-
జర్మనీలో ఘనంగా ఉగాది వేడుకలు
ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ : నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ వేడుకలు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఘనంగా నిర్వహించారు. జర్మనీ తెలుగు వెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సోస్సెన్ హైం ఆడిటోరియంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ ఎంబసీ కాన్సులేట్ జనరల్ ప్రతిభ పార్కర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఫ్రాంక్ఫర్ట్ నగర పురపాలక ప్రతినిధి మోబిస్ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగువెలుగు సంస్థ కమిటీని, వారు చేసే వివిధ సాంస్కృతిక సేవలను కొనియాడారు. గాయకులు ధనుంజయ్, సాయి శిల్పలు వారి ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. భూషణ సాయి హేమంత్ కృష్ణ తన నాసికా వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. నదియా నృత్య ప్రదర్శన తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇండియన్ మ్యూజిక్ అకాడమీ, ఇండియన్ డాన్స్ అకాడమీ, ఉజ్వల డాన్స్ గ్రూప్, ఫ్రాంక్ఫర్ట్ గర్ల్స్ ఎంతో ఉత్సాహంగా వారి కళలను ప్రదర్శించారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు రుచి రెస్టారెంట్ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసింది. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన రుచి రెస్టారెంట్, ఎయిర్ ఇండియా, హెక్స్డ్ సాఫ్ట్వేర్, జవాజి సాఫ్ట్వేర్, జస్ట్ 1 బజార్, స్పూన్స్ అండ్ ఫోక్స్, వాట్సమన్ కన్సల్టింగ్, పిజె ఈవెంట్స్ వారికి సంస్థ అధ్యక్షుల సాయి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
గ్రామాలకు దూరంగా ఆర్టీసీ
గ్రామీణులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఆర్టీసీ తెలు గు వెలుగు పేరుతో బస్సులు నడుపుతోంది. పదేళ్ల క్రితం వరకు ఇవి బాగా నడిచేవి. పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం..ప్రయివేటు వాహనాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవ డం, వాటిపై నియంత్రణ లేకపోవడంతో ఆర్టీసీ బస్సులకు నష్టాలు రావడం మొదలుపెట్టాయి. ప్రయివేటు వాహనాలను అడ్డుకోవాల్సిన అధికారులు దాన్ని పక్కనబెట్టి నష్టాల పేరుతో ఆర్టీసీ బస్సులను నిలిపేయడం ప్రారంభించారు. ఈ కారణంగా సంస్థకు నష్టాలు తగ్గకపోగా ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. మదనపల్లె అర్బన్: ఆధ్యాత్మికంగా పేరుగాంచిన మన జిల్లాలో యాత్రికుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ, నగర ప్రాంతాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రయాణికులూ రోజూ వేలల్లో ఉంటారు. వీరికి తెలుగు వెలుగు బస్సులు ఎంతో సౌకర్యంగా ఉన్నాయి. నష్టాల పేరుతో వాటిని ప్రతియేటా తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలోని 14 డిపోల పరిధిలో ఆరేళ్ల క్రితం 714 పల్లె వెలుగు బస్సులు ఉండేవి. ప్రస్తుతం వాటిని 598కి తగ్గించేశారు. అత్యధికంగా పీలేరు డిపోలో గత ఏడాది 76 సర్వీసులుండగా ఈ ఏడాది మూడు బస్సులు పెంచారు. మిగిలిన అన్ని డిపోల్లో తగ్గించారు. తెలుగు వెలుగు బస్సులకు కి.మీకు రూ.27 ఖర్చు అవుతుండగా చాలా ప్రాంతాల్లో రూ.పది నుంచి 15 మధ్య వస్తోందని అధికారులు చెబుతున్నారు. గ్రామాలకు ఆర్టీసీ సర్వీసు నడపటం ద్వారా కిమీకు రూ.15 నష్టపోవాల్సి వస్తోందని అంటున్నారు. ఆర్టీసీ అధికారుల వాదన ఇలా ఉండగా ప్రయివేటు వాహనాల వల్ల రోజుకు రూ.43.61 లక్షలు, నెలకు దాదాపు రూ.13 కోట్లు నష్టం వస్తోందని అంచనా. గ్రామాలకు సర్వీసులు తక్కువగా ఉండటం వల్లే ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని గ్రామీణులు చెబుతున్నారు. రద్దీకి తగ్గట్లు బస్సులు నడిపితే ప్రయివేటు వాహనాల హవా తగ్గించవచ్చునని అంటున్నారు. భారీగా తగ్గిన బస్సులు.. మదనపల్లె ఒకటో డిపో నుంచి రెండు నెలల కాలంలో 12 తెలుగు వెలుగు సర్వీసులను నిలిపేశారు. మదనపల్లె నుంచి బురకాయలకోట మీదుగా బి.