-
బడికి తాళం వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
-
స్కూల్లో పిల్లాడు.. తాళం వేసుకు వెళ్లిపోయిన టీచర్లు
తరగతి గదిలో చిన్న పిల్లాడు ఉన్నా కూడా చూడకుండా పాఠశాలకు తాళం వేసుకు వెళ్లిపోయారు ఉపాధ్యాయులు. నిర్లక్ష్యానికి నిలువుటద్దం లాంటి ఈ సంఘటన కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలో జరిగింది. సొర్లగొంది గ్రామంలో నరసింహస్వామి అనే బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం 4 గంటలకే స్కూలు అయిపోయినా.. ఆరు గంటల వరకు కూడా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గాభరాపడ్డారు. ఊరంతా వెతుక్కుంటూ వెళ్లి, ఎందుకైనా మంచిదని పాఠశాలకు వెళ్లి చూడగా, తరగతి గదిలో నేలపై పడుకుని నిద్రపోతున్న స్వామి కనిపించాడు. అప్పటికే బాగా ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయినట్లు గుర్తించారు. తలుపు తాళం వేసి ఉండటంతో తాళం పగలగొట్టి, పిల్లాడిని బయటకు తీసుకొచ్చారు. ఒకటో తరగతి పిల్లాడు లోపలున్నా చూడకుండా తాళం వేసుకుని వెళ్లిపోయిన ఉపాధ్యాయులను ఏమనాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement