-
వైఎస్ఆర్ సీపీ ఎంపీలను అడ్డుకోండి: బాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనకుండా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకోగా.. పార్లమెంట్లో కూడా ప్రత్యేక హోదాపై ఆ పార్టీ ఎంపీలు చేసే పోరాటాన్ని అడ్డుకోవాలని టీడీపీ ఎంపీలకు సూచించినట్టు తెలుస్తోంది. సోమవారం జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీల రాజీనామా విషయం చర్చకు వచ్చింది. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు రాజీనామా చేయకముందే.. ప్యాకేజీకి చట్ట భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. అవసరమైతే ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని, ఢిల్లీకి కూడా వచ్చి మాట్లాడుతానని చంద్రబాబు ఎంపీలతో చెప్పారు. ప్యాకేజీకి చట్ట భద్రత కల్పించేలా టీడీపీ ఎంపీలు పోరాడాలని సూచించారు. ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ సీపీ ఎంపీల పోరాటాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు పార్టీ ఎంపీలను ఆదేశించారు. -
టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం
విజయవాడ : తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మంగళవారమిక్కడ సమావేశమైంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. రేపటి నుంచి (బుధవారం) జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సభలో ప్రస్తావించడం, కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేయడంపై ఈ భేటీలో దృష్టి సారిస్తారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి హాజరయ్యారు. -
15న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
అమరావతి: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15న(మంగళవారం) జరగనుంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. బుధవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చిస్తారు. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సభలో ప్రస్తావించటం, కేంద్రానికి మరోమారు విజ్ఞప్తి చేయటంపై ఈ సమావేశంలో దృష్టి సారించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా జరగనుంది. -
టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతల మధ్య విభేదాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శనివారం జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. హుద్ హద్ తుపాను నష్ట నివారణకు ఒక్కో ఎంపీ రూ.కోటి ఇస్తామన్నారని... కానీ ఇప్పటి వరకూ ఏమీ ఇవ్వలేదని బాబు తెలపగా దానికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తమ ప్రాంతంలో తాగునీటి సమస్యకు ఖర్చు పెట్టాల్సి ఉందని సీఎంకు దివాకర్ రెడ్డి తెలిపారు. దీంతో జేసీ వ్యాఖ్యలతో చంద్రబాబు విభేదించారు. ప్రతి ఒక్కరూ మాట ఇచ్చారని.. తప్పకుండా రూ. కోటి చొప్పున ఇవ్వాల్సిందేనని చంద్రబాబు వారికి సూచించారు. ఎంపీలు నిధులు అందిస్తే రాష్ట్రం నుంచి మరో రూ.24 కోట్లు ఇస్తామని బాబు తెలిపారు. ఆ నిధులతో ఇళ్లు నిర్మాణం చేపట్టవచ్చని ఆయన ఎంపీలకు తెలిపారు. హుద్ హుద్ తుపాను సాయం కోసం కేంద్రం నుంచి నిధులు సాధించలేకపోయామని ఈ సందర్భంగా బాబు ఎంపీల వద్ద ప్రస్తావించారు. -
నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాయితీల విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు పోరాడితే..మద్దతివ్వాలా లేదా అని తర్జనభర్జనలో ఉంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement