breaking news
Thota Seetaramalaxmi
-
రాజ్యసభకు సీతమ్మ
ఏలూరు, న్యూస్లైన్: జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. గతంలో ఆమె భీమవరం ముని సిపల్ చైర్మన్గా పనిచేశారు. ఆ సమయంలో ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుని మిగి లిన మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలకే వినియోగించారు. 2009లో నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన సీతారామలక్ష్మి ఓటమి పాలయ్యూరు. 2010 నుంచి ఇప్పటివరకూ జిల్లా టీడీపీ సారధ్య బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తున్నారు. 9న జిల్లాకు రాక : రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన తోట సీతారామలక్ష్మి ఈ నెల 9న జిల్లాకు రానున్నారని పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్ తెలిపారు. ఆ రోజు ఉదయం 8.30గంటలకు హైదరాబాద్లో విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.15 గంటలకు హనుమాన్ జంక్షన్లో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆమెకు ఘన స్వాగతం పలుకుతామని ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటలకు వట్లూరు మీదుగా ఏలూరుకు చేరుకుని ఫైర్స్టే షన్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తారు. 10.15 గంటలకు జిల్లా టీడీపీ కార్యాల యంలో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఏలూరు, గుండుగొలను, నారాయణపురం, గణపవరం, ఉండి మీదుగా భీమవరం చేరుకుంటారు. రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన సీతారామలక్ష్మిని హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, పార్టీ జిల్లా కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ), మాజీ మంత్రులు కారుపాటి వివేకానంద, పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మండల లక్ష్మణరావు, ఎం.కృష్ణం రాజు అభినందించారు. -
టీడీపీ అభ్యర్థులుగా గరికపాటి, తోట నామినేషన్లు
ఎవ్వరికీ సంతకం చేయని చంద్రబాబు మోత్కుపల్లి గైర్హాజరు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారాంకు అందజేశారు. గరికపాటి మూడు సెట్లు, సీతారామలక్ష్మి రెండు సెట్ల నామినేషన్లు వేశారు. అయితే వీరిలో ఏ ఒక్కరినీ ప్రతిపాదిస్తూ అధినేత చంద్రబాబు సంతకాలు చేయలేదు. నామినేషన్ల దాఖలు కార్యక్రమానికీ వెళ్లలేదు. గరికపాటి, సీతారామలక్ష్మి దాఖలు చేసిన నామినేషన్ పత్రాలపై 50 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. తనకు అవకాశం కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఎవరినీ ప్రతిపాదించకపోగా, నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. గరికపాటి నామినేషన్ పత్రాలపై పి.అశోక్ గజపతిరాజు, కేఈ కృష్ణమూర్తి, ఎర్రబెల్లి దయాకర్రావు, రేవూరి ప్రకాష్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పయ్యావుల కేశవ్ తదితరులు సంతకాలు చేశారు. సీతారామలక్ష్మి పత్రాలపై గాలి ముద్దుకృష్ణమ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు సంతకాలు చేశారు. టీడీపీ అభ్యర్థికే నా ఓటు: జేపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే మద్దతిస్తానని లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ చెప్పారు. ‘‘టీడీపీ అభ్యర్థికి మద్దతివ్వాలని చంద్రబాబు ఫోన్ చేశారు. అయితే ఇద్దరు టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేస్తాననేది ఇప్పుడే చెప్పలేను. నాకు ఉన్నదే ఒక్క ఓటు. దానిని టీఆర్ఎస్ అభ్యర్థి కేకేకు వేయలేను కదా’’ అని చెప్పారు. మోత్కుపల్లి వద్దకు బాబు రాయబారం సాక్షి, హైదరాబాద్: ‘‘వచ్చే ఎన్నికల్లో మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ సీటు ఇస్తాం. ఖర్చును కూడా మేమే భరిస్తాం’’ అంటూ తెలుగుదేశం సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వద్దకు అధినేత చంద్రబాబు మంగళవారం పలువురు నేతలను రాయబారానికి పంపారు. వారి ప్రతిపాదనను విన్న మోత్కుపల్లి ఏమాత్రం స్పందించలేదు. తన మనసులో ఏముందో కూడా ఆయన బైట పెట్టలేదు. రాయబారానికి వచ్చిన నేతలు మాత్రం.. మోత్కుపల్లి అలక వీడారని, ఇక అంతా ప్రశాంతతేనని చెబుతున్నారు.