breaking news
thipparthi
-
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
తిప్పర్తి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో.. బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాయినిగూడెం సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు. -
తిప్పర్తిలో దొంగల బీభత్సం
తిప్పర్తి (నల్లగొండ జిల్లా) : తిప్పర్తి మండలంలో సోమవారం దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా మూడు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. బంగారం, వెండి, నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. మాడ్గులపల్లి గ్రామంలో చిలుముల శ్రీనివాస రెడ్డి ఇంట్లో 60 వేల నగదు, 3 తులాల బంగారం దొంగిలించారు. ఇండ్లూర్ గ్రామపంచాయితీ వడ్డెర గూడెంలో పల్లపు లింగయ్య ఇంట్లో 3 తులాల బంగారం, 40 తులాల వెండి, 10 వేల నగదును దొంగిలించారు. చెర్వుపల్లి గ్రామంలో తోట దగ్గర ఉన్న ఇంట్లో ఒక కలర్ టీవీని ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.