breaking news
Teaching Assistants
-
వేతన పెరుగుదలలో టీచింగ్ లీడర్లదే హవా!
వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్లో కంపెనీలకు నాయకత్వ వాహిస్తున్న వారికి మెరుగైన వేతనాలున్నాయని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీలను విజయపథంలో నడిపించడంలో సమర్థవంతమైన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందనేది రహస్యమేమీ కాదు. అయితే స్టార్టప్ లీడర్లు, ముఖ్యంగా టీచింగ్ రోల్స్లో ఉన్నవారు వేతనాల విషయంలో 80 శాతం ముందంజలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.బోధించే నాయకుల ప్రాముఖ్యతస్టార్టప్ల్లో టీచింగ్ లీడర్లు అంటే సంస్థల్లో మెంటార్షిప్, ఎడ్యుకేషనల్ బాధ్యతలను చేపట్టేవారు. ఈ వ్యక్తులు తమ బృందాలకు నాయకత్వం వహించడమే కాకుండా సహోద్యోగుల నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అలా చేయడం ద్వారా నిరంతర అభ్యాసం, నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుంది. స్టార్టప్ల సుస్థిరతకు ఇది ఎంతో అవసరం అవుతుంది.ఇదీ చదవండి: ఇంటి ఓనర్ మహిళ అయితే ఎన్ని ప్రయోజనాలో..ఫైనాన్షియల్ రివార్డులుస్టార్టప్ల్లో టీచింగ్ లీడర్లకు ఇచ్చే ఆర్థిక రివార్డులు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం బోధనా బాధ్యతలను చేపట్టే నాయకులు, అటువంటి కార్యకలాపాల్లో పాల్గొనని ఒకే స్థాయి తోటి ఉద్యోగులతో పోలిస్తే వేతన ప్యాకేజీలపరంగా 80 శాతం ముందుంజలో ఉంటున్నారు. ఈ వేతన పెంపునకు కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.సంస్థ విలువను పెంచడం: టీచింగ్ లీడర్లను సంస్థకు సంబంధించిన అమూల్యమైన ఆస్తులుగా పరిగణిస్తారు. ఎందుకంటే వారు టీమ్ మొత్తం అభివృద్ధికి దోహదం చేస్తారు. ఇతర ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచి స్టార్టప్ పనితీరును ప్రభావితం చేస్తారు.ప్రతిభను నిలుపుకోవడం: బలమైన టీచింగ్ లీడర్లు ఉన్న స్టార్టప్లు టాప్ టాలెంట్ను ఆకర్షించడానికి, దాన్ని నిలుపుకోవడానికి మొగ్గు చూపుతాయి. ఉద్యోగులు కంపెనీ ఎదిగేందుకు సహకరిస్తూ, టర్నోవర్ వ్యయాలను తగ్గించే అవకాశం ఉంటుంది.మెరుగైన నాయకత్వ నైపుణ్యాలు: టీచింగ్ లీడర్లు సహజంగానే అధునాతన నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ఇతరులకు మార్గనిర్దేశం చేయడం ద్వారా వారు తమ కమ్యూనికేషన్, సమస్యా పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరుస్తారు. -
వర్సిటీల్లో వసూల్ రాజాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అధికారంలో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు తెలంగాణకు చెందిన ఓ కీలక మంత్రి పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తోన్న 2,100 మంది టీచింగ్ అసిస్టెంట్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించి, క్రమబద్ధీకరిస్తామని ఎర వేశారు. తన అనుచరులను వర్సిటీలకు పురమాయించి ఒక్కో టీచింగ్ అసిస్టెంట్ నుంచి రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకు వసూలు చేయిస్తున్నారు. అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ), జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ)లో మంత్రి అనుచరుల వసూళ్ల బాగోతం బహిర్గతమైంది. వసూలు చేసిన వారిపై కేసులు పెట్టేందుకు సిద్ధమైన జేఎన్టీయూ, ఎస్కేయూ యాజమాన్యాన్ని మంత్రి తీవ్ర స్థాయిలో బెదిరించినట్లు వర్సిటీ అధికారవర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో 32 విశ్వవిద్యాలయాల్లో 2,100 మంది కాంట్రాక్టు పద్ధతిలో టీచింగ్ అసిస్టెంట్లుగా ఐదారేళ్ల నుంచి పనిచేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తోన్న టీచింగ్ అసిస్టెంట్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించి, క్రమబద్ధీకరించిన దాఖలాలు వర్సిటీల చరిత్రలో మచ్చుకైనా కన్పించవు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వర్సిటీల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తారు. రాత, మౌఖిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమిస్తారు. ఈ ప్రక్రియలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే టీచింగ్ అసిస్టెంట్లకు కనీసం మార్కుల్లో వెయిటేజీ కూడా ఇవ్వరు. కానీ.. ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తోన్న తెలంగాణ ‘కీలక’ మంత్రికి అవేమీ పట్టలేదు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తోన్న టీచింగ్ అసిస్టెంట్ల సర్వీసును క్రమబద్ధీకరించడమే కాకుండా.. అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమిస్తామంటూ వల విసిరారు. ఒక్కో టీచింగ్ అసిస్టెంట్ కనీసం రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకూ ముట్టజెప్పాలని షరతు విధించారు. ఇదే షరతుపై వర్సిటీలకు తనకు సన్నిహితులైన అనుచరులను పంపి.. టీచింగ్ అసిస్టెంట్లతో గుట్టుగా సమావేశాలు నిర్వహింపజేస్తున్నారు. ఆ క్రమంలోనే మంగళవారం ఎస్కేయూలో.. బుధవారం జేఎన్టీయూలో టీచింగ్ అసిస్టెంట్లతో మంత్రి అనుచరులు రహస్యంగా సమావేశమయ్యారు. ఎన్నికలు షెడ్యూలు ఎప్పుడైనా రావచ్చునని.. అప్పుడు ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి అది అడ్డొస్తుందని.. ఆలోగానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి అనుచరులు స్పష్టమైన హామీ ఇచ్చారు. సమావేశంలోనే ఒకరిద్దరు టీచింగ్ అసిస్టెంట్లను సెల్ఫోన్లో నేరుగా మంత్రితోనే వారు మాట్లాడించడంతో తక్కిన వారిలో నమ్మకం కుదిరింది. బుధవారం సాయంత్రంలోగా డబ్బులు ముట్టజెబితే.. పక్షం రోజుల్లోనే నియామకపు ఉత్తర్వులు అందించే పూచీ తమదని సదరు మంత్రి అనుచరులు హామీ ఇచ్చేశారు. మంత్రి, ఆయన అనుచరుల మాటలను నమ్మిన ఎస్కేయూలోని 24 మంది టీచింగ్ అసిస్టెంట్లు.. జేఎన్టీయూలోని 59 మంది టీచింగ్ అసిస్టెంట్లు డబ్బులు ముట్టజెప్పారు. రెండు వ ర్సిటీల్లోని టీచింగ్ అసిస్టెంట్ల నుంచి సుమారు రూ.రెండు కోట్లను మంత్రి అనుచరులు వసూలు చేశారు. ఇది కాస్త వర్సిటీల యాజమాన్యాల దృష్టికి వెళ్లడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. టీచింగ్ అసిస్టెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసిన మంత్రి అనుచరులపై కేసులు పెట్టడానికి సమాయత్తమయ్యారు. ఇది పసిగట్టిన మంత్రి వర్సిటీల యాజమాన్యాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మంత్రి బెదిరింపులకు తలొగ్గిన యాజమాన్యాలు.. కేసు పెట్టేందుకు వెనుకంజ వేశాయి.