కొత్తకోటకు 30 ఏళ్లుగా నడుపుతున్న గోళ్లపల్లి సర్వీసులో ఒక ట్రిప్పును నిలిపేశారు. సదుం–చింతామణి సర్వీసును ఏడాది కిందట రద్దు చేశారు. ప్రస్తుతం మదనపల్లె ఒకటో డిపోలో 79, రెండో డిపోలో 68, పీలేరులో 79, పలమనేరులో 54, చిత్తూరు ఒకటో డిపోలో 32, రెండో డిపోలో 43, కుప్పంలో 57, పుత్తూరులో 54, సత్యవేడులో 35, శ్రీకాళహస్తిలో 43, తిరుపతిలో 43, మంగళంలో 11 తెలుగు వెలుగు బస్సులు నడుస్తున్నాయి. సిటీ బస్సుల నష్టాలకూ ఇదే కారణం.. తిరుపతిలో సిటీ బస్సులు కూడా నష్టాలే మిగులుస్తున్నాయి. సర్వీసుల మధ్య కాలవ్యవధి ఎక్కువగా ఉండటం, ప్రైవేటు వాహనాలు తిరుగుతుండటమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఆర్టీసీ అధికారులు ఉన్నతాధికారులకు నెలనెలా నివేదికలు అందిస్తున్నా అవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రయివేటు వాహనాలను అడ్డుకోవడమేగాక, సర్వీసులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైఎస్సార్ జిల్లాలో విజయవంతం.. ఆర్టీసీ పరిరక్షణ పేరుతో వైఎస్సార్ జిల్లాలో అవలంబిస్తున్న విధానం లాభాలు తెచ్చిపెడుతోంది. డిపోల వారీగా నష్టాలు వస్తున్న రూట్లను గుర్తిస్తున్నారు. ప్రైవేటు వాహనాలు అధికంగా తిరుగుతున్న రూట్లను గుర్తించి ఒక డిపో మేనేజరు, ఇద్దరు ట్రాఫిక్ పర్యవేక్షకులు, సెక్యూరిటీ గార్డు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేపడుతున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని ప్రైవేటు వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోనివ్వడం లేదు. ఆ రూట్లలో రద్దీకి అనుగుణంగా బస్సులను తిప్పుతుండటంతో లాభాలు తెచ్చి పెడుతున్నాయి. మన జిల్లాలో రోజుకు ఒక బృందం మాత్రమే తిరుగుతుండటంతో కార్యక్రమం ఫలప్రదం కావట్లేదు. ఈ బృందం తిరుగుతున్న రూట్లలో రోజుకు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం పెరుగుతోంది. -
పల్లెల్లో తెలుగు వెలుగులేవీ?
126 గ్రామాలకు తెలుగు వెలుగులు దూరం శ్లాక్ సీజన్ పేరుతో 21 సర్వీసుల రద్దు – ప్రయాణికుల ఇక్కట్లు ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి సురక్షితంగా గమ్యం చేరండి.. ప్రైవేటు వాహనాలు ఆశ్రయించకండి.. ప్రమాదాల బారిన పడకండి’ అని అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. రూట్లో ఆదాయం వస్తేనే బస్సును తిప్పండి లేదంటే నిలిపివేయండంటూ ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో కొన్ని పల్లెల్లో తెలుగు వెలుగు బస్సులు కనిపించడం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నెల్లూరు(టౌన్): జిల్లాలో 126 గ్రామాలకు నేటికి ఆర్టీసీ బస్సులు నడవడం లేదంటే కొంత ఆశ్చర్యంగా ఉన్నా నమ్మక తప్పదు. తాజాగా శ్లాక్ సీజన్ పేరుతో నష్టాలు వస్తున్నాయంటూ ప్రధాన రహదారుల్లో తిరుగుతున్న 21 సర్వీసులను నిలిపివేశారు. వీటిపై ఆర్టీసీ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. నాలుగు రోజుల క్రితం నుంచి 21 సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో సర్వీసులు నిలిపివేయడంపై ఆర్టీసీ సంఘాలు మండిపడుతున్నాయి. నెల్లూరు డిపో–1 నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడకు తిరుగుతున్న మూడు బస్సులను నిలిపివేశారు. డిపో–2 నుంచి చెన్నై నుంచి విజయవాడ తిరుగుతున్న బస్సును రద్దు చేశారు. అదేవిధంగా రాపూరు డిపో నుంచి –1, ఆత్మకూరు డిపో నుంచి–3 కావలి నుంచి–4, ఉదయగిరి నుంచి –4, వాకాడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి డిపోల నుంచి ఒక్కో బస్సును రద్దు చేశారు. బెంగళూరు, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, తిరుపతికి తిరుగుతున్న బస్సులను రద్దు చేశారు. సర్వీసుల రద్దు చేయడానికి ప్రైవేటు వాహనాల యజమానుల నుంచి అందుతున్న ముడుపులే కారణమని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బస్సులు తిరగని గ్రామాలు... నష్టాలు వస్తున్నాయని, రోడ్డు బాగాలేదని చెబుతూ ఇప్పటికి జిల్లాలో 126 గ్రామాల్లో ఆర్టీసీ బస్సులను తిప్పడం లేదు. అనంతసాగరం రూట్లో చీపురపల్లి, చాకురాళ్లపల్లి, కావలి మండలంలో కోనేటిపాలెం, గానుగపెంట, దగదర్తి