breaking news
tapaspally
-
కరువు నేలకు కల్పతరువు
సాక్షి, సిద్దిపేట : రాష్ట్రంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతాలు జనగామ, సిద్దిపేట జిల్లాలకు తపాస్పల్లి రిజర్వాయర్ కల్పతరువుగా మారింది. ఈ జిల్లాల్లోని బీడు భూములకు దేవాదుల ఎత్తిపోతల ద్వారా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం తపాస్పల్లి వద్ద రిజర్వాయర్లో నీటిని ఎత్తిపోసి సాగునీరు అందిస్తున్నారు. 54 చెరువులకు ఆధారం.. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి ఏటా సిద్దిపేట, జనగామ జిల్లాల్లోని కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, కొండపాక మండలాల్లోని సుమారు 54 చెరువులను నింపుతున్నారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 0.3 టీఎంసీ కాగా, మరో 1.2 టీఎంసీలను గోదావరి జలాలతో ఈ 5 మండలాల్లోని చెరువులకు తరలిస్తున్నారు. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లకు తాగునీటి కోసం కొమురవెల్లిలోని 13 చెరువులు, చేర్యాలలో 8, మద్దూరులో 1, కొండపాకలో 7 చెరువులు, బచ్చన్నపేటలోని 25 చెరువులు నింపారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మరిన్ని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో... సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట ప్రాంతానికి గోదావరి జలాలు తరలించాలంటే ఎత్తిపోతలే మార్గం.. దీన్ని గుర్తించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2007లో తపాస్పల్లి ఎత్తిపోతల పనులకు శ్రీకారం చుట్టారు. 65 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దీని నిర్మాణం చేపట్టారు. వైఎస్సార్ హయాం తర్వాత పెద్దగా పనులు జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, నీటి పారుదల మంత్రి హరీశ్రావుల సహకారంతో ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. దీంతో ఈ రిజర్వాయర్ కింద 82,500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. 25 శాతం పనులు పెండింగ్లోనే... 2007లో ప్రారంభించిన తపాస్పల్లి రిజర్వాయర్ నిర్మాణంలో ఇప్పటికీ 75 శాతం పనులే మాత్రమే పూర్తయ్యాయి. మరో 25 శాతం పనులు పెండింగ్లో ఉన్నాయి. కష్టాలు తీరాయి.. గోదావరి జలాలతో తపాస్పల్లి రిజర్వా యర్ను నింపి, తద్వార చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో కరువు ప్రాంతమైన సాగుకు అనుకూలమైంది. ఏటా చెరువులు నింపడంతో వ్యవసాయం చేయడానికి నీళ్ల కష్టం తొలగిపోయింది. ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు. – మెరుగు క్రిష్ణ , రైతు ఐనాపూరు కాల్వల నిర్మాణం పూర్తి చేయాలి రిజర్వాయర్ ఎడమ, కుడి కాల్వలు, ఉపకాల్వలను పూర్తిచేసి సాగునీరు అందించాలి. మెయిన్ కాల్వలు పూర్తయినా నిరుపయోగంగా ఉన్నాయి. వెంటనే కాల్వల నిర్మాణం పూర్తి చేసి పొలాలకు నీరందించాలి. – చెరుకు రమణారెడ్డి, ఐనాపూర్ -
చెరువులకు జలాల తరలింపులో ఘర్షణ
∙కాల్వకు రేకులను అడ్డంగా పెట్టిన నాగపురి గ్రామస్తులు ∙వాటిని తొలగించేందుకు యత్నించిన పోతిరెడ్డిపల్లివాసులు చేర్యాల : తపాస్పల్లి రిజర్వాయర్ నుంచిlపోతిరెడ్డిపల్లిలోని బయ్యన్న చెరువులోకి గోదావరి జలాలను తరలిస్తుండగా, నల్లపోచమ్మ సమీపంలో ఉన్న దేవాదుల కాల్వలోకి నీళ్లు చేరకుండా నాగపురి గ్రా మస్తులు రేకులను అడ్డుపెట్టారు. దీంతో పోతిరెడ్డిపల్లి, నాగపురి గ్రామస్తుల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. పోతిరెడ్డిపల్లివాసులు కాల్వ వద్దకు చేరుకొని రేకులను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో పోతిరెడ్డిపల్లికి చెందిన పెంబర్ల కనకయ్య, పెంబర్ల బాగయ్య, గూడురు బాలరాజు, పెంబర్ల యాదగిరి, పోరెడ్డి రమేశ్ గాయపడ్డారు. నాగపురికి చెందిన పలువురు పోతిరెడ్డిపల్లి గ్రామస్తులకు చెందిన బైక్ల గాలి తీయడం కూడా ఘర్షణకు ఓ కారణంగా పేర్కొంటున్నారు. దీనిపై బాధితులు చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రిజర్వాయర్లో పడి ఇద్దరు విద్యార్థుల మృతి
చేర్యాల(వరంగల్): రిజర్వాయర్ను చూడటానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ జిల్లా చేర్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎల్లాయపల్లికి సమీపంలోని విజయలక్ష్మి మెమోరియల్ పాఠశాల పీఈటీ 19 మంది విద్యార్థులను తిగుళ్లనర్సాపూర్లో జరుగుతున్న పాఠశాలల క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకెళ్లారు. అనంతరం వారంతా కలసి సమీపంలోని వరంగల్ జిల్లా టపాస్పల్లి జలాశయం వద్దకు వెళ్లారు. మొత్తం అయిదుగురు విద్యార్థులు నీళ్లలోకి దిగగా అదుపుతప్పి మునిగిపోయారు. వారిలో రంగస్వామి అనే విద్యార్థికి ఈదటం వచ్చు. అతడు ఇద్దరు విద్యార్థులను ఒడ్డుకు లాగగా ప్రవీణ్, నత్తలి అనే వారు మాత్రం మునిగిపోయారు. సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో ఒకరి మృతదేహాన్ని గత ఈతగాళ్లు వెలికి తీశారు. పవీణ్ స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా నేరడుగొండ కాగా, నత్తలిది రంగారెడ్డి జిల్లా కత్బుల్లాపూర్ గ్రామం.