breaking news
telugu nadu
-
‘తెలుగునాడు’గా సీమాంధ్ర: డొక్కా
అసెంబ్లీ సీట్లను 175నుంచి 225కు పెంచాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్ పేరును ‘తెలుగు నాడు’గా మార్చాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు. సీమాంధ్ర పరిధిలోని 175 అసెంబ్లీ స్థానాలను 225కు, తెలంగాణలోని 119 సీట్లను 153కు పెంచాలని కూడా కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఈ మేరకు మార్పులు కోరుతూ మంత్రి మాణిక్యవర ప్రసాద్ శుక్రవారం శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు సవరణలను ప్రతిపాదించారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపేసి, ‘రాయల తెలంగాణ’ను ఏర్పాటు చేయాలని, భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపాలని సూచించారు. తాను సూచించిన సవరణలను సభ పరిగణనలోకి తీసుకోని పక్షంలో విభజన బిల్లును వ్యతిరేకిస్తానని పేర్కొన్నారు. -
సీమాంధ్ర పేరును తెలుగు నాడుగా మార్చాలి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అనివార్యమైతే సీమాంధ్ర పేరును తెలుగునాడుగా మార్చాలని మంత్రి డొక్కా మాణిక్య ప్రసాదరావు తెలిపారు. సాగు భూములను పరిశ్రమలకు ఇవ్వడంపై నిషేధం విధించాలని కోరారు. బిల్లుకు సంబంధించి ఆయన కొన్ని సవరణలను సభాపతికి సూచించిన డొక్కా.. సీమాంధ్ర పేరును తెలుగు నాడుగా మార్చాలన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణ రాష్ట్రంలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ శాసన సభ స్థానలను పెంచాలని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఉన్న భద్రాచలం డివిజన్ ను సీమాంధ్ర ప్రాంతంలో కలపాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ స్థానాలను పునర్విభజన చేయాలని సూచించారు.