breaking news
Thottambedu
-
కోడిపుంజు గుడ్డు పెట్టింది.. ఇది నిజం!
తొట్టంబేడు: కోడిపెట్ట గుడ్లు పెట్టడం సృష్టి ధర్మం. ఇక్కడ విచిత్రంగా కోడిపుంజు గుడ్లు పెట్టి, పిల్లలు పొదిగింది. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి ఎస్టీ కాలనీలోని సుబ్రమణ్యంరెడ్డి ఇంట్లో 4 కోళ్లతో పాటు ఒక పుంజు ఉంది. ఈ కోడి పుంజు ఐదు గుడ్లు పెట్టింది. ఇదేంటి గుడ్లు పెడుతోందని యజమాని ఆశ్చర్యపోయాడు. అయితే ఏం చేస్తుందో చూడాలని, ఆ గుడ్లు తీసుకెళ్లి పుంజు కిందపెట్టడంతో అది 5 పిల్లలను పొదిగింది. ప్రస్తుతం ఆ పుంజు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ కోడిపుంజును, పిల్లలను చూసి వెళ్తున్నారు. అయితే పుంజు గుడ్లు పెట్టడంపై వెటర్నరీ అధికారి వీరభద్రరెడ్డి వివరణ ఇచ్చారు. జన్యుపరమైన కారణాలతో ఇలా అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతాయని తెలిపారు. -
తొట్టంబేడులో దారుణం
చిత్తూరు: చిత్తూరు జిల్లా తొట్టంబేడులో దారుణం చోటు చేసుకుంది. చేతబడి పేరుతో యువతిని మంత్రగాడు మునిరెడ్డి లోబర్చుకున్నాడు. దాదాపు రెండు నెలల పాటు వైద్యం పేరిట అతడి నుంచి యువతి వేధింపులకు గురి అవుతుంది. ఆ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించేందుకు ప్రయత్నించారు. ఇంతలో గ్రామ పెద్దలు రంగంలోకి దిగి.. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ ఆదేశించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.