breaking news
threemen comittee
-
కేంద్ర ప్రభుత్వ కమిటీ ఎజెండా ఎందుకు మారింది?: అంబటి రాంబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనకు సంబంధించి త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకువచ్చిన 9 అంశాలను మార్చాలని వెంటనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన ప్రకటన ఆయన మనస్తత్వాన్ని సూచిస్తోంది అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే జీవీఎల్ ఎందుకంత హడావిడి పడి సుమోటోగా దాన్ని తీసివేయాలని చెప్పారో, ఎందుకు ఆయనకు అంత ఆత్రమో ఆయనే వివరణ ఇవ్వాలి. 9 అంశాల ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండడాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ దీన్ని స్వాగతిస్తున్నాం అన్న ప్రకటన కూడా చేయకపోవడం, చంద్రబాబు మొహం మాడిపోవడం చూస్తే బీజేపీలోని టీడీపీ వర్గం, ప్రత్యేకించి సుజనా చౌదరి, సీఎం రమేష్లు చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగి ఎజెండాను మార్పించారని స్పష్టమవుతుంది. చదవండి: (చంద్రబాబు మీరు చేసింది 420 పని అర్థం కావడం లేదా..?: జోగి రమేష్) అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే హోం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన ఎజెండా ఏమిటో తనకే తెలియదా? తన అధికారాలు ఏమిటో తమకే తెలియదా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారుల మధ్య ప్రత్యేక హోదా, రీసోర్సెస్ గ్యాప్ అన్నవి చర్చనీయ అంశాలు కాకపోయినా ఈ అంశాన్ని త్రిసభ్య కమిటీ నేరుగా ఏపీ అధికారులతో చర్చించవచ్చు కదా. మరి దాన్ని కూడా ఆపాలని ఎందుకు ప్రయత్నించారు?. ఆ కమిటీకి హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన జాయింట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారు. వారికి తమ పరిధిలోకి వచ్చే అంశాలు, రాని అంశాలు ఏవో తెలియదని వెంటనే జీవీఎల్ రంగంలోకి దిగడం, ఆ వెంటనే బహిరంగంగా ప్రకటనలు చేయడం, ఆపైన కేంద్ర ప్రభుత్వ కమిటీ ఎజెండా మారిపోవడం ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మౌనం ఇవన్నీ చూస్తుంటే... ఏం జరిగి ఉంటుందో అన్నది రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. చంద్రబాబు శకుని పాత్రపై, ఆయన పంపించిన మనుషుల శకుని పాత్రపై, పరిధులు మీరిన జీవీఎల్ ప్రకటనపై కచ్చితంగా చర్చ జరగాలి' అని అంబటి రాంబాబు అన్నారు. -
టీచర్ల పదోన్నతులకు సర్వం సిద్ధం!
– 185 మందికి పదోన్నతులు – త్రిసభ్య కమిటీ ఆమోదమే తరువాయి – ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తెలుసుకున్న డీఈఓ ఉపాధ్యాయుల పదోన్నతులకు సర్వం సిద్ధమైంది. మొత్తం 185 మంది ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్)లకు పదోన్నతులు లభిస్తాయి. ఇందులో 93 స్కూల్ అసిస్టెంట్లు, 92 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు నేడో, రేపో కలెక్టర్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఆమోదానికి పదోన్నతుల ఫైల్ పంపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మరోవైపు పదోన్నతులపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని శనివారం డీఈఓ రవీంద్రనాథ్రెడ్డి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించారు. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో 2931 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపుగా 12 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం పదవి విరమణ వయస్సును రెండేళ్లు అదనంగా పెంచడంతో గత రెండేళ్లుగా పదోన్నతులకు బ్రేక్ పడింది. అంతకుముందు నెలనెలా పదోన్నతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు ఉపాధ్యాయులు పదవి విరమణ చేయడం, ఖాళీగా ఉన్న పోస్టుల్లో 70 శాతం పదోన్నతులతో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో జిల్లాలో మొత్తం 185 మంది ఎస్జీటీలకు పదోన్నతులు లభించే అవకాశం ఏర్పడింది. ఇందులో 93 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా, 92 మందికి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి లభిస్తుంది. త్రిసభ్య కమిటీ ఆమోదానికి పదోన్నతుల ఫైల్ పదోన్నతుల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఊరట లభించింది. నేడో రేపో పదోన్నతుల ఫైల్ను కలెక్టర్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఆమోదానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్రిసభ్య కమిటీలో కలెక్టర్, జెడ్పీ చైర్మన్, డీఈఓ సభ్యులుగా ఉంటారు. వారు ఆమోదం తెలిపితే సెప్టెంబర్ 6, 7 తేదీల్లో పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహణ జరిగే అవకాశం ఉంది. ఆర్జేడీకి హెచ్ఎంల పదోన్నతుల ఫైల్ మరోవైపు ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు ఆర్జేడీ ఆమోదం తెలపాలి. ఇందుకు సంబంధించిన ఫైల్ ఒకటి రెండు రోజుల్లో ఆర్జేడీ వద్దకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు డీఈఓ నుంచి హెచ్ఎంల పదోన్నతి ఫైల్ వస్తే ఆమోదం తెలుపుతానని శనివారం కర్నూలుకు వచ్చిన ఆర్జేడీ ప్రేమానందం వివరించారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను సేకరించిన డీఈఓ ఇప్పటికే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను డీఈఓ బ్లాగ్లో ఉంచారు. విభాగాలు, సబ్జెక్టు వారీగా సీనియారిటీ జాబితా అందులో ఉంది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని డీఈఓ రవీంద్రనాథ్రెడ్డి శనివారం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఎస్ఎస్ఏ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ముఖ్యంగా అర్ఎంఎస్ఏ ప్రధానోపాధ్యాయుల పోస్టులపై నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని సంఘాల నాయకులు కోరారు. అందుకు డీఈఓ స్పందిస్తూ జిల్లాకు మంజూరైన 28 ఆర్ఎంఎస్ఏ హెచ్ఎం పోస్టులను రద్దు చేయడానికి కోర్టుకు వెళ్లుతామని, అంతవరకు తాత్కాలికంగా 28లో ఎలాంటి అభ్యంతరాలు లేని మూడు పోస్టులను కలుపుకుని పదోన్నతులుSకల్పిస్తామని వివరించారు. ఇందుకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా సమ్మతించారు. సబ్జెక్టుల వారీగా పదోన్నతులు కల్పించే పోస్టులు కేటగిరి మీడియం జెడ్పీ గవర్నమెంట్ మొత్తం ఎస్ఏ( ఇంగ్లిషు) తెలుగు 10 04 14 ఎస్ఏ(సోషల్) తెలుగు 23 04 27 ఎస్ఏ బయోసైన్స్ తెలుగు 07 02 09 ఎస్ఏ బయోసైన్స్ కన్నడ 02 02 ఎస్ఏ మ్యాథ్్స తెలుగు 11 04 15 ఎస్ఏ మ్యాథ్్స ఉర్దూ 0 05 05 ఎస్ఏ ఫిజికల్ సైన్స్తెలుగు 09 05 14 ఎస్ఏ పీడీ తెలుగు 0 01 01 ఎస్ఏ తెలుగు తెలుగు 05 01 06 ఎస్ఏ హిందీ తెలుగు 03 0 03 పీఎస్హెచ్ఎం తెలుగు 75 00 75 పీఎస్హెచ్ఎం కన్నడ 02 00 02 హెచ్ఎస్ హెచ్ఎం తెలుగు 15 మొత్తం 147 29 185 6, 7 తేదీల్లో కౌన్సెలింగ్ : రవీంద్రనాథ్రెడ్డి, డీఈఓ సెప్టెంబర్ 6, 7 తేదీల్లో పదోన్నతులకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. త్రిసభ్య కమిటీ ఆమోదం ఈ నెలలో తెలిపితే ఇదే నెలలో జరుపుతాం. వచ్చే నెలలో ఆమోదం లభిస్తే 5న టీచర్స్ డే వేడుకలు ఉంటుండడంతో ఆరు, ఏడు తేదీల్లో జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం.