూర్చం
తమిళనాడు సీఎం జయలలిత ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న తమ అన్నాడీఎంకే అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై సంతకం బదులు వేలిముద్ర వేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో తాము తలదూర్చమంటూ, ఎన్నికల సంఘమే పత్రాల్లో ప్రామాణికతను ధృవీకరిస్తుందని ఆ పిల్ను మద్రాస్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఎన్నికల గుర్తులు ఇప్పటికే అలాట్ చేసేశారు, ఈ సమయంలో తాము తలదూర్చడం కరెక్ట్ కాదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఒకవేళ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలైనా తలెత్తి, అవి సవాల్ చేయదగ్గవి అయితే అది ఎలక్షన్ పిటిషన్ కిందకు వస్తుందని కోర్టు తీర్పు చెప్పింది. దాదాపు నెలరోజులకు పైగా ఆస్పత్రిలో అస్వస్థతో బాధపడుతున్న అమ్మ జయలలిత, ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న తమ అన్నాడీఎంకే ముగ్గురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై సంతకం బదులు వేలిముద్రవేశారు. అంతే వివాదం అక్కడ చెలరేగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మ కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారని వార్తలొస్తుంటే, జయలలిత వేలిముద్ర వేయడేమేమిటంటూ.. కనీసం అమ్మ సంతకం చేసే స్థితిలో కూడా లేరా అంటూ వాదనలు వినిపించాయి. ఆరోగ్యంగా ఉంటే సంతకం చేసేవారు కదా అంటూ పలువురు వాపోయారు. అసలు ఈ వేలిముద్రలు జయలలితవేనా ? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ వివాదం మద్రాసు హైకోర్టు దాకా వెళ్లింది. నామినేషన్ పత్రాలపై అమ్మ వేలిముద్రను సవాలు చేస్తూ కోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సామాజిక కార్యకర్త కే రామస్వామి దాఖలు చేశారు. అరవకురిచ్చి, తంజావూర్, తిరుప్పరాంగుండ్రం అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న అన్నాడీఎంకే ముగ్గురు అభ్యర్థులు దరఖాస్తులో సంతకం బదులు అమ్మ ఎడమ చేతి వేలిముద్ర వేశారని, సంతకం బదులు వేలిముద్ర వేయడం ఎన్నికల సంఘ ప్రక్రియ నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది న్యాయవిరుద్ధమని తీర్పు చెప్పాలని ఆయన కోరారు. వేలిముద్రను అంగీకరించడానికి ఎన్నికల కమిషన్ చాలా ఆతృతతో వ్యవహరించిందని దుయ్యబట్టారు. సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరుఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ కోర్టు ముందు హాజరై, కోర్టుకు తమ వాదనలు వినిపించారు. చీఫ్ ఎలక్షన్ కార్యాలయం ముందుగానే ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తెలిపింది. ప్రభుత్వ వైద్యుని సమక్షంలోనే అమ్మ వేలిముద్ర వేశారని, వేసిన వేలిముద్ర ఉప ఎన్నికల్లో చెల్లుబాటు అవుతుందని సీఈసీ కూడా స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల అధికారి సైతం వేలిముద్రతో కూడిన బీఫాంలపై ఆమోద ముద్ర వేశారు. -
కరుణలేని నిబంధన... చేయి కోల్పోయిన వృద్ధురాలి వేదన
కర్నూలు (ఆత్మకూరు రూరల్) : సాంకేతిక అభివృద్ధి మనిషిని సౌకర్యవంతంగా ఉంచేందుకు ఉపయోగపడాలి కానీ వారిని మరింత కష్టాల పాలు చేయడానికి కాదు. అక్రమాల నిరోధానికంటూ ప్రవేశ పెట్టిన ఆధార్ ఎందరి ఆధారాలనో పోగొట్టిందో అందరికి తెలిసిందే. అలాంటి కోవలోనిదే పౌరసరఫరాలలో అక్రమాలను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పద్ధతి. లబ్దిదారుల వేలి ముద్రలను స్కానింగ్ చేసి భధ్రపరచి వారు స్వయంగా వేలి ముద్రలు వేసిన తరువాత సరిచూసే ఈ పద్ధతి ఓ వృద్దురాలిని కడుపు కాలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన దూదేకుల హుసేనమ్మ భర్త ఇటీవలే మృతిచెందాడు. ఒంటరిగా ఉంటున్న ఆమెకు ఉన్న కష్టాలు చాలవన్నట్లు చేతి వేళ్ళకు అయిన చిన్నపాటి గాయం పెరిగి పెద్దదై గాంగ్రిన్గా మారి చేతిని కుళ్ళ జేసింది. దీంతో సంవత్సరం క్రిందట అనివార్యంగా ఆమె ఎడమ చేతిని వైద్యులు ముంజేతి వరకు తొలగించారు. దీంతో ఆమె రేషన్ కార్డుకు రావాల్సిన వెచ్చాలను తీసుకోవడానికి రేషన్ షాపుకు వెళ్తే.. తన ఎడమ చేతి బొటన వ్రేలి ముద్ర వేయలేని కారణంగా డీలరు ఆమెకు రేషన్ ఇవ్వడానికి నిరాకరించాడు. భర్తను కోల్పోయి , మోచేతి వరకు చేతిని కోల్పోయిన హుసేనమ్మకు న్యాయంగా రావాల్సిన రేషన్ వేలి ముద్ర వేయలేని కారణంగా ఏడాదిగా ఇవ్వకపోవడం ప్రభుత్వ సాంకేతికత డొల్లతనాన్ని సూచిస్తోంది. తనకు రేషన్ ఇప్పించండంటూ ఆమె ఆత్మకూరు తహశీల్దార్ రాజశేఖరబాబుకు గురువారం మొరపెట్టుకుంది.