-
ఉమాయాదవ్ హత్య కేసులో 12 మంది అరెస్టు
సాక్షి, మంగళగిరి: రౌడీషీటర్ తాడిబోయిన ఉమాయాదవ్ హత్యకేసులో 12 మంది నిందితులను సీఐ నరేష్కుమార్ అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. మృతుడు తాడిబోయిన ఉమాయాదవ్కు స్థానికంగా నివసించే తోట శ్రీనివాసరావు ఆధిపత్యపోరు నడుస్తుంది. ఇందులో భాగంగా తోట శ్రీనివాసరావు ప్రణాళికా ప్రకారం గత నెల 25వ తేదీన శ్రీనివాసరావు ఇంటి దగ్గర కాపు కాసి అదే దారిలో ఇంటికి వెళ్తున్న తాడిబోయిన ఉమాయాదవ్పై కత్తులతో దాడిచేసి హత్య చేశారు. హత్యలో పాల్గొన్న వారికి టీడీపీ నాయకులు ఏనుగ కిషోర్, చావలి మురళీకృష్ణ, నల్లగోర్ల శ్రీనివాసరావులు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడి కావడంతో మొత్తం 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసులో అరెస్టై కోర్టు రిమాండ్ విధించిన వారిలో తోట శ్రీనివాసరావు, తోట పానకాలు, రుద్రు గోపి, తోట సాంబశివరావు, తోట శ్రీకాంత్, చింతా శివప్రసాద్, ఏనుగ కిషోర్, కుర్రా సాంబశివరావు, చావలి మురళీకృష్ణ, తోట సైదులు, షేక్ వజీర్సుల్తాన్, నల్లగొర్ల శ్రీనివాసరావులున్నారు. చంద్రబాబు పర్యటన వాయిదా.. ఉమాయాదవ్ను హత్య చేసిన వారందరూ టీడీపీకి చెందిన వారని తెలియడంతో 8వ తేదీన మంగళగిరి పర్యటనను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిదా వేశారు. టీడీపీ నేత తాడిబోయిన ఉమాయాదవ్ కుటుంబాన్ని పరామర్శించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయాలని చూశారు. అయితే హత్యలో కీలక సూత్ర ధారులు అందరూ టీడీపీవారే కావడంతో ఊహించని రీతిలో చంద్రబాబు పర్యటన వాయిదా వేశారు. హత్య కేసులో కొంత మంది నిందితులను పోలీసులు ఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే అదుపులోకి తీసుకుని సీసీఎస్లో విచారించారు. అయితే సీసీఎస్లో ఏఎస్సైగా పనిచేస్తున్న ఓ వ్యక్తి నిందితులకు సెల్ఫోన్ ఇచ్చి వారు ప్రధాన నిందితులతో మాట్లాడే అవకాశం ఇవ్వడంతో ప్రధాన నిందితులు అప్రమత్తమైనట్లు సమాచారం. ఏఎస్సై నిందితులకు సహకరించడం వల్లే హత్యకేసులోని కీలక సూత్రధారులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులకు ఎక్కువ సమయం పట్టిందని తెలుస్తుంది. రాజధాని ప్రాంతంలో జరిగిన కేసులో ఏఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించి నిందితులకు సహకరించడాన్ని ఎస్పీ పీ.హెచ్.డీ.రామకృష్ణ సీరియస్గా తీసుకున్నట్లు పోలీసు వర్గాలు చర్చించకుంటున్నాయి. సీసీఎస్కు వచ్చే ప్రతి కేసులో ఇతను నిందితులకు ఏదో విధంగా సహకరించి లబ్ధి పొందుతున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసుకు సంబంధం లేనివారిని కూడా తీసుకెళ్లి వారి నుంచి డబ్బులు దండుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్న ఆరోపణలున్నాయి. -
సర్పంచ్ హత్య కేసులో ఏడుగురి అరెస్ట్
మంగళగిరి రూరల్, న్యూస్లైన్: బేతపూడి సర్పంచ్ బత్తుల నాగసాయి హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈనెల 17న గ్రామానికి చెందిన రాఘవమ్మ కుటుంబ వివాదం విషయమై పోలీసుస్టేషన్కు వెళ్లి కారులో రాత్రి తిరిగి వస్తుండగా దుండగులు దారికాచి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాడిబోయిన ఉమామహేశ్వరరావు అలియాస్ ఉమా యాదవ్, నల్లగొర్ల రామారావు, ఆలా సుబ్బారావు, పుప్పాల రామకృష్ణ, తాడిబోయిన మహేష్, దర్శి యోహాను, పుల్లగూర కోటేశ్వరరావులను అరెస్ట్ చేశారు. ఆ వివరాలను రూరల్ సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నార్త్సబ్ డివిజన్ డీఎస్పీ ఎం మధుసూదనరావు వెల్లడించారు. నాగసాయి మంగళగిరి పట్టణంలోని ద్వారకానగర్కు చెందిన ఆటో కన్సల్టెన్సీ నిర్వాహకుడు తాడిబోయిన ఉమా మహేశ్వరరావుతో కలిసి కొంతకాలం నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవారు. ఏడాది క్రితం ఇద్దరూ కలసి కొనుగోలు చేసిన 400 గజాల స్థలాన్ని నాగసాయి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరో 120 గజాల స్థలాన్ని కొనేందుకు ఉమామహేశ్వరరావు డబ్బులు ఇవ్వగా ఆ స్థలాన్ని కూడా నాగసాయి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై నిలదీయడంతో అంతుచూస్తానని బెదిరించారు. దీంతో నాగసాయిని హత్య చేయాలని ఉమామహేశ్వరరావు నిర్ణయించుకున్నారు. నాగసాయి కదలికలపై నిఘా పెట్టారు. రాఘవమ్మ కుటుంబ వివాదం విషయమై పోలీసుస్టేషన్కు వెళ్లిన విషయం తెలుసుకొని ఆమె కోడలి సోదరుడు ఆలాగోపిని ఇన్ఫార్మర్గా పెట్టుకున్నాడు. సమాచారం అందడంతో కత్తులు, గొడ్డళ్లు, రాడ్లుతో ఇండిగో కారులో వచ్చి నాగసాయి కారును అడ్డగించి ఆయనను బయటికి లాగి హత్యచేసి పరారయ్యారు. సాక్షుల నుంచి వివరాలు సేకరించిన రూరల్ సీఐ ఎం మధుసూదనరావు నిందితులను పెదవడ్లపూడి రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు. నిందితులకు సహకరించిన ఆలాగోపి పరారీలో ఉన్నాడు. కేసును ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్..!
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement