breaking news
Tanniru Nageswara Rao
-
తిరువూరు ఎన్నిక.. వైఎస్సార్సీపీ నేతలు హౌస్ట్ అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్: నేడు తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయడంతో నేడు చైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు తిరువూరు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. శాంతిభద్రతల సాకుతో వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎన్నికల్లో బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. కూటమి ప్రభుత్వ వైఖరి, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘తిరువూరులో బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీకి 17 మంది కౌన్సిలర్ల బలం ఉంది. టీడీపీకి ఉన్నది కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే. ముగ్గురు కౌన్సిలర్లతో ఏవిధంగా గెలవాలనుకుంటున్నారు. అధికార బలంతో మున్సిపాల్టీ, నగర పాలక సంస్థలను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఎన్నికల్లో మీరు ఏం చెప్పి గెలిచారు. రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తామని ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి?. తిరువూరు వెళ్లొద్దని మా పై ఆంక్షలు పెట్టడమేంటి?. వెళితే అరెస్ట్ చేస్తామని వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. ఏపీలో పోలీసు రాజ్యం నడిపిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తిరువూరు వెళ్లి తీరుతాం. తిరువూరు మున్సిపాల్టీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం’ అని అన్నారు. మరోవైపు.. సోమవారం ఉదయమే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ..‘శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపించి వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్టు చేయటం కరెక్ట్ కాదు. రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాయటమే అవుతుంది. వైఎస్సార్సీపీకి 17 మంది కౌన్సిలర్ల మద్దతు ఉండగా తెలుగుదేశం పార్టీకి కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం తిరువూరు మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఫలితం మాత్రం శూన్యం’ అని అన్నారు. ఇక, వైఎస్సార్సీపీ తరఫున 17 మంది కౌన్సిలర్లు ఉండగా, టీడీపీ నుంచి ముగ్గురు గెలుపొందారు. ఎన్నికల్లో గెలించేందుకు బలం లేకపోయినప్పటికీ టీడీపీ కుట్రలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తూ తమ వైపు తిప్పుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. -
జగ్గయ్యపేటలో తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ అరెస్ట్.. బెయిల్
కేబుల్ నెట్వర్క్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు జగ్గయ్యపేట అర్బన్: నిబంధనలను అతిక్రమించి ప్రసారాలు చేస్తున్నారన్న అభియోగంపై శ్రీసాయిసూర్య డిజిటల్ కేబుల్ నెట్వర్క్ యాజమాన్య ప్రతినిధి, మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావును పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 12.30 సమయంలో మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్లో ఉన్న తన్నీరును సీఐ వై.వి.వి.ఎల్.నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. సన్నెట్ వర్క్ ప్రతినిధి జి.సంగమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 420 ఐపీసీ సెక్షన్ 51,63,65 కాపీరైట్ యాక్ట్ కింద తన్నీరును అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అనంతరం తన్నీరును కోర్టుకు తరలించిన పోలీసులు.. అక్కడ హాజరుపర్చకుండా సంతకం చేయాలంటూ తిరిగి స్టేషన్కు తీసుకొచ్చారు. రెండు గంటలు తరువాత మళ్లీ కోర్టుకు తీసుకెళ్లారు. పొద్దుపోయిన తరువాత తన్నీరుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఆయన విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు విరుద్ధంగా పోలీసులు తన్నీరును అరెస్టు చేశారని ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ బి.శ్రీనివాసులు తీర్పులో పేర్కొన్నారు.అరెస్ట్ సమాచారంతో వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పోలీస్స్టేషన్కు చేరుకొని ధర్నా చేశాయి.