రూట్లో మట్టెంపాడు, సంగం రూట్లో నీలాయపాలెం, తిమ్మాపురం, చింతూరు, ఆనపల్లిపాడు, వెంగమాంబపురం, దేవరవేమూరు, అత్తలసిద్దవరం, కోనేశ్వరపాడు, ఎల్లవగ్గపలి, తిమ్మినగుంట, లింగంపాలెం, బొట్ల, కొత్తనల్లపాడు, పెనుబర్తిగోపవరం, శుద్ధమల్లి, కోటూరుపాడు, చందనమూడి, మనిమాలముడి, సూరపుఅగ్రహారం, బురదమడుగు, యల్లాయపాలెం, వేటగిరిపాలెం గ్రామాలకు బస్సులు తిరగడం లేదు. సూళ్లూరుపేట మండలంలో చెరువుమిట్ట, కొమ్మినేనిపల్లి, పంట్రంగం, సర్వారెడ్డికొండ, ఎర్రబల్లి, వాకాడు మండలంలో పాటెటిపాలెం, జువ్వినట్టు, రెడ్డిపాలెం, పంబలి, పుదిరాయదరువు, ఉదయగిరి నుంచి కిష్టంపల్లి మీదుగా అర్లపడిగ, బిజ్జంపల్లి, అప్పసముద్రం, గూడూరు నుంచి చెర్లోపల్లి, కుడితపల్లి, కాగితాలపూర్, లక్ష్మీనరసాపురం, కొడవలూరు మండలం యల్లాయపాలెం, రామన్నపాలెం, మానేగుంటపాడు, రెడ్డిపాలెం, ఆలూరు తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ ప్రాంత ప్రజలు ప్రైవేట వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కావాలనే సర్వీసులను రద్దు చేశారు : – రమణరాజు, ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికారులు కావాలనే సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం శ్రావణమాసం సందర్భంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు పుష్కరాలు కూడా జరగనున్నాయి. శ్లాక్ సీజన్ పేరుతో బస్సులను రద్దు చేయడం తగదు. వెంటనే వాటిని పునరుద్ధరించాలి. ఆదరణ ఉంటే తప్పకుండా తిప్పుతాం : రవివర్మ, ఆర్టీసీ ఆర్ఎం రూట్లల్లో ఆదరణ, ఆదాయం వస్తే తప్పకుండా బస్సులను తిప్పుతాం. నష్టాలు వస్తే బస్సులను తిప్పలేం. శ్లాక్ సీజన్ కారణంగా ప్రయాణికులు తక్కువగా ఉండటంతోనే ఆ సర్వీసులను నిలిపివేశాం. రద్దీ రోజుల్లో అదనంగా 48 సర్వీసులను తిప్పాం. -
తెలుగు వెలుగు సూర్యుడు అన్నమయ్య
విజయవాడ కల్చరల్ : తెలుగు వెలుగు సూర్యుడు అన్నమయ్య అని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. దిలీప్కుమార్ కల్చరల్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో శివరామకృష్ణ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తన కచేరీ జరిగింది. ముఖ్య అతిథి తులసిరెడ్డి మాట్లాడుతూ పద కవితకు అన్నమయ్య ఆద్యుడని, ఆయన సాహిత్యం నిండా సామాజిక స్పృహ నిండి ఉంటుందని చెప్పారు. జ్యోతిష్య శాస్త్రవేత్త అచ్చిరెడ్డి గురుంచి మాట్లాడుతూ 179 పుస్తకాలకు పైగా జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన పవర్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ గ్రంథాన్ని రచించారని, జ్యోతిష్య అంశాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. యువ జ్యోతిష్య శాస్త్రవేత్త వంశీకృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ కిషోర్ తదితరులు మాట్లాడారు. భక్తి సంగీత విభావరి కార్యక్రమంలో భాగంగా గాయకుడు దిలీప్కుమార్ స్వరపరిచిన సంకీర్తనలను గాయనీమణులు టీవీఎస్ శ్రీదేవి, జ్యోతి, కొమ్మినేని రత్నకుమారి ఆలపించారు. -
వేడుకగా ఉగాది పురస్కారాలు
32 మందికి కళారత్న, 67 మందికి ఉగాది పురస్కారాలు బాలాంత్రపు రజనీ కాంతారావుకు ‘తెలుగు వెలుగు’ పురస్కారం సాక్షి, విజయవాడ బ్యూరో: మన్మథ నామ సంవత్సర ఉగాది వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వం వివిధ రంగాల్లో నిష్ణాతులైన 100 మంది ప్రముఖులకు శనివారం ‘2015 కళారత్న (హంస), ఉగాది పురస్కారాలను అందజేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో శనివారం జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావులు వీటిని అందజేశారు. ప్రముఖ వాగ్గేయకారుడు డాక్టర్ బాలాంత్రపు రజనీ కాంతారావుకు తెలుగు వెలుగు విశిష్ట పురస్కారాన్ని అందించి సత్కరించారు. అదేవిధంగా 32 మందికి హంస, మరో 67 మంది ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. హంస పురస్కార గ్రహీతలకు రూ. 50 వేలు, ఉగాది పురస్కార గ్రహీతలకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతిని అందజేